Asiana Airlines: గాల్లోనే తెరచుకున్న విమానం డోర్.. వణికిపోయిన ప్రయాణికులు!
విమానం గాల్లో ఉన్న సమయంలో ఎమర్జెన్సీ డోర్ (Emergency Exit Door) తెరచుకోవడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైన ఘటన దక్షిణ కొరియాలో (South Korean flight) చోటుచేసుకుంది.
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ఓ విమానానికి (South Korean flight) భారీ ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే అందులోని ఓ వ్యక్తి అత్యవసర ద్వారాన్ని (Emergency Exit Door) తెరవడం తీవ్ర కలకలం రేపింది. క్యాబిన్లోకి భారీగా గాలులు వీయడంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర గాలులతో కొందరికి శ్వాసకోశ సమస్యలు తలెత్తగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
దక్షిణ కొరియాలోని జెజూ ద్వీపం నుంచి డెయగూ నగరానికి ఏసియానా ఎయిర్లైన్స్ ఎయిర్ బస్ విమానం A321 బయలు దేరింది. విమానంలో 194 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం సుమారు గంట. విమానం గాల్లో ఉండగానే అందులోని ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని తెరచేందుకు ప్రయత్నించాడు. దీంతో తోటి ప్రయాణికులు అతడిని అడ్డుకునేందుకు యత్నించారు. అప్పటికే ఆ అత్యవసర ద్వారం తెరచుకుంది. దీంతో భారీగా గాలిచొరబడటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కూర్చున్నారు.
ఈ ఘటనను అందులో ఉన్న కొందరు ప్రయాణికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లోపలికి వీస్తున్న భారీ గాలితో ప్రయాణికులు ఆందోళన చెందుతున్న దృశ్యాలు కనిపించాయి. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం డోర్ తీసినట్లు భావించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ చర్యకు పాల్పడటం వెనక అతడి ఉద్దేశం మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఏసియానా ఎయిర్లైన్స్ వెల్లడించింది. ఈ పరిణామంతో విమాన ప్రయాణికులు భయాందోళనకు గురైనప్పటికీ.. ఎవరికీ గాయాలు కాలేదని ఏసియానాతోపాటు అక్కడి రవాణాశాఖ ప్రకటించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిఘా వైఫల్యం ఎఫెక్ట్..! ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా
అక్టోబరు 7నాటి హమాస్ దాడుల విషయంలో నిఘా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ మిలిటరీ నిఘా విభాగం అధిపతి మేజర్ జనరల్ అహరోన్ హలీవా రాజీనామా చేశారు. -
చైనా అనుకూలుడికే ‘మాల్దీవులు’ పట్టం.. భారత్తో దౌత్యం జరిపేనా!
చైనా అనుకూలుడిగా పేరున్న మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) మాల్దీవుల అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) భారీ విజయాన్ని నమోదు చేసింది. -
దాడి భారీగానే చేశాం కానీ.. ఇజ్రాయెల్కు జరిగింది స్వల్ప నష్టమే
ఇజ్రాయెల్పై ఇరాన్ భారీస్థాయిలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్కు మాత్రం స్వల్ప నష్టమే జరిగింది. ప్రయోగించిన 300కి పైగా డ్రోన్లు, బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులు పెద్దగా ప్రభావం చూపలేదు. -
కడుపుకోతల యుద్ధం
యుద్ధం ఎంత వినాశకరమో, దాని పరిణామాలెంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి దక్షిణ గాజాలోని రఫాలో జరిగిన ఈ హృదయ విదారక సంఘటనే నిదర్శనం. -
అమెరికాలో కాల్పులు.. ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు
అమెరికాలోని మెంఫిస్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక పార్కులో జరుగుతున్న ఓ పార్టీలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన విచక్షణా రహిత కాల్పుల్లో ఇద్దరు మరణించారు. -
మాకు పురుగుల బియ్యం పంపుతున్నారు
పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో న్యాణత లోపించిందని రష్యా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. -
అసాధారణ వాతావరణ పోకడలు ఇక సర్వసాధారణం!
ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో తీవ్రస్థాయి వేడి వాతావరణం నెలకొంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. వేడెక్కుతున్న భూగోళానికి ఇది నిదర్శనమని తెలిపింది. -
సముద్రంలో కుప్పకూలిన రెండు హెలికాప్టర్లు
జపాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రివేళ ప్రత్యేక శిక్షణ నిమిత్తం వెళ్లిన రెండు నౌకాదళ హెలికాప్టర్లు సముద్రంలో కుప్పకూలిపోయాయి. -
యుద్ధం ‘తల్లి’ ప్రాణం తీస్తే.. వైద్యులు ‘గర్భస్థ శిశువు’కు ఊపిరిపోశారు!
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన 17 మంది చిన్నారులను ప్రాణాలు కోల్పోయారు. -
పురుగుల బియ్యం.. పాకిస్థాన్కు రష్యా వార్నింగ్!
పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో పురుగులు రావడంపై రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో దిగుమతులను నిలిపేస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
పవన్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా
-
బాబాయినే హతమార్చిన వారు.. మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా?: లోకేశ్
-
‘మామయ్య కుటుంబాన్ని గ్యాంగ్స్టర్లు చంపేశారు’.. ఐపీఎల్ నిష్క్రమణపై రైనా స్పష్టత
-
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్
-
‘మరో పుతిన్ తయారవుతున్నారు’.. మోదీపై శరద్ పవార్ విమర్శలు
-
నిఘా వైఫల్యం ఎఫెక్ట్..! ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా