Pakistan: అవును.. ‘ఎక్స్’ను నిలిపివేశాం: పాక్
పాకిస్థాన్(Pakistan)లో ‘ఎక్స్’పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి పునరుద్ధరించాలని ఆ దేశ కోర్టు ఆదేశించింది.
ఇస్లామాబాద్: భద్రతా కారణాల దృష్ట్యా సామాజిక మాధ్యమ సంస్థ ‘ఎక్స్’ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఎన్నికల సమయంలో ఫిబ్రవరిలో ఈ ఆంక్షలు మొదలయ్యాయి. ఆ విషయాన్ని ఇప్పుడు ధ్రువీకరించింది.
ఎక్స్ ఖాతాల వినియోగంలో సమస్యలు ఎదురవుతున్నాయని యూజర్లు మొత్తుకున్నా ఇంతకాలం ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ స్పందించలేదు. అయితే బుధవారం పాకిస్థాన్ హైకోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఈ విషయాన్ని అంగీకరించింది. దాంతో కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వారంలోగా ఆ ఆంక్షలను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది.
పాకిస్థాన్లో ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా జరిగింది. ఇది పలు సందేహాలకు తావిచ్చింది. ఈ క్రమంలోనే రిగ్గింగ్(poll rigging) జరిగిందని పోలింగ్ ఆఫీసర్ ఒకరు ఆరోపించారు. ఈ అవకతవకలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా కూడా చేశారు. దీనిపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అప్పటినుంచే ఎక్స్ వాడకంలో యూజర్లకు అవాంతరాలు ఎదురవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.