China: ‘అన్లాక్ చైనా’.. చైనాలో ఆందోళనలు ఉద్ధృతం
కరోనా కట్టడి నిమిత్తం చైనాలో అమలు చేస్తున్న ‘జీరో కొవిడ్’ విధానం ఆ దేశంలో తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది. అనేకమంది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
బీజింగ్: కొవిడ్-19 కట్టడి నిమిత్తం చైనా విధిస్తున్న ఆంక్షలు ఇప్పుడు ఆ దేశంలో తీవ్రస్థాయి ఆందోళనలకు దారితీస్తున్నాయి. షింజియాంగ్ రాష్ట్ర రాజధాని ఉరుమ్కీలోని ఓ భవనంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మరణించడంతో నిరసనలు మరింత ఉద్ధృతరూపం దాల్చాయి. వీటిని అదుపు చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాల్ని మోహరిస్తోంది. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగించడం, పెప్పర్ స్ప్రేను చల్లడం వంటి చర్యలు చేపడుతుండడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.
కఠిన లాక్డౌన్ వల్లే ప్రమాదం తీవ్రరూపం..
భవనంలో కఠిన లాక్డౌన్ను అమలు చేయడం వల్లే లోపల ఉన్నవారు వెంటనే బయటకు రాలేకపోయారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. చివరకు శ్వాస తీసుకోలేక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. మరణించినవారికి చైనా వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నిరసనకారులు నివాళులర్పిస్తున్నారు. షాంఘైలో శనివారం రాత్రి దాదాపు 300 మంది తనతో పాటు నిరసనల్లో పాల్గొన్నట్లు ఝావో అనే వ్యక్తి తెలిపారు. తమపైకి పోలీసులు పెప్పర్ స్ప్రే కొట్టారని పేర్కొన్నారు. ‘‘షీ జిన్పింగ్ స్టెప్డౌన్; కమ్యూనిస్టు పార్టీ స్టెప్డౌన్; అన్లాక్ షింజియాంగ్; అన్లాక్ చైనా; డునాట్ వాంట్ పీసీఆర్ టెస్ట్’’ అని నినదిస్తూ నిరసన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. వీరిని అదుపు చేసేందుకు దాదాపు 100 మంది పోలీసుల్ని ప్రభుత్వం మోహరించినట్లు తెలిపారు. మరింత మంది బస్సుల్లో చేరుకుంటున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మరో నిరసనకారుడు తెలిపారు. కానీ, పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిలువరిస్తూ కొంతమందిని మాత్రమే రోడ్డుకు ఒకవైపు నుంచి నడుస్తూ నిరసన తెలిపేందుకు అనుమతిస్తున్నారని పేర్కొన్నారు.
ఇళ్లకు గొలుసులతో తాళాలు..
మరోవైపు ఆందోళనలకు సంబంధించిన పోస్ట్లను చైనా ప్రభుత్వం వెంటనే సామాజిక మాధ్యమాల నుంచి తీసివేయిస్తోంది. షింజియాంగ్లో దాదాపు మూడు నెలలుగా కఠిన లాక్డౌన్లు అమలు చేస్తున్నారు. గురువారం నాటి అగ్నిప్రమాద ఘటనతో ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చి నిరసన చేపట్టారు. నిరసనలు తీవ్రరూపం దాలుస్తుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఉరుమ్కీలో కొన్ని ప్రాంతాల్లో ఆంక్షల నుంచి పాక్షిక మినహాయింపుల్ని ఇచ్చింది. కొవిడ్ నియంత్రణా చర్యల వల్లే అగ్నిప్రమాద తీవ్రత పెరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. మంటల్ని ఆర్పేందుకు సహాయక సిబ్బందికి అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. దీంతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు మూడు గంటల సమయం పట్టిందని తెలిపారు. మరోవైపు ఇళ్లకు గొలుసులతో తాళాలు వేస్తున్నారని వెల్లడించారు. దీనివల్లే భవనం నుంచి కొంతమంది వెంటనే తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మరోవైపు మృతుల సంఖ్య ఎక్కువే ఉందని స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.
రోజుకి 40 వేల కేసులు..
చైనాలో రోజుకి దాదాపు 40 వేలకు పైగా కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా కరోనా పూర్తిగా కనుమరుగవుతున్న తరుణంలో చైనాలో మాత్రం విజృంభిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో కొవిడ్ విధానమే ఇప్పుడు అక్కడి పరిస్థితుల్ని తీవ్రం చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితమే షాంఘైలో దాదాపు 25 లక్షల మందిని లాక్డౌన్లో ఉంచారు. అప్పటి నుంచే ఆందోళనలు ప్రారంభమయ్యాయి. నెలన్నర క్రితం జెంగ్ఝౌలోని ఐఫోన్ తయారీ ప్లాంట్ ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలోనూ కఠిన లాక్డౌన్ అమలు చేశారు. దీంతో చాలా మంది అక్కడి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు కొత్తగా నియమించుకున్నవారికి సరైన వసతులు కల్పించకుండానే లాక్డౌన్లో ఉంచడం, వేతనాలు సరిగా చెల్లించకపోవడంతో గతవారం పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం