Russia: అందుకే.. చైనాతో బంధం మరింత బలోపేతం!
పాశ్చాత్య దేశాల ఒత్తిడి కారణంగానే చైనా(China)తో తమ సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయని రష్యా (Russia) పేర్కొంది.
బీజింగ్: ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దురాక్రమణ (Russia Invasion) ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలపై పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్యా-చైనా మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతోందనే వాదన కూడా ఉంది. పాశ్చాత్య దేశాల ఒత్తిడి వల్లే చైనా(China)తో తమ సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయని రష్యా వెల్లడించింది. చైనా పర్యటనలో ఉన్న రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ (Mikhail Mishustin).. చైనా ప్రీమియర్ లీ కియాంగ్తో భేటీ అయిన తరుణంలో ఈ విధంగా మాట్లాడారు.
ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. తద్వారా రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఆర్థిక, దౌత్య మద్దతు కోసం చైనాపై ఆధారపడుతోన్న రష్యా.. ఉన్నతస్థాయి ప్రతినిధులతో పర్యటనలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా చైనాలో పర్యటించిన రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్ మిషుస్టిన్.. చైనా ప్రధానితో చర్చలు జరిపారు. అయినప్పటికీ ఉక్రెయిన్పై దాడి గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కేవలం అంతర్జాతీయ స్థాయిలో అమెరికా ఆధిపత్యానికి అడ్డుకట్టవేయడంపైనే ఇద్దరు దృష్టి పెట్టారు. రెండు దేశాల సంబంధాలపై రష్యా పీఎం మిఖాయిల్ మిషుస్టిన్ మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న కల్లోల పరిస్థితులు, పాశ్చాత్య దేశాలన్నీ సామూహికంగా తెస్తున్న ఒత్తిడి ప్రభావంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఊహించని స్థాయిలో కొనసాగుతున్నాయి’ అని పేర్కొన్నారు.
మరోవైపు రష్యా, ఉక్రెయిన్ విషయంలో తాము తటస్థంగానే ఉంటామని చైనా పేర్కొంది. ఇరు దేశాలకు సహాయం అందించేందుకు తాము సిద్ధమేనని తెలిపింది. ఇదే సమయంలో మాస్కోను అమెరికా రెచ్చగొడుతోందని ఆరోపించింది. రష్యాపై విధిస్తోన్న ఆంక్షలకు వ్యతిరేకంగా మాస్కోతో బలమైన దౌత్య, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్నామని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.