Toxic Letters: పాకిస్థాన్ కోర్టుల్లో ‘విషపు లేఖల’ కలకలం..!
పాకిస్థాన్ (Pakistan)లోని ఉన్నత న్యాయస్థానాలకు ఇటీవల వచ్చిన తెల్లటి పౌడర్తో కూడిన లేఖలు కలకలం సృష్టించాయి. ఇప్పటివరకు ఇస్లామాబాద్, లాహోర్ హైకోర్టులకు చెందిన 17 మంది న్యాయమూర్తులకు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ (Pakistan)లోని ఉన్నత న్యాయస్థానాలకు ఇటీవల వచ్చిన అనుమానాస్పద లేఖలు కలకలం సృష్టించాయి. ఇస్లామాబాద్, లాహోర్ హైకోర్టు న్యాయమూర్తులకు పదుల సంఖ్యలో ఇటువంటి లేఖలు రావడం చర్చనీయాంశమైంది. వాటిలో తెల్లటి పౌడర్ ఉండటం మరింత భయాందోళనలకు కారణమయ్యింది. తొలుత ఆంత్రాక్స్ కారక (Toxic letters) పదార్థంగా భావించినప్పటికీ.. పరీక్షల అనంతరం అది కాదని నిర్ధరించారు. మరోవైపు రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థలు నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. న్యాయమూర్తులను బెదిరించడమే లక్ష్యంగా అవి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.
ఆంత్రాక్స్గా అనుమానించినప్పటికీ..
పాకిస్థాన్లోని లాహోర్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులకు ఏప్రిల్ 3న ‘వైట్ పౌడర్’తో కూడిన లేఖలు వచ్చాయి. ఇస్లామాబాద్ హైకోర్టులోని ఎనిమిది మందికి ఈ తరహా లేఖలు వచ్చిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. తొలుత దాన్ని ‘ఆంత్రాక్స్’గా భావించారు. పరీక్షించిన ఫోరెన్సిక్ బృందం అది ఆంత్రాక్స్ కాదని.. ఆర్సెనిక్ కలిగిన పదార్థంగా నిర్ధరించారు. అయితే, అది స్వచ్ఛమైన రూపంలో లేదని వెల్లడించారు. రావల్పిండిలోని జనరల్ పోస్టాఫీసు నుంచి ఈ లేఖలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను కనుక్కోవడం కష్టంగా మారింది. కవర్లపై ఉన్న వేలిముద్రల ద్వారా వారి జాడను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు మునిగిపోయాయి.
అనుకూల తీర్పుల కోసం..
తమకు అనుకూలంగా తీర్పు పొందేందుకు గూఢచార సంస్థల సిబ్బంది కొందరు తమను వేధిస్తున్నారంటూ ఇటీవల ఆరుగురు ఇస్లామాబాద్ న్యాయమూర్తులు ఆరోపించడం సంచలనం రేపింది. ఇందులోభాగంగా తమ నివాసాలపై నిఘా పెట్టడం, బంధువులను అపహరించి, చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు వారు ఆరోపించారు. ఇప్పటివరకు పాక్ ఉన్నత న్యాయస్థాలకు చెందిన మొత్తం 17 మంది న్యాయమూర్తులకు ఇటువంటి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఇలా జడ్జీలను భయభ్రాంతులకు గురిచేస్తోన్న ఈ వ్యవహారాన్ని అక్కడి సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.
తాజా పరిణామాలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ.. న్యాయమూర్తులను బెదిరించేందుకు చేస్తున్న ఈ కుట్రలను బయటపెడతామన్నారు. వాస్తవాలను వెలికితీసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు. మరోవైపు న్యాయస్థానాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకుగానూ లేఖలను ముందస్తుగానే స్కానింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
Biden: విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్కు భయమంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. -
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం