Robert Fico: అందుకే ప్రధాని రాబర్ట్ ఫికోపై కాల్పులు జరిపా.. అంగీకరించిన నిందితుడు
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)ను హత్య చేయాలన్న ఉద్దేశంతో ఆయనపై కాల్పులు జరపలేదని, ప్రభుత్వ విధానాలు నచ్చకపోవడంతో కేవలం ఆయన్ను గాయపరచాలనే దాడి చేశానని 71 ఏళ్ల నిందితుడు అంగీకరించాడు.
ప్రేగ్: స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)ను హత్య చేయాలన్న ఉద్దేశంతో ఆయనపై కాల్పులు జరపలేదని, ప్రభుత్వ విధానాలు నచ్చకపోవడంతో కేవలం ఆయన్ను గాయపరచాలనే దాడి చేసినట్లు 71 ఏళ్ల నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు 9 పేజీల దర్యాప్తు నివేదికను అధికారులు ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం వెంటనే అతడిని నిర్బంధించాలని ఆదేశించింది. ఈ మేరకు దర్యాప్తు నివేదికను బహిర్గతం చేసింది.
నిందితుడు గతంలో ఓ షాపింగ్ మాల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. 30 ఏళ్లుగా తుపాకీ వినియోగిస్తున్నాడు. అయితే, ఈ దాడి వెనుక కారణం గురించి అతడికి తప్ప ఇంకెవరికీ తెలియదు. మరోవైపు తన చర్యపై పశ్చాత్తాప పడుతున్నట్లు, ప్రధానికి క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిందితుడు దర్యాప్తు అధికారులకు తెలిపాడు. ప్రభుత్వ విధానాలు, యూఎస్పీ రద్దు, మీడియాపై వేధింపులు తదితర చర్యలను పూర్తిగా విభేదించినందువల్లే కాల్పులు జరిపానని నిందితుడు అంగీకరించినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు సైనిక సాయం చేయాలన్నది అతడి ప్రధాన డిమాండ్గా ఉన్నట్లు తెలుస్తోంది.
మే 15న ఫికోపై కాల్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే చికిత్సపొందుతూ కోలుకుంటున్నారు. దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో ఫికో తన మద్దతుదారులతో సమావేశమైన అనంతరం బయటకు రాగానే ఆయనపై నిందితుడు కాల్పులు జరిపాడు. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిగాయి. దీంతో ప్రధాని కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను బన్స్కా బైస్ట్రికాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఫికో రష్యా అనుకూలవాది. ప్రస్తుతం మూడో దఫా ప్రధాని పీఠంపై కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
ఓటింగ్లో జరిగే అవకతవకలు, హ్యాకింగ్ను నివారించాలంటే ఈవీఎంలను ఎన్నికల వినియోగం నుంచి తొలగించాలని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సూచించారు. -
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
జీ20 సదస్సు అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్-కెనడా అధినేతలు తొలిసారి భేటీ అయ్యారు. దీనిపై కెనడా ప్రధాని ట్రూడో స్పందించారు. -
వైద్యులకు ఏఐ అండ!
ఆసుపత్రుల్లో చికిత్సలను మెరుగుపరచడానికి, రోగులు వేగంగా కోలుకునేలా చేయడానికి కృత్రిమ మేధ (ఏఐ) బాగా ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. గత అనుభవాల ఆధారంగా రూపొందిన మెషీన్ లెర్నింగ్ సాధనాలు.. సకాలంలో చికిత్సలు అందించేలా చూస్తాయని గుర్తించారు. -
భారత సంతతి వారితో అమెరికా ఆర్థికానికి భారీ ప్రయోజనం
అమెరికా జనాభాలో భారత సంతతివారు 1.5 శాతమే ఉన్నా.. వారివల్ల దేశార్థికానికి జరుగుతున్న మేలు అంతా ఇంతా కాదని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనం తేల్చింది. ‘2023 నాటికి భారతీయ అమెరికన్ల జనాభా 50 లక్షలకు చేరింది. -
బ్రిటన్ రాజు అధికారిక జన్మదిన వేడుకల్లో కేట్ ప్రత్యక్షం
గత కొంతకాలంగా క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ ప్రజాజీవితానికి దూరంగా ఉన్న వేల్స్ యువరాణి కేట్ మిడిల్డన్ శనివారం బ్రిటన్ ప్రజలకు దర్శనమిచ్చారు. లండన్లో జరిగిన కింగ్ ఛార్లెస్ అధికారిక పుట్టిన రోజు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. -
ఏడేళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు చైనా ప్రధాని
దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో భాగంగా చైనా ప్రధాని లీ కియాంగ్ శనివారం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. గత ఏడేళ్లలో చైనా ప్రధాని ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
పాక్లో బక్రీద్ కానుకగా పెట్రోల్ ధర రూ.10 తగ్గింపు
నగదు కొరత, రెండంకెల ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రజానీకానికి ఊరటనిస్తూ ఈదుల్ అధా (బక్రీద్) పండగ సందర్భంగా అక్కడి ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ.10.20, హైస్పీడ్ డీజిలు (హెచ్ఎస్డీ)పై రూ.2.33 మేర తగ్గించింది. -
ఆర్థిక నడవాలు.. పెట్టుబడులకు ఊతం
ప్రపంచస్థాయి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యం (పీజీఐఐ) మరింత విస్తృతమయ్యేందుకు కలిసి పనిచేయాలని జి-7 దేశాలు నిర్ణయించాయి. నియమబద్ధ పాలనపై ఆధారపడి, ఎలాంటి ఆంక్షల్లేని ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం తామంతా కట్టుబడి ఉంటామని ఉద్ఘాటించాయి. -
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ సిరిల్ రామఫోసా
సిరిల్ రామఫోసా (71) మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రామఫోసాకు చెందిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మూడు దశాబ్దాల్లో తొలిసారిగా మెజారిటీని కోల్పోయింది. -
ఇజ్రాయెల్ ఆర్మీ కాన్వాయ్పై దాడి
దక్షిణ గాజాలో హమాస్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్కు శనివారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉదయం ఐదుగంటల ప్రాంతంలో సైనిక కాన్వాయ్పై హమాస్ చేసిన దాడిలో 8 మంది సైనికులు మృత్యువాతకు గురయ్యారు. -
ఇజ్రాయెల్ దళాలకు ఎదురుదెబ్బ.. 8 మంది సైనికులు మృతి
హమాస్ ఫైటర్లు జరిపిన దాడిలో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. -
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ యుద్ధ విమానాలు కూల్చివేసిన.. ఓ ప్రయాణికుల విమానం శకలాలు ఎనిమిది దశాబ్దాల తర్వాత లభ్యమయ్యాయి. -
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
కువైట్లోని అల్ మంగాఫ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 46 మంది భారతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాలపై ఆరోపణలు వెల్లువెత్తగా.. అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం
-
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా?
-
రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి..ఫొటోలు వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పవన్ కల్యాణ్కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్.. అదేంటంటే?
-
దర్శన్, పవిత్రా గౌడలకు వివాహమైందా? ఆయన లాయర్ ఏమన్నారంటే..