Germany: జర్మనీలో కాల్పుల కలకలం.. ఏడుగురి మృతి!
జర్మనీ(Germany)లోని ఓ ప్రార్థనామందిరంలో తుపాకీ పేలింది. దాంతో పోలీసులు అత్యంత ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
హాంబర్గ్: జర్మనీ(Germany)లో కాల్పులు(Church Shooting) కలకలం సృష్టించాయి. హాంబర్గ్(Hamburg)లో జెహోవా విట్నెస్ సెంటర్(Jehovah's Witness centre)లో ఈ ఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి తొమ్మిది గంటలకు ఇది జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా.. మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన దుండగుడు కూడా మరణించినట్లు సమాచారం. అయితే మృతుల సంఖ్యపై అధికారుల నుంచి స్పష్టమైన గణాంకాలు వెలువడలేదు.
హాంబర్గ్లోని విట్నెస్(Jehovah's Witness centre ) సెంటర్ వద్ద గురువారం రాత్రి దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులను అప్రమత్తం చేశారు. అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొని ఉందని తెలియజేస్తూ పోలీసులు అలారం మోగించారు. అలాగే ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ‘ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ కాల్పుల వెనక దుండగుడి ఉద్దేశం తెలియరాలేదు’ అని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.
వారంవారం నిర్వహించే బైబిల్ పఠనం కార్యక్రమంలో భాగంగా పలువురు విట్నెస్ సెంటర్ వద్దకు వెళ్లారు. అప్పుడే ఈ ఘటన జరిగింది. దీనికి పాల్పడింది ఒకరా లేక అంతకంటే ఎక్కువమందా? మృతుల్లో దుండగుడు కూడా ఉన్నాడా? అనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా