Modi: భారత్తో మరింత బలమైన బంధం.. మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు
Modi: తాజా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి, ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియజేశారు.
దిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Modi) ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రజల శ్రేయస్సుకు ఆయన కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. మోదీ నేతృత్వంలోని భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో (Loksabha Election Results) భాజపా 240 స్థానాల్లో గెలిచింది. దేశంలోకెల్లా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 99 చోట్ల విజయం సాధించింది. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 272 సీట్లను సాధించింది. ఈ నేపథ్యంలో తెదేపా, జేడీయూ సహా ఇతర మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో భాజపా మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది.
‘‘2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన ప్రధానమంత్రి మోదీ, భాజపా, ఎన్డీయే కూటమికి అభినందనలు. భారత్, మాల్దీవుల ప్రజల శ్రేయస్సు, ప్రయోజనాల కోసం కలిసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ - మహమ్మద్ ముయిజ్జు, మాల్దీవుల అధ్యక్షుడు
‘‘ఎన్నికల విజయంపై మోదీకి అభినందనలు. ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడుతున్న మీకు శుభాకాంక్షలు. ఇటలీ, భారత్ బంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. ఇరు దేశాలు, ప్రజల శ్రేయస్సు కోసం సహకారంతో ముందుకెళ్తాం’’- జార్జియా మెలోనీ, ఇటలీ అధ్యక్షురాలు
‘‘భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో సాధించిన పురోగతి, శ్రేయస్సుపై ప్రజలు విశ్వాసముంచారు. పొరుగుదేశంగా భారత్తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు శ్రీలంక ఎదురుచూస్తోంది’’ - రణిల్ విక్రమ సింఘే, శ్రీలంక అధ్యక్షుడు
‘‘మూడోసారి చరిత్రాత్మక విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి అభినందనలు. మీ నాయకత్వంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అద్భుతమైన పురోగతిని సాధిస్తూనే ఉంటుంది. మారిషస్ - భారత్ ప్రత్యేక సంబంధాలు చిరకాలం కొనసాగాలి’’ - ప్రవింద్ కుమార్, మారిషస్ ప్రధాని
‘‘లోక్సభ ఎన్నికల్లో భాజపా, ఎన్డీయే వరుసగా మూడోసారి విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్రమోదీకి అభినందనలు. భారత ప్రజల ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య కసరత్తు విజయవంతంగా పూర్తయినందుకు సంతోషిస్తున్నాం’’ - ప్రచండ, నేపాల్ ప్రధాని
‘‘చరిత్రాత్మకంగా వరుసగా మూడోసారి విజయం సాధించిన నా మిత్రుడు ప్రధాని నరేంద్రమోదీ, ఎన్డీయేకి శుభాకాంక్షలు. ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్న భారత్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ - షెరింగ్ తోబ్గే, భూటాన్ ప్రధాని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?