Russia: ఉక్రెయిన్లో రష్యా దారుణాలు.. 77 మంది ఊచకోత
ఉక్రెయిన్ (Ukraine)లో రష్యా (Russia) సాగిస్తున్న దండయాత్రలో అనేక దారుణాలు వెలుగుచూస్తున్నాయి. పౌరులను అక్రమంగా నిర్బంధించి మాస్కో వారిపై అకృత్యాలకు పాల్పడుతున్నట్లు ఐరాస మిషన్ తెలిపింది.
జెనీవా: ఏడాదిన్నరకు పైగా ఉక్రెయిన్ (Ukraine)పై దండయాత్ర సాగిస్తున్న రష్యా (Russia).. సైనిక చర్య పేరుతో ఆ దేశంలో అనేక దారుణాలకు ఒడిగడుతోంది. ఉక్రెయిన్ పౌరులపై మాస్కో సైన్యం అకృత్యాలకు పాల్పడినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి (United Nations) బృందం జరిపిన పరిశోధనలోనూ మరోసారి ఆ విషయం బయటపడింది. ఈ ఘర్షణ మొదలైన నాటి నుంచి రష్యా దాదాపు 800 మందికి పైగా పౌరులను నిర్బంధించినట్లు ఉక్రెయిన్లోని ఐరాస (UN) పర్యవేక్షణ మిషన్ మంగళవారం వెల్లడించింది. ఇందులో 77 మందిని చంపేసినట్లు తెలిపింది.
‘‘సైనిక చర్య పేరుతో జరుగుతున్న ఈ దండయాత్రలో మానవహక్కుల నిబంధనల ఉల్లంఘన ఎక్కువగా ఉంది. అక్రమంగా పౌరులను నిర్బంధించడం, వారిని హింసించడం, కొందరిని బలవంతంగా కన్పించకుండా చేయడం వంటి దారుణాలను గుర్తించాం. ఉక్రెయిన్ (Ukraine), రష్యా (Russia) రెండు దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఇలా నిర్బంధాలకు పాల్పడ్డాయి. అయితే, ఉక్రెయిన్ వైపు నుంచి ఈ నిర్బంధాల సంఖ్య చాలా తక్కువగా ఉండగా.. రష్యా బలగాలు అత్యధిక దారుణాలకు పాల్పడ్డాయి. దాదాపు 800మందికి పైగా ఉక్రెయిన్ పౌరులను వారు నిర్బంధించారు. అందులో 77 మందిని ఊచకోత కోశారు’’ అని ఐరాస మిషన్ తమ నివేదికలో వెల్లడించింది.
గతేడాది ఫిబ్రవరిలో రష్యా మొదలుపెట్టిన ఈ దండయాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపైకి మాస్కో సేనలు డ్రోన్లు, క్షిపణి దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. అయితే రష్యా దాడులను ఉక్రెయిన్ ఎప్పటికప్పుడు దీటుగా ఎదుర్కొంటోంది. శత్రు డ్రోన్లు, క్షిపణులను కూల్చేస్తోంది. మరోవైపు, రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్కు పలు దేశాలు ఆయుధ సాయాన్ని కొనసాగిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకలు
దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన మూడు యుద్ధనౌకలు సింగపూర్ చేరుకున్నాయి. -
ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టారు. -
సునీత అంతరిక్ష యాత్ర వాయిదా
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర చివర్లో వాయిదా పడింది. -
నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
పరారీలో ఉన్న వ్యాపారవేత్త, ఐదేళ్లుగా లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తాజాగా మంగళవారం అక్కడి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
జెలెన్స్కీ హత్యకు రష్యా కుట్రను ఛేదించాం
తమ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ మంగళవారం ప్రకటించింది. -
శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉందంటే..
భూమికి పొరుగునున్న శుక్రగ్రహం చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలోని హైడ్రోజన్.. అంతరిక్షంలోకి వెళ్లిపోతోందని వారు పేర్కొన్నారు. -
మలేరియాతో వార్ధక్య సంబంధ జన్యు మార్పులు
మలేరియా ఇన్ఫెక్షన్ వల్ల.. వయసు మీద పడే ప్రక్రియతో ముడిపడిన జన్యు మార్పులు చోటుచేసుకుంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
రఫా క్రాసింగ్ను ఆక్రమించిన ఇజ్రాయెల్
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం రఫాపై దాడిని కొనసాగించాలనే నిర్ణయించింది.