Pak-Bangladesh: పాక్, బంగ్లా మధ్య మరింత రక్షణ సహకారం

Eenadu icon
By International News Desk Published : 29 Oct 2025 05:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇస్లామాబాద్‌: రక్షణ రంగంలో మరింతగా సహకరించుకోవాలని పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ నిర్ణయించుకున్నాయి. రెండు దేశాల మధ్య తరచూ సైనికాధికారుల పర్యటనలు కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాయి. బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న పాకిస్థాన్‌ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ ఛైర్మన్‌ జనరల్‌ సాహిర్‌ షంషద్‌ మీర్జా.. మంగళవారం బంగ్లా సైన్యాధిపతి జనరల్‌ వకీర్‌-ఉజ్‌-జమాన్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం విస్తరించడంపట్ల ఇందులో సంతోషం వ్యక్తమైంది. ‘ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత పరిస్థితులపై ఇరువురు సైనిక ప్రముఖులు చర్చించారు. రెండు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకున్నారు. శిక్షణ, సంయుక్త విన్యాసాలు, ఉగ్రవాదాన్ని వ్యతిరేక పోరాటంలోని అనుభవాలను పంచుకోవడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి’ అని మంగళవారం పాకిస్థాన్‌ సైన్యం అధికార ప్రతినిధి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని