Pakistan: పాక్లో పోలీసులపై ఆర్మీ అధికారుల అరాచకం.. నెట్టింట్లో వైరల్
పాకిస్థాన్ (Pakistan)లో ఆర్మీ అధికారులకు, పోలీసు సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు.
లాహోర్: పాకిస్థాన్ (Pakistan)లో ఎన్నికైన ప్రభుత్వం కూడా ఆర్మీ కనుసన్నల్లోనే నడుస్తుందనేది బహిరంగ రహస్యం. ఆ మాటను నిజం చేస్తూ సైనికులు కొందరు తమ అధికారాన్ని ప్రదర్శించారు. పోలీసుస్టేషన్లోకి చొచ్చుకెళ్లి.. అక్కడి సిబ్బందిని చితకబాదారు. యూనిఫాంలో ఉన్న పోలీసుల్ని బలవంతంగా మోకాళ్లపై కూర్చోబెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
లాహోర్కు 400 కి.మీ. దూరంలో బహవల్నగర్ పోలీసుస్టేషన్లో ఈ ఘటన జరిగింది. అక్రమంగా తీసుకొచ్చారన్న ఆరోపణలతో ఒక సైనికుడి కుటుంబం నుంచి పోలీసులు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయన్ను అరెస్టు చేశారు. ఇది రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. కొందరు ఆర్మీ సిబ్బంది స్టేషన్లోకి దూసుకువచ్చి, పోలీసులను వెంటబడి తరిమికొట్టి దాడి చేశారు. ఆ దెబ్బలకు తాళలేక తమను వదిలేయమని వారు వేడుకోవడం కొన్ని వీడియోల్లో కనిపించింది.
ప్రధాని దిగాలని.. విమానాన్ని దారి మళ్లించారు..!
‘‘ముగ్గురు పౌరులను పంజాబ్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. వారిని విడుదల చేయడానికి డబ్బు డిమాండ్ చేశారు’’ అంటూ అధికారిక వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఆ ముగ్గురికి సహకరించే వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు ఆర్మీ అధికారి ఇంటిపై సోదాలు నిర్వహించారు. ఇది కొందరు సైనికుల ఆగ్రహానికి దారితీసింది. దాంతో వారు అరెస్టయిన వారిని విడిపించేందుకు బహవల్నగర్ పోలీసుస్టేషన్పై దాడి చేశారు. ఆ క్రమంలోనే అక్కడి సిబ్బందికి గాయాలయ్యాయి’’ అని పేర్కొన్నాయి. చివరకు గాయపడిన ఆ పోలీసులు సస్పెన్షన్కు గురయ్యారు. చట్టవిరుద్ధంగా ముగ్గురు పౌరుల్ని అదుపులోకి తీసుకోవడం, వారి నుంచి డబ్బు దోచుకోవడం వంటి నేరం కింద కేసులు కూడా నమోదయ్యాయి.
‘‘వాస్తవంగా జరిగిన దానిని పక్కనపెట్టి, ఈ ఘటనను పెద్దదిగా చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో నకిలీ ప్రచారం జరుగుతోంది. వాస్తవాలు గుర్తించేందుకు ఇరు వర్గాలు విచారణ జరిపాయి. శాంతియుతంగా ఈ వ్యవహారాన్ని పరిష్కరించాయి’’ అని పంజాబ్ పోలీసు విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
Ukraine-Russia Conflict: ఉక్రెయిన్పై యుద్ధంలో పైచేయి సాధించడం కోసం రష్యా రసాయన ఆయుధాలు వాడుతోందని అమెరికా ఆరోపించింది. -
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
Biden: విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్కు భయమంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. -
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..