Ukraine war: పేట్రియాట్ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు రష్యా యత్నం..!
అమెరికా నుంచి ఉక్రెయిన్కు చేరిన పేట్రియాట్ క్షిపణులు విజయవంతంగా రష్యా క్షిపణులను అడ్డుకొన్నాయి. ఈ విషయాన్ని అమెరికా, ఉక్రెయిన్ అధికారులు ధ్రువీకరించారు.
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్(Ukraine) రక్షణ కోసం అమెరికా (USA) పంపించిన పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఇటీవల రష్యా (Russia) తీవ్రంగా యత్నించింది. ఇందుకోసం హైపర్సానిక్ క్షిపణలను కూడా ప్రయోగించి విఫలయత్నం చేసింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు వెల్లడించారు. రష్యా ప్రయోగించిన ఈ క్షిపణులను ఉక్రెయిన్ పేట్రియాట్ వ్యవస్థను వాడి కూల్చేసింది. ఈ క్షిపణి వ్యవస్థ ఉక్రెయిన్ దళాల చేతికి అందిన కొద్ది రోజుల్లోనే విజయవంతంగా వినియోగించిందని వెల్లడించారు.
కీవ్ బయట మోహరించిన పేట్రియాట్ వ్యవస్థ నుంచి వెలువడిన ఓ సంకేతాన్ని రష్యా దళాలు పసిగట్టి వీటిపై కింజల్ హైపర్సానిక్ క్షిపణులను గురిపెట్టాయని అమెరికా వర్గాలు వెల్లడించాయి. కానీ, పేట్రియాట్ వ్యవస్థకు సుదూర లక్ష్యాలను గుర్తించే రాడార్ ఉండటంతో ముప్పును ముందుగానే పసిగట్టింది. ఈ క్షిపణులను మైకలోవ్ ప్రాంతంలో పేట్రియాట్ ఇంటర్సెప్ట్ మిసైల్స్ అడ్డగించాయి. ఈ ఘటన మే 4న చోటు చేసుకున్నట్లు ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ కమాండర్ వెల్లడించారు. పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ పాట్రిక్ రైడర్.. ఇటీవల ఉక్రెయిన్ పేట్రియాట్ వాడి కింజల్ క్షిపణిని అడ్డుకొన్నట్లు తెలిపారు.
అమెరికా సరఫరా చేసిన పేట్రియాట్ క్షిపణులు గత నెల ఉక్రెయిన్కు చేరాయి. వీటితో ఇక తమ గగనతలం సురక్షితమని కీవ్ భావిస్తోంది. పేట్రియాట్ క్షిపణులు యుద్ధ విమానాలను, ప్రత్యర్థి మిసైళ్లను లక్ష్యంగా చేసుకోగలవు. ఇటీవల కాలంలో రష్యా విచక్షణారహితంగా క్షిపణుల వర్షం కురిపించి ఉక్రెయిన్లోని వివిధ నగరాలను ధ్వంసం చేస్తోంది. ముఖ్యంగా విద్యుత్తు, మంచి నీటి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుంది. పేట్రియాట్ల రాకతో దాడులు ఆగే అవకాశం ఉందని భావిస్తోంది. అయితే ఇది యుద్ధగమనాన్ని నిర్దేశించే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి