Social Media: సోషల్ మీడియా యాక్టివ్ యూజర్లు @ 500 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివ్ యూజర్ల సంఖ్య 500 కోట్లకు చేరినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్నెట్ సేవలు సులభతరం కావడంతో కొన్నేళ్లుగా సోషల్ మీడియా (Social Media) వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో ఏకంగా 60 శాతానికిపైగా ప్రజలు సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలంగా ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ జనాభా ఇటీవలే 800 కోట్ల మార్కును దాటగా.. జులై నాటికి అందులో సోషల్ మీడియా వేదికల్లో దాదాపు 500 కోట్ల (4.88 బిలియన్ యూజర్ ఐడెంటిటీస్) మంది యాక్టివ్గా ఉన్నట్లు అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 3.7శాతం పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల వినియోగానికి సంబంధించి కెపియోస్ అనే డిజిటల్ అడ్వైజరీ సంస్థ తాజా గణాంకాలను వెల్లడించింది. ప్రతి 10 మంది ఇంటర్నెట్ యూజర్లలో తొమ్మిదిమంది వీటిని వాడుతున్నట్లు పేర్కొంది. ప్రతి సెకనుకు కొత్తగా చేరేవారి సంఖ్య సరాసరి 5.5గా ఉన్నట్లు తెలిపింది. ఇలా గడిచిన ఏడాదిలోనే కొత్తగా 17.3 కోట్ల మంది.. సోషల్ మీడియాలో చేరినట్లు అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో భిన్న విధాలుగా వీటి వినియోగం ఉందని పేర్కొంది.
ఇక స్మార్ట్వాచీల్లోనూ వాట్సప్ సేవలు
తూర్పు, మధ్య ఆఫ్రికాలో ప్రతి 11 మందిలో కేవలం ఒక్కరు మాత్రమే సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారని తెలిపింది. అదే భారత్లో మాత్రం ప్రతి ముగ్గురిలో ఒకరు ఉపయోగిస్తున్నారట. ఇక సోషల్ మీడియాలో గడిపే సమయం విషయానికొస్తే.. ఒక్కో యూజర్ రోజులో దాదాపు 2.26 గంటలపాటు వాటిలోనే గడుపుతున్నట్లు వెల్లడైంది. అత్యధికంగా బ్రెజిలియన్లు రోజుకు 3.49 గంటలపాటు వాటిలో మునిగితేలుతుండగా.. జపాన్లో మాత్రం ఈ సమయం గంటకు తక్కువగానే ఉన్నట్లు వెల్లడైంది.
ఏడు మాధ్యమాలను ఎక్కువగా వినియోగిస్తుండగా.. ఇందులో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు మెటా సంస్థకు చెందినవి. తదుపరి చైనాకు చెందిన వీచాట్, టిక్టాక్తోపాటు డౌయిన్లు ఉన్నాయి. వీటితోపాటు ట్విటర్, మెసెంజర్, టెలిగ్రామ్ యాప్ల వినియోగం కూడా గణనీయంగా ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అయితే, డూప్లికేట్ అకౌంట్ల కారణంగా ఒక్కో అకౌంటును ఒక్కో వ్యక్తిగా పేర్కొనలేమని.. అలా చేస్తే ప్రపంచ జనాభాకంటే ఎక్కువ సంఖ్య ఉంటుందని తాజా నివేదిక తెలిపింది. అందుకే వీటిని సోషల్ మీడియా యూజర్ ‘ఐడెంటిటిస్’గా పేర్కొన్నామని కెపియోస్ స్పష్టతనిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం