Age System: ఆ ప్రజల వయసు తగ్గనుంది.. ఎందుకో తెలుసా..!
దక్షిణ కొరియాలో (South Korea) ఇప్పటివరకు పౌరుల వయసు లెక్కింపునకు భిన్నవిధాలను అనుసరించగా.. బుధవారం నుంచి అంతర్జాతీయ లెక్కింపు విధానాన్ని (International Age System) పాటించనుండటంతో అక్కడి పౌరులందరి వయసు ఒకటి, రెండేళ్లు తగ్గనుంది.
సియోల్: దక్షిణ కొరియా (South Korea) పౌరుల వయసు తగ్గనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. అవును, ఇప్పటివరకు పౌరుల వయసు లెక్కింపునకు భిన్నవిధానాలను అనుసరించిన దక్షిణ కొరియా.. బుధవారం నుంచి అంతర్జాతీయ విధానాన్ని (International Age System) పాటించనుంది. దీంతో అక్కడి పౌరులందరి వయసు ఒకటి, రెండేళ్లు తగ్గనుంది.
ఒకే పౌరుడికి మూడు వయసులు..
దక్షిణ కొరియా పౌరుల వయసును ఇప్పటివరకు మూడు విధానాలుగా లెక్కిస్తున్నారు. అంతర్జాతీయ వయసు, కొరియన్ వయసు (Korean Age), క్యాలెండర్ వయసు.. ఇలా ఒక్కో వ్యక్తికి మూడు వయసులను పేర్కొనేవారు. అంతర్జాతీయ విధానం ప్రకారం శిశువు పుట్టినప్పుడు వారి వయసు ‘సున్నా’ నుంచి మొదలవుతుంది. ఆపై.. వచ్చే ఏడాది అదే తేదీనాటికి ఒకటి ఏడాది పూర్తవుతుంది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఇదే విధానాన్ని పాటిస్తున్నాయి. కొరియన్ ప్రకారం, శిశువు పుట్టగానే ఒక ఏడాది వయసుగా పరిగణిస్తారు. ఆ తర్వాత ప్రతి జనవరి 1న ఒక్కో ఏడాది జోడిస్తారు. క్యాలెండర్ విధానం ప్రకారం, శిశువు పుట్టినప్పుడు వయసు సున్నాగానే ఉంటుంది. అనంతరం.. ప్రతి జనవరి 1న మరో సంవత్సరం కలుపుతారు.
ఉదాహరణకు దక్షిణ కొరియాకు చెందిన ఒక వ్యక్తి డిసెంబరు 31న జన్మిస్తే.. జనవరి 1నాటికి కొరియన్ విధానం ప్రకారం అతడి వయసు రెండేళ్లు అవుతుంది. క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో ఎప్పుడు పుట్టినా.. జనవరి 1 నుంచే అతడి వయసు లెక్కింపులోకి వస్తుంది. అదే అంతర్జాతీయ ప్రామాణికంగా తీసుకుంటే ఏ తేదీన పుడితే.. అప్పటి నుంచి ఒక్కోరోజు లెక్కింపులోకి వస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి.
గందరగోళానికి తెర..
ఇలా దక్షిణ కొరియా పౌరులు తమ రోజువారీ జీవితంలో, సామాజిక అంశాల్లో కొరియన్ వయసును ఉపయోగిస్తారు. చట్టపరమైన, అధికారిక విషయాల్లో అంతర్జాతీయ వయసు నమోదు చేస్తారు. మద్యపానం, ధూమపానం, నిర్బంధ సైనిక శిక్షణ వంటి విషయాల్లో క్యాలెండర్ వయసును పరిగణనలోకి తీసుకుంటారు. దీంతోపాటు ఇన్సూరెన్సు పాలసీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఒక్కో వయసును పేర్కొనడంతో వివాదంగా మారుతున్నాయి. ఈ గందరగోళానికి తెరదించిన అక్కడి పార్లమెంటు.. జూన్ 28 నుంచి పుట్టిన తేదీనే ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయానికి మూడోవంతు పౌరులు మద్దతు తెలుపుతున్నట్లు అక్కడి సర్వేలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారయ్యారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి