Wagner Group: ఆయుధాలు కరవు.. చేతులెత్తేసిన రష్యా కిరాయి సైన్యం..!
ఉక్రెయిన్పై (Ukraine Crisis) రష్యా చేస్తోన్న యుద్ధంలో కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు (Wagner Group) ఎంతో కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో రష్యా సైన్యం నుంచి అవసరమైన ఆయుధాలు అందకపోవడంతో తమ సైన్యాన్ని విరమించుకుంటామని రష్యాను హెచ్చరించింది.
కీవ్: ఏడాదికిపైగా ఉక్రెయిన్పై యుద్ధం (Ukraine Crisis) కొనసాగిస్తున్న రష్యాకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా భారీ సైన్యంతోపాటు ఆయుధాలను కోల్పోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో యుద్ధంలో కీలకంగా వ్యవహరిస్తోన్న కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూపు (Wagner Group)’.. రష్యా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమకు అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని రష్యా సైన్యం (Russia Military) ఇవ్వకపోవడంతో ఎంతో మందిని కోల్పోవాల్సి వస్తోందని ఆరోపించింది. ఈ క్రమంలోనే కొన్ని వారాలుగా ఉక్రెయిన్ సేనలపై పైచేయి సాధిస్తున్న బక్ముత్ నగరం (Bakhmut) నుంచి వెనక్కి వచ్చేస్తామని రష్యాను వాగ్నర్ గ్రూప్ హెచ్చరించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు వాగ్నర్ గ్రూపు (Wagner Group) అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్కు ఎంతోకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యుద్ధంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తోన్న ఈ వాగ్నర్ గ్రూపు.. ఉక్రెయిన్లోని బక్ముత్ నగరాన్ని మే 9నాటికి పూర్తిగా కైవసం చేసుకుంటామని ఇటీవల ప్రకటించింది. అయితే, ఇందుకు కావాల్సిన మందుగుండు సామగ్రి మాత్రం రష్యా సైన్యం నుంచి లభించడం లేదని ప్రిగోజిన్ ఆరోపించారు. అందుకే అక్కడినుంచి తమ బలగాలను వెనక్కి రప్పించి.. ఈ ప్రదేశాన్ని రష్యా సైన్యానికి బదిలీ చేస్తామని హెచ్చరించారు.
బక్ముత్ నుంచి తమ బలగాల విరమణకు సంబంధించి.. వాగ్నర్ గ్రూపు ఓ వీడియో విడుదల చేసింది. ప్రిగోజిన్ మాట్లాడుతున్నట్లు ఉన్న ఆ వీడియోలో.. రక్తంతో తడిసి ముద్దైన (అప్పుడే చనిపోయిన) కొంతమంది వాగ్నర్ సైనికులు ఉన్నారు. సరైన వనరులు, ఆయుధాలు లేకపోవడంతో బక్ముత్లో అనేక వారాలుగా ఉక్రెయిన్ సైన్యంతో పోరాడుతున్న తమ వాలంటీర్లలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. ఇందుకు రష్యా రక్షణ మంత్రి సెర్గి షొయిగు కారణమని ఆరోపించారు. అయితే, వాగ్నర్ గ్రూపు చేస్తోన్న ఆరోపణలపై రష్యా రక్షణశాఖ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
ఇదిలాఉంటే, దాదాపు 70,000 జనాభా ఉన్న బక్ముత్ నగరంపై రష్యా గతేడాది నుంచే దాడులు మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఇక్కడ పోరాటం ఆగలేదు. ఇప్పటికే ఈ ప్రాంతపై రష్యా కిరాయి సేనలు పట్టు సాధించాయి. ఇరుదేశాలకు ఎంతో కీలకమైన బక్ముత్ నగరం ఉక్రెయిన్ చేజారితే రష్యా బలగాలు మరింత ముందుకెళ్లే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. దొనెట్స్క్ దిశగా బక్ముత్ నుంచి ఇతర నగరాలకు చొచ్చుకొనిపోవడానికి రష్యా సేనలకు సులువవుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ