Pakistan: పాకిస్థాన్పై మరో పిడుగు.. త్వరలో ఇంధన సంక్షోభం..!
ఇప్పటికే తీవ్ర విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్.. త్వరలోనే ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కనిష్ఠ స్థాయికి పాకిస్థానీ రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతుల కోసం భారీగా చెల్లించాల్సి వస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని (Economic Crisis) ఎదుర్కొంటున్న పాకిస్థాన్లో పరిస్థితులు మున్ముందు మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి ఇంధనం దిగుమతి చేసుకునేందుకు విదేశీ మారక నిల్వలు సరిపడా లేకపోవడంతో పాక్ (Pakistan) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇందుకోసం రుణ సాయం, చెల్లింపులు చేయడాన్ని బ్యాంకులు నిలిపివేయడంతో ఇంధన సంక్షోభానికి (Fuel Crisis) దారితీయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తీవ్ర విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్.. ఈ క్రమంలో మరో శ్రీలంక మాదిరిగా తయారవుతుందా అనే ఆందోళనలు కూడా అక్కడ నెలకొన్నాయి.
పాకిస్థాన్ దిగుమతుల్లో అత్యధిక భాగం ఇంధనానిదే. దేశంలో విద్యుత్ వార్షిక వినియోగంలో మూడో వంతు దిగుమతి చేసుకున్న సహజ వాయువుతోనే తయారవుతోంది. పాకిస్థానీ రూపాయి విలువ రికార్డు స్థాయిలో కనిష్ఠానికి పడిపోతుండటంతో దిగుమతుల కోసం భారీగా చెల్లించాల్సి వస్తోంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ధరలు పెరగడం పాకిస్థాన్కు గుదిబండగా మారింది. విదేశీ మారక నిల్వలు క్షీణిస్తున్న కారణంగా ఆయిల్ వ్యాపారులు కూడా పాకిస్థాన్, శ్రీలంక వంటి దేశాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పాకిస్థాన్ ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలైన పీఎస్ఓతోపాటు పాకిస్థాన్ ఎల్ఎన్జీ లిమిటెడ్లు గత రెండు నెలలుగా టెండర్లే పిలవలేదట. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ల్లో ఆలస్యం కారణంగా పెట్రోల్ కార్గోలు రద్దైనట్లు ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు వెల్లడించారు. దీంతో రానున్న రోజుల్లో ఇంధన సంక్షోభం తప్పదనే ఆందోళన అక్కడి అధికారుల్లో మొదలైనట్లు తెలుస్తోంది. ‘పక్షం రోజుల వరకు ఇంధన కొరత ఏమీ ఉండదు. లెటర్ ఆఫ్ క్రెడిట్(LCs) ఇప్పుడు రాకుంటే.. రెండు వారాల తర్వాత ఈ కొరత కనిపించవచ్చు’ అని ఓ ఆయిల్ సంస్థకు చెందిన సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు.
అధికారుల లెక్కల ప్రకారం, పాకిస్థాన్కు ప్రతినెల 4.3 లక్షల టన్నుల పెట్రోల్, 2 లక్షల టన్నుల డీజిల్, ఆరున్నర లక్షల టన్నుల క్రూడ్ ఆయిల్ అవసరం. వీటి విలువ 1.3 బిలియన్ డాలర్లుగా అంచనా. 2021 డిసెంబర్లో 6 లక్షల టన్నుల పెట్రోల్ను దిగుమతి చేసుకోగా.. గతేడాది డిసెంబరులో కేవలం 2.2 లక్షల టన్నుల పెట్రోల్ మాత్రమే కొనుగోలు చేసినట్లు ఓసీఏసీ వెల్లడించింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుంచి ఆర్థిక ప్యాకేజీని ఆశిస్తోన్న పాకిస్థాన్.. ఆ సంస్థ పెట్టే షరతులకు కట్టుబడి ఉంటామని తెలిపింది. దీంతో ఐఎంఎఫ్కు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. ఆదివారం ఒక్కరోజే 16శాతం పెంచగా.. పెట్రోల్ ధర లీటరుకు 249 పాకిస్థానీ రూపాయలకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్