Russia-Ukraine: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. దూసుకొస్తున్న డ్రోన్లు!
Ukraine-Russia: ఉక్రెయిన్, రష్యా పరస్పరం డ్రోన్ దాడులను తీవ్రతరం చేశాయి. గత రెండు రోజుల్లోనే పదుల సంఖ్యలో డ్రోన్లను నేల కూల్చినట్లు ఇరుదేశాలు ప్రకటించాయి.
కీవ్: రష్యా- ఉక్రెయిన్ (Russia-Ukrarine War) యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా పరిస్థితులు సద్దుమణగడం లేదు. కొన్నాళ్లపాటు దాడులు చేయకుండా స్తబ్దుగా ఉన్న రష్యా.. ఇటీవల కాలంలో మళ్లీ తీవ్రం చేసింది. ఉక్రెయిన్ కూడా దీటుగా బదులిస్తోంది. ఆదివారం రష్యా (Russia), ఉక్రెయిన్ (Ukraine) పరస్పరం డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని మిలటరీ ఎయిర్బేస్ లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి దిగింది. పదుల సంఖ్యలో డ్రోన్లతో దాడిచేసింది. అప్రమత్తమైన రష్యా బలగాలు వాటిని కూల్చి వేశాయి. ఈ క్రమంలో డ్రోన్ శిథిలాలు ఇంటిమీద పడి ఓ ఉక్రెయిన్ పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా వెల్లడించింది. గత రెండు రోజుల్లోనే ఉక్రెయిన్కు చెందిన 35 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు ఆ దేశ రక్షణశాఖ పేర్కొంది. ఈ ఎయిర్బేస్ నుంచే నల్లసముద్ర తీరంలోని ఉక్రెయిన్ శిబిరాలపై రష్యా దాడులకు పాల్పడుతోంది. దానిని ధ్వంసం చేస్తే తమకు ముప్పు తప్పడమే కాకుండా.. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవచ్చని ఉక్రెయిన్ భావిస్తోంది. దీనికోసం గత కొన్ని రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు ఆదివారం ఉదయం ఉక్రెయిన్ స్థావరాలే లక్ష్యంగా రష్యా ప్రయోగించిన 20 డ్రోన్లను కూల్చేసినట్లు ఆ దేశ వైమానిక దళం వెల్లడించింది. ఈ డ్రోన్లన్నీ ఇరాన్లో తయారైనట్లు గుర్తించింది. ఎక్స్-59 క్రూయిజ్ క్షిపణిని కూడా రష్యా ప్రయోగించిందని, అయితే, ఉక్రెయిన్ బలగాలు దానిని కూడా కూల్చేశాయని కీవ్ రక్షణశాఖ అధికారులు తెలిపారు. రష్యా జరిపిన దాడుల్లో నల్లసముద్రం దక్షిణ తీరంలో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. గత నెల రోజులుగా ఇరుదేశాల మధ్య డ్రోన్ దాడులు ఎక్కువయ్యాయి. యుద్ధం మొదలై రెండేళ్లు కావస్తున్నా.. ఇంకా తాము పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రత్యర్థులకు పరోక్షంగా చెప్పేందుకే రెండు దేశాలూ దాడులు తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది.
క్రిమియా ద్వీపకల్పంపై ఉక్రెయిన్ దాడులకు పాల్పడగా.. తమ యాంటీ ఎయిర్క్రాప్ట్ యూనిట్లు 32 డ్రోన్లను ధ్వంసం చేశాయని శుక్రవారం కూడా రష్యా ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్కు చెందిన ఈ భూభాగాన్ని 2014లో రష్యా స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్లోని 11 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని రష్యా 31 డ్రోన్లతో దాడి చేయగా వాటిని గాల్లోనే కూల్చేసినట్లు శనివారం ఉక్రెయిన్ ప్రకటించింది. ఫిబ్రవరి, 2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల ఒత్తిడి, రక్షణ శాఖ అధికారుల సూచన మేరకు రష్యా కొన్ని రోజులు యుద్ధానికి బ్రేక్ ఇచ్చినప్పటికీ.. దాదాపు రెండేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ