Pakistan: బలూచిస్థాన్‌లో అర్ధరాత్రి పాక్‌ వైమానిక దాడులు

Eenadu icon
By International News Team Published : 29 Oct 2025 10:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్ (Pakistan) మరోసారి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు ప్రారంభించింది. బలోచ్‌ లిబరేషన్ ఆర్మీ(BLA) లక్ష్యంగా అర్ధరాత్రి వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 

బలోచిస్థాన్‌లోని చిల్తాన్‌ పర్వత ప్రాంతంలో బీఎల్‌ఏ ఉగ్రవాదులే లక్ష్యంగా పాక్‌ బలగాలు కచ్చితమైన వైమానిక దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు చాలా రోజులుగా తమ నిఘాలో ఉన్నారని పాక్‌ పేర్కొంది. తాజా దాడుల నేపథ్యంలో ఉగ్రవాదులకు సంబంధించిన అనేక తాత్కాలిక రహస్య స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రావిన్స్‌లోని భద్రతా కాన్వాయ్‌లు, మౌలిక సదుపాయాలపై కూడా ఈ దాడులు జరిగినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. పాక్‌ తాజా దాడులపై బలోచిస్థాన్‌ ఇప్పటివరకు స్పందించలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు