Gaza: ‘గాజా’ ఉనికే లేదు..! ఇజ్రాయెల్ విధ్వంసంపై ఖతార్ ప్రధాని ఆవేదన
ఇజ్రాయెల్ కొనసాగిస్తోన్న విధ్వంసంతో గాజా ఇప్పటికే తన ఉనికి కోల్పోయిందని ఖతార్ ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
జెరూసలెం: ఇజ్రాయెల్ చేస్తోన్న భీకర దాడులతో గాజా (Gaza) వణికిపోతోంది. ఇప్పటికే 24వేల మంది ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో నివాసాలు నేలమట్టమయ్యాయి. ఈ క్రమంలో కాల్పుల విరమణను ఇజ్రాయెల్ రక్షణశాఖ తిరస్కరించడంపై ఖతార్ తీవ్రంగా స్పందించింది. గాజాలో నెలకొన్న పరిస్థితులపై ఇజ్రాయెల్తోపాటు అంతర్జాతీయ సమాజంపైనా తీవ్ర విమర్శలు చేసింది. ఈ విధ్వంసంతో గాజా ఇప్పటికే తన ఉనికి కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాజా సంక్షోభానికి ముగింపు పలకాలంటే రెండు దేశాల ఏర్పాటు (Two-State solution) అవసరమని పేర్కొంది.
‘గాజా ఉనికే లేదు. ప్రస్తుతం అక్కడ ఇంకేం లేదని అభిప్రాయం. ఎక్కడ చూసినా బాంబులే. శాంతియుతంగా కలిసి ఉండాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం, అక్కడి రాజకీయ నాయకులు భావించేంత వరకు రెండు దేశాల ఏర్పాటు (Two-State solution) సాధ్యం కాదు. ఈ యుద్ధం ఆపకుండా అవన్నీ జరిగే అవకాశం లేదు’ అని ఖతార్ ప్రధానమంత్రి షేక్ మహహ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థానే పేర్కొన్నారు. దావోస్లో జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో మాట్లాడుతూ గాజా అంశాన్ని ప్రస్తావించారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడి భీకర యుద్ధానికి దారితీసింది. అనంతరం ఇజ్రాయెల్ సైన్యం చేస్తోన్న ప్రతిదాడుల్లో ఇప్పటివరకు 24వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రయులు కావడంతోపాటు అనేక మంది ఆకలితో అల్లాడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. కాల్పుల విరమణకు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. హమాస్ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.