Thailand: సముద్రం ముప్పు.. థాయ్‌లాండ్‌ రాజధానిని తరలించాల్సిందేనా..?

సముద్ర మట్టాలు పెరగడం ద్వారా ఈ శతాబ్దం చివరినాటికి థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ మునిగిపోయే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Published : 16 May 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గ్లోబల్‌ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాగే పరిస్థితి కొనసాగితే.. భవిష్యత్తుల్లో సముద్ర తీరాల్లోని నివాసాలపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా సముద్ర మట్టాల పెరుగుదలతో థాయ్‌లాండ్‌ రాజధానిని వేరే చోటుకు తరలించాలనే విషయాన్ని పరిశీలించాలని అక్కడి పర్యావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. లేదంటే ఈ శతాబ్దం చివరినాటికి బ్యాంకాక్‌ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

నిత్యం రద్దీగా ఉండే ఈ నగరం వర్షకాలంలో వరద సమస్యతో పోరాడుతోంది. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఇప్పటికే 1.5 డిగ్రీల సెల్సియస్‌ దాటి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ‘‘ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్‌ దాటిన పరిస్థితుల్లో ఉంటే.. బ్యాంకాక్‌ను ఇప్పటికే సముద్ర నీరు తాకుతుందని భావించవచ్చు. ఈ ప్రమాదం నుంచి నగరాన్ని కాపాడాలంటే తక్షణమే తరలించాల్సిన అవసర ఉంది. ఇది ఎంతో క్లిష్టమైంది. కానీ, సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మెరుగైన చర్యలను అన్వేషిస్తోంది’’ అని పర్యావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ పావిచ్‌ కేశవవాంగ్‌ పేర్కొన్నారు.

ముసుగు మనుషుల దాడి: డ్రగ్‌లార్డ్‌ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్‌..!

అత్యధిక వేడి, కరవుతో పాటు కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావాలను థాయ్‌లాండ్‌ ఎదుర్కొంటోంది. దీనికారణంగా నేషనల్‌ పార్క్‌లను మూసివేయాల్సి వచ్చింది. కాలుష్యానికి ముఖ్య కారణమైన పంట వ్యర్థాల దహనానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాజధానిని పూర్తిగా మార్చడానికి ముందుగా అక్కడున్న ముఖ్యమైన వ్యాపారాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశ ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని