Kremlin: ఇంటిపేరు మార్చుకుని.. ఉక్రెయిన్ యుద్ధంలో క్రెమ్లిన్ ప్రతినిధి కుమారుడు!
ఉక్రెయిన్పై చేపడుతోన్న సైనిక చర్యలో పాల్పంచుకున్నట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ కుమారుడు నికొలాయ్ పెస్కొవ్ వెల్లడించాడు. తన ఇంటి పేరు మార్చుకుని, వాగ్నర్ దళంతో పనిచేసినట్లు చెప్పాడు.
మాస్కో: ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) సైనిక చర్య ఏడాదికిపైగా సాగుతోన్న విషయం తెలిసిందే. రష్యా బలగాలకు తోడు కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ (Wagner Group) సైతం మాస్కో తరఫున దాడులకు దిగుతోంది. ఈ క్రమంలోనే క్రెమ్లిన్ (Kremlin) అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ (Dmitry Peskov) తనయుడు నికొలాయ్ పెస్కొవ్ (Nikolai Peskov).. తాను సైతం ఈ దాడుల్లో పాలుపంచుకున్నట్లు ప్రకటించాడు. వాగ్నర్ దళాలతో కలిసి ఉక్రెయిన్లో ఆర్నెళ్లపాటు పనిచేసినట్లు తాజాగా ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో తెలిపారు.
‘నా స్నేహితులు, ఇతరులు ఉక్రెయిన్లో పోరాటానికి వెళ్తుండటాన్ని చూశా. బాధ్యతగా భావించి నేనూ ముందుకొచ్చా. తండ్రి దిమిత్రి పెస్కొవ్ సహకారంతో యుద్ధంలో భాగమయ్యా’ అని నికొలాయ్ పెస్కోవ్ వెల్లడించాడు. ‘యుద్ధక్షేత్రానికి వెళ్లినప్పుడు.. నా ఇంటిపేరు మార్చుకున్నా. నకిలీ పత్రాలతో అడుగుపెట్టా. నేనెవరో అక్కడ ఎవరికీ తెలియదు’ అని తెలిపాడు. దాదాపు ఆర్నెళ్లపాటు సేవలందించానని, గుర్తింపుగా పతకం కూడా అందుకున్నట్లు చెప్పాడు. సైనిక చర్యకు కేవలం సామాన్య పౌరులనే పంపుతున్నారని.. ప్రభుత్వ, ఉన్నత వర్గాలవారిని దూరంగా ఉంచారంటూ రష్యా ప్రభుత్వంపై స్థానికంగా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
క్రెమ్లిన్ ప్రతినిధి కుమారుడు తన దళంలో పనిచేశాడని వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ సైతం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘అతను మందుగుండు సామగ్రి సరఫరా వాహనం లోడర్గా పనిచేశాడు. అంతకుముందు మోల్కినోలోని వాగ్నర్ స్థావరంలో మూడు వారాల శిక్షణకు హాజరయ్యాడు. అనంతరం లూహాన్స్క్కు వెళ్లాడు’ అని చెప్పాడు. దిమిత్రి పెస్కొవ్ సైతం తన తనయుడు సైనిక చర్యలో భాగమయ్యడన్న విషయాన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం నికొలాయ్, దిమిత్రి పెస్కొవ్లిద్దరూ ప్రపంచ దేశాల ఆంక్షల జాబితాలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని