Pakistan: మోదీకి పాక్ అభినందనలు
వరసగా మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీని అభినందిస్తూ పాకిస్థాన్ సందేశం పంపింది. ప్రమాణ వేడుకకు పాకిస్థాన్ మినహా అన్ని పొరుగుదేశాలను మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే.
దక్షిణాసియా భవితకు పాటుపడాలన్న నవాజ్ షరీఫ్
దేశాధినేతలకు మోదీ కృతజ్ఞతలు
ఇస్లామాబాద్, దిల్లీ: వరసగా మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీని అభినందిస్తూ పాకిస్థాన్ సందేశం పంపింది. ప్రమాణ వేడుకకు పాకిస్థాన్ మినహా అన్ని పొరుగుదేశాలను మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో దాయాది దేశం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆయన సోదరుడైన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోమవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘మోదీ సాధించిన విజయం ఆయనపైనా, ఆయన నాయకత్వంపైనా ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. ద్వేషం బదులు ఆశాభావాన్ని మనం నెలకొల్పుదాం. దక్షిణాసియాలో ఉన్న 200 కోట్లమంది ప్రజల భవితవ్యాన్ని తీర్చిదిద్దడానికి ఈ అవకాశాన్ని మోదీ వినియోగించుకోవాలి’ అని నవాజ్ పిలుపునిచ్చారు. వారిద్దరికి ‘ఎక్స్’ వేదికగానే మోదీ ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ ప్రజలు ఎప్పుడూ శాంతి, భద్రత, పురోగమన ఆలోచనలకు దన్నుగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రజల శ్రేయస్సు, వారికి రక్షణ కల్పించడం ఎప్పటికీ తమ ప్రాధాన్యాంశాలుగా ఉంటాయని తెలిపారు.
కెనడాతో కలిసి పనిచేస్తామన్న మోదీ
తనకు శుభాకాంక్షలు తెలిపిన వివిధ దేశాధినేతలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు కృతజ్ఞతలు చెబుతూ- ఒకరి ఆందోళనలను ఒకరు అర్థం చేసుకుంటూ పరస్పర అవగాహనతో కలిసి పనిచేసేందుకు భారత్ ఎదురుచూస్తోందన్నారు. ఉగాండాతో అన్ని రంగాల్లో ఉన్న చరిత్రాత్మక అనుసంధానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు పాటుపడదామని ఆ దేశాధ్యక్షుడు యొవెరి కె ముసెవెనికి సందేశం పంపించారు. ఫిన్లాండ్, స్లొవేనియా ప్రధానులకు, అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్కి, ప్రముఖ వితరణశీలి బిల్గేట్స్కి మోదీ కృతజ్ఞతలు చెప్పారు.
మోదీ పెద్దదిక్కు
-సింగపూర్
భారత దేశ రూపాంతరీకరణకు పెద్దదిక్కుగా మోదీ నిలుస్తున్నారని, ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తెలిపారు. కోట్లమంది అభ్యున్నతికి భారత ప్రధాని పాటుపడ్డారని, ఇకపైనా భారత్ అభివృద్ధి పథంలో దూసుకువెళ్తూనే ఉంటుందని చెప్పారు. చరిత్రాత్మక రీతిలో మూడోసారి మోదీ గెలుపొందారంటూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా అభినందనలు తెలిపారు. ఓట్ల ప్రక్రియలో పాల్గొన్న భారత ప్రజల్ని కూడా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొంత అస్థిరత నెలకొన్నా భారత్లో మోదీ మరోసారి ప్రధానిగా ఎన్నిక కావడం రాజకీయ, ఆర్థిక స్థిరత్వానికి బలమైన సందేశాన్ని పంపిందని ‘అమెరికా భారత్ వ్యాపార మండలి’ (యూఎస్ఐబీసీ) అధ్యక్షుడు కెశాప్ పేర్కొన్నారు. మోదీకి ఇప్పటివరకు వందకి పైగా దేశాలు అభినందన సందేశాలు పంపించాయి.
మన్మోహన్సింగ్, దేవేగౌడలకు ప్రధాని మోదీ ఫోన్
దిల్లీ: ప్రధాని మోదీ సోమవారం మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్సింగ్, దేవేగౌడలకు ఫోన్చేసి మాట్లాడారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోదీ వారికి ఫోన్చేసి ఆశీస్సులు కోరారని అధికారవర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. -
పైలట్ను కాపాడిన కంటైనర్!
నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలట్ మనీష్ శాక్య (37) ఒక్కరే వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. -
ఇమ్రాన్ ఎంపీలు 39 మందికి అధికారిక గుర్తింపు
పాక్ సుప్రీంకోర్టు జారీచేసిన మైలురాయి లాంటి మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన 39 మంది ఎంపీలను చట్టసభ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. -
విమాన ప్రయాణికులపై లండన్ పోలీసుల కర్కశత్వం
నలుగురు విమాన ప్రయాణికులపై లండన్లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వారిని నేలకేసి చితకబాదారు. -
జపాన్లో తగ్గిపోతున్న జనాభా
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్లో వరుసగా 15వ ఏడాదీ జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. జననాల కన్నా మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి నీరిచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి