Shopping mall : రీల్స్ కోసం ఆ షాపింగ్ మాల్లోకి వెళ్తే.. తగిన మూల్యం చెల్లించుకుంటారు!
కొనే ఉద్దేశం లేకపోయినా కొందరు కాలక్షేపానికి షాపింగ్ మాల్స్కు వెళ్తుంటారు. అలాంటి వారు స్పెయిన్లోని (Spain) ఓ షాపింగ్ మాల్కు వెళితే మూల్యం చెల్లించుకోక తప్పదు.
మాడ్రిడ్ : ఇప్పుడు ఎక్కడ చూసినా రీల్స్ (Reels) హవా నడుస్తోంది. ఇల్లు, ఆఫీసు ఇలా అన్నింటినీ వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో (Social media) పోస్టు చేస్తున్నారు. కొందరు కొనేది, తినేది లేకపోయినా ప్రఖ్యాత రెస్టారెంట్లు, మాల్స్లో అడుగుపెట్టి అనవసర రద్దీ పెంచుతున్నారు. అలాంటి వారిని నిరుత్సాహపరిచేందుకు స్పెయిన్లోని ఓ షాపింగ్ మాల్ 5 యూరోల ప్రవేశ రుసుం బోర్డు పెట్టింది. దాంతో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
కువియూస్ ముర్రియా.. స్పెయిన్ దేశం బార్సిలోనాలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్. 1898 నుంచే ఇక్కడ వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. శతాబ్దానికి పూర్వమే నిర్మించిన ఈ మాల్లో వింటేజ్ లుక్ ఉట్టిపడుతుంటుంది. ఇందులోని వస్తువులన్నీ స్పెయిన్ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. అందుకే పర్యాటకులతో ఎల్లవేళలా కిక్కిరిసిపోతుంటుంది. ఈ మాల్లో కొన్ని ప్రత్యేకమైన సాస్లు, మాంసం, చీజ్, నూనెలు దొరుకుతాయి. కానీ, వాటిని కొనకుండానే పర్యాటకులు వెళ్లిపోతుంటారు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేసే వారి సంఖ్య పెరిగింది. దాంతో వచ్చిన ప్రతి ఒక్కరూ వీడియోలు తీసుకొని బయటకు వెళ్లిపోతున్నారు. అలాంటి వారికి చెక్ పెట్టాలని భావించిన యాజమాన్యం ప్రవేశ రుసుం పేరుతో బోర్డు పెట్టేసింది. ఏ వస్తువు కొనకుండా వెనుదిరిగితే 5 యూరోలు చెల్లించాలని ప్రవేశ ద్వారం వద్దే హెచ్చరిక ఏర్పాటు చేసింది.
మా వద్ద కావాల్సినన్ని క్లస్టర్ బాంబులున్నాయి: పుతిన్
ప్రఖ్యాత మాల్ ఎదుట ఇలాంటి బోర్డు ఏర్పాటు చేశారని తెలియగానే సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం వైరల్గా మారింది. అంతేకాదు.. ఒకటికి రెండు సార్లు ఆలోచించి పర్యాటకులు ఈ మాల్లోకి అడుగుపెడుతున్నారు. కొందరైతే కిటికీల్లో నుంచే తమకు కావాల్సిన ఫుటేజీ తీసుకొని అక్కడ్నుంచి నిష్క్రమిస్తున్నారు. తాము తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ఫలిస్తోందని ఈ మాల్ మేనేజర్ టోనీ మెరినో తెలిపారు. అనవసర సందర్శకుల తాకిడి లేకపోవడంతో వినియోగదారులకు సౌకర్యంగా ఉందని చెప్పారు. మొత్తానికి ఈ ఆలోచనను కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ‘ఈ ప్లాన్ను అన్ని స్టోర్లలో అమలు చేస్తే పర్యాటకులందరి పర్సులు ఖాళీ అవుతాయని ’ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల