Wagner Group: బఖ్ముత్ పోరులో.. 20వేల ‘రష్యా ప్రైవేటు సైనికుల’ మృతి
ఉక్రెయిన్పై యుద్ధంలో భాగంగా బఖ్ముత్లో (Bakhmut) జరుగుతోన్న పోరులో 20వేలమందికి పైగా సైనికులను కోల్పోయినట్లు రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు (Wagner Group) వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్పై (Ukraine Crisis) భీకర దాడులకు పాల్పడుతూ పలు నగరాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా తీవ్రంగా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, వీటిని తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సేనలు .. రష్యా దాడులను అదేస్థాయిలో తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో కొన్నినెలలుగా బఖ్ముత్ (Bakhmut) నగరంలో భీకర పోరు సాగింది. ఇందులో రష్యా ప్రైవేటు సైన్యం దాదాపు 20వేల మందిని కోల్పోయినట్లు వాగ్నర్ గ్రూపు (Wagner Group) అధిపతి వెల్లడించారు. అంతేకాకుండా ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనేందుకు నియమించుకున్న మొత్తం 50వేల మంది రష్యన్ ఖైదీలలో 20శాతం మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
‘ఉక్రెయిన్ నిస్సైనికీకరణ లక్ష్యంతో రష్యా చేస్తున్న సైనిక చర్యను ఉక్రెయిన్ సేనలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. పాశ్చాత్య దేశాలు అందిస్తున్న ఆయుధ సహాయం, సైనిక శిక్షణతో ఉక్రెయిన్ సైన్యం బలంగా మారింది’ అని రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు (Bakhmut) అధిపతి యెవ్గెనీ ప్రిగోజిన్ పేర్కొన్నారు. తాజాగా ఓ రష్యన్ వార్తా పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. యుద్ధం సమయంలో ఎంతో మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారన్నారు. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల మద్దతుతో దూసుకెళ్తున్న ఉక్రెయిన్ సైన్యం ప్రతిదాడులకు సిద్ధమవుతోందని.. అవి మొదలైతే మాత్రం దక్షిణ, తూర్పు ఉక్రెయిన్తోపాటు ఇప్పటికే ఆక్రమించుకున్న క్రిమియా నుంచి రష్యా దళాలు వెళ్లిపోవచ్చని అంచనా వేశారు.
ఉక్రెయిన్లో తమకు ఎదురవుతున్న సవాళ్లపై వాగ్నర్ సేన ఎప్పటికప్పుడు బహిరంగంగా తన అసంతృప్తిగా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా తమకు అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని రష్యా సైన్యం (Russia Military) ఇవ్వకపోవడంతో ఎంతో మందిని కోల్పోవాల్సి వస్తోందని పలుసార్లు ఆరోపించింది. ఒకానొక స్థాయిలో పైచేయి సాధిస్తున్న బఖ్ముత్ నగరం (Bakhmut) నుంచి వెనక్కి వచ్చేస్తామని రష్యా సైన్యాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తమ సైన్యాన్ని భారీగా కోల్పోయినట్టు వాగ్నర్ గ్రూపు వెల్లడించింది.
మరోవైపు బఖ్ముత్లో భారీ స్థాయిలో ప్రతిఘటన కొనసాగుతోందని.. అక్కడ ఇంకా పోరాటం ముగిసిపోలేదని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ వెల్లడించారు. రష్యా ఆక్రమిత ప్రాంతాల నుంచి పుతిన్ సేనలను తరిమికొట్టేందుకు ఉక్రెయిన్ సైన్యం ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదిలాఉంటే, ఉక్రెయిన్పై జరుపుతోన్న యుద్ధంలో కేవలం 6వేల మంది సైనికులు మాత్రమే ప్రాణాలు కోల్పోయారని రష్యా చెబుతోంది. అటు ఉక్రెయిన్ కూడా ఎంత మంది సైనికులను కోల్పోయిందనే విషయాన్ని వెల్లడించడం లేదు. కానీ, వాస్తవంగా ఈ సంఖ్య భారీ స్థాయిలో ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?