Ukraine Crisis: మళ్లీ విరుచుకుపడ్డ రష్యా.. క్షిపణుల దాడిలో 16 మంది మృతి!
ఉక్రెయిన్పై రష్యా సేనలు మళ్లీ దాడులకు దిగాయి. 20కిపైగా క్షిపణులు, రెండు డ్రోన్లను ప్రయోగించాయి. ఈ దాడుల్లో 16 మంది మృతి చెందారు.
కీవ్: ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) మరోసారి విరుచుకుపడింది. రాజధాని కీవ్ (Kyiv)సహా ఆయా నగరాలపై 20కిపైగా క్షిపణులు, రెండు డ్రోన్లను ప్రయోగించింది. ఆయా దాడుల్లో మొత్తం 16 మంది మృతి చెందారు. ఇందులో ముగ్గురు చిన్నారులూ ఉన్నారు. మార్చి 9వ తేదీ తర్వాత కీవ్పై మాస్కో బలగాలు క్షిపణి దాడులు (Missile Attack) చేపట్టడం ఇదే మొదటిసారి. మరోవైపు.. కీవ్ గగనతలంలో ఉక్రెయిన్ వాయుసేన మొత్తం 11 క్షిపణులు, రెండు యూఏవీలను నేలకూల్చినట్లు స్థానిక యంత్రాంగం తెలిపింది. రష్యా సైనిక చర్య విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy)తో చైనా అధినేత షీ జిన్పింగ్ (Xi Jinping) మాట్లాడటం, ఉక్రెయిన్కు భారీ ఎత్తున యుద్ధ సామగ్రి అందించినట్లు నాటో (NATO) వెల్లడించిన వేళ ఈ దాడులు జరగడం గమనార్హం.
రష్యా తాజా దాడుల్లో ఉమాన్ నగరంలోని ఓ తొమ్మిది అంతస్తుల భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. ఇందులో ఇద్దరు పదేళ్ల చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో 17 మంది గాయపడ్డారని తెలిపారు. నీపర్లో జరిగిన మరో దాడిలో 31 ఏళ్ల మహిళ, ఆమె రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక గవర్నర్ చెప్పారు. కీవ్లో కూల్చివేసిన క్షిపణి, డ్రోన్ల శకలాలు పడి విద్యుత్ లైన్లు, రహదారులు దెబ్బతిన్నాయి. ఉద్దేశపూర్వక బెదిరింపు వ్యూహంలో భాగంగానే క్రెమ్లిన్ ఈ దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ మండిపడింది. శాంతి ఒప్పందంపై రష్యా ఆసక్తి చూపడం లేదనే దానికి తాజా ఘటనలే నిదర్శనమని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా విమర్శించారు. ఉక్రెయిన్ నుంచి రష్యా సేనలను తరిమేయడమే శాంతికి మార్గమని ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?