Entrance Exam: ఆ 8 గంటల పరీక్షలో.. ‘కిల్లర్ క్వశ్చన్స్’ ఉండవ్..!
యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం దక్షిణ కొరియా (South Korea) నిర్వహించే ఓ పరీక్షలో కిల్లర్ క్వశ్చన్లను లేకుండా చూస్తామని అక్కడి విద్యాశాఖ వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం దక్షిణ కొరియా (South Korea) నిర్వహించే ఓ పరీక్ష ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. అయితే, అందులో వచ్చే కొన్ని కఠినమైన ప్రశ్నలు అక్కడి యువతలో తీవ్ర ఒత్తిడికి కారణమవుతున్నాయని నివేదకలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ పరీక్షలో (Entrance Exam) కీలక మార్పులకు ద.కొరియా ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో ‘కిల్లర్ క్వశ్చన్లు’గా పిలిచే ప్రశ్నలను ఇకనుంచి లేకుండా చూస్తామని దక్షిణ కొరియా విద్యాశాఖ ప్రకటించింది.
సుదీర్ఘ పరీక్ష..
దక్షిణ కొరియాలో పన్నెండో తరగతి పాసైన విద్యార్థులు యూనివర్సిటీలో చేరడానికి ‘సన్అంగ్’ (Suneung) అనే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఏటా నవంబరులో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు భారీ పోటీ ఉంటుంది. ఒకేరోజు ఎనిమిది గంటలపాటు జరిగే ఈ పరీక్షకు దాదాపు 5లక్షల మంది హాజరవుతుంటారు. కొరియా భాషతో పాటు ఇంగ్లిష్, గణితం, చరిత్ర, సైన్సు తదితర సబ్జెక్టుల్లో విద్యార్థుల నైపుణ్యాలను విశ్లేషించే ప్రశ్నలుంటాయి. కేవలం కాలేజీ భవితనే కాకుండా కెరీర్, వివాహం వంటి విషయాల్లోనూ ఈ పరీక్ష కీలక పాత్ర వహిస్తుందట.
విద్యార్థులకు శాపం..
అయితే, అందులో వచ్చే కొన్ని కఠిన ప్రశ్నలను ‘కిల్లర్ క్వశ్చన్స్’గా పేర్కొంటుంటారు. సాధారణ విద్యార్థులకు ఇవి శాపంగా మారుతున్నాయనే వాదన ఉంది. ఈ పరీక్షలో గట్టెక్కేందుకు ప్రైవేటు ట్యూషన్లను పెట్టుకోవడం తల్లిదండ్రులకు ఆర్థికంగా భారంగా మారడంతోపాటు విద్యార్థులనూ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందని తేలింది. మరోవైపు విద్యావ్యవస్థలో తీవ్ర పోటీ కారణంగా పిల్లల్లో ఒత్తిడి, ఆత్మహత్యల రేటు పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా పరీక్షల తీరుపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో వీటిలో మార్పులు చేయాలని ద.కొరియా విద్యాశాఖ నిర్ణయించింది. సాధ్యమైనంత వరకు అటువంటి ప్రశ్నలు ఉండకుండా దీన్ని రూపొందిస్తామని విద్యాశాఖ మంత్రి లీ జూ-హో ప్రకటించారు.
విమానాలూ నిలిపివేస్తారు..
సన్అంగ్ పరీక్ష జరిగే రోజున దేశం మొత్తం నిశ్శబ్దంగా మారుతుంది. టీవీలూ మ్యూజిక్ సిస్టమ్స్ మూగబోతాయి. రోడ్లమీద ట్రాఫిక్ పిల్లలకు అడ్డం రాకూడదని కోర్టులూ బ్యాంకులూ స్టాక్మార్కెట్తో సహా కార్యాలయాలన్నిటినీ కొద్దిపాటి సిబ్బందితో ఆలస్యంగా ప్రారంభించి త్వరగా మూసేస్తారు. భాషకి సంబంధించిన పరీక్షలో విని రాయాల్సింది ఉంటుంది. అందుకని వారి ఏకాగ్రతకి భంగం కలగకుండా చూడడానికి దేశమంతటా విమానాల రాకపోకల్ని నిలిపేస్తారు. మిలిటరీ శిక్షణ, నిర్మాణ పనులనూ ఆపేస్తారు. విద్యార్థుల కోసం బస్సులు, ట్యాక్సీలను ఉచితంగా నడుపుతారు. పోలీసులతోపాటు ప్రత్యేక బలగాలు కూడా విద్యార్థుల కోసం అందుబాటులో ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారయ్యారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి