Russia-Ukraine: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. దూసుకొస్తున్న డ్రోన్లు!
Ukraine-Russia: ఉక్రెయిన్, రష్యా పరస్పరం డ్రోన్ దాడులను తీవ్రతరం చేశాయి. గత రెండు రోజుల్లోనే పదుల సంఖ్యలో డ్రోన్లను నేల కూల్చినట్లు ఇరుదేశాలు ప్రకటించాయి.
కీవ్: రష్యా- ఉక్రెయిన్ (Russia-Ukrarine War) యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా పరిస్థితులు సద్దుమణగడం లేదు. కొన్నాళ్లపాటు దాడులు చేయకుండా స్తబ్దుగా ఉన్న రష్యా.. ఇటీవల కాలంలో మళ్లీ తీవ్రం చేసింది. ఉక్రెయిన్ కూడా దీటుగా బదులిస్తోంది. ఆదివారం రష్యా (Russia), ఉక్రెయిన్ (Ukraine) పరస్పరం డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని మిలటరీ ఎయిర్బేస్ లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి దిగింది. పదుల సంఖ్యలో డ్రోన్లతో దాడిచేసింది. అప్రమత్తమైన రష్యా బలగాలు వాటిని కూల్చి వేశాయి. ఈ క్రమంలో డ్రోన్ శిథిలాలు ఇంటిమీద పడి ఓ ఉక్రెయిన్ పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా వెల్లడించింది. గత రెండు రోజుల్లోనే ఉక్రెయిన్కు చెందిన 35 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు ఆ దేశ రక్షణశాఖ పేర్కొంది. ఈ ఎయిర్బేస్ నుంచే నల్లసముద్ర తీరంలోని ఉక్రెయిన్ శిబిరాలపై రష్యా దాడులకు పాల్పడుతోంది. దానిని ధ్వంసం చేస్తే తమకు ముప్పు తప్పడమే కాకుండా.. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవచ్చని ఉక్రెయిన్ భావిస్తోంది. దీనికోసం గత కొన్ని రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు ఆదివారం ఉదయం ఉక్రెయిన్ స్థావరాలే లక్ష్యంగా రష్యా ప్రయోగించిన 20 డ్రోన్లను కూల్చేసినట్లు ఆ దేశ వైమానిక దళం వెల్లడించింది. ఈ డ్రోన్లన్నీ ఇరాన్లో తయారైనట్లు గుర్తించింది. ఎక్స్-59 క్రూయిజ్ క్షిపణిని కూడా రష్యా ప్రయోగించిందని, అయితే, ఉక్రెయిన్ బలగాలు దానిని కూడా కూల్చేశాయని కీవ్ రక్షణశాఖ అధికారులు తెలిపారు. రష్యా జరిపిన దాడుల్లో నల్లసముద్రం దక్షిణ తీరంలో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. గత నెల రోజులుగా ఇరుదేశాల మధ్య డ్రోన్ దాడులు ఎక్కువయ్యాయి. యుద్ధం మొదలై రెండేళ్లు కావస్తున్నా.. ఇంకా తాము పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రత్యర్థులకు పరోక్షంగా చెప్పేందుకే రెండు దేశాలూ దాడులు తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది.
క్రిమియా ద్వీపకల్పంపై ఉక్రెయిన్ దాడులకు పాల్పడగా.. తమ యాంటీ ఎయిర్క్రాప్ట్ యూనిట్లు 32 డ్రోన్లను ధ్వంసం చేశాయని శుక్రవారం కూడా రష్యా ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్కు చెందిన ఈ భూభాగాన్ని 2014లో రష్యా స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్లోని 11 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని రష్యా 31 డ్రోన్లతో దాడి చేయగా వాటిని గాల్లోనే కూల్చేసినట్లు శనివారం ఉక్రెయిన్ ప్రకటించింది. ఫిబ్రవరి, 2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల ఒత్తిడి, రక్షణ శాఖ అధికారుల సూచన మేరకు రష్యా కొన్ని రోజులు యుద్ధానికి బ్రేక్ ఇచ్చినప్పటికీ.. దాదాపు రెండేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
Ukraine-Russia Conflict: ఉక్రెయిన్పై యుద్ధంలో పైచేయి సాధించడం కోసం రష్యా రసాయన ఆయుధాలు వాడుతోందని అమెరికా ఆరోపించింది. -
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
Biden: విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్కు భయమంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. -
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?