Shopping mall : రీల్స్ కోసం ఆ షాపింగ్ మాల్లోకి వెళ్తే.. తగిన మూల్యం చెల్లించుకుంటారు!
కొనే ఉద్దేశం లేకపోయినా కొందరు కాలక్షేపానికి షాపింగ్ మాల్స్కు వెళ్తుంటారు. అలాంటి వారు స్పెయిన్లోని (Spain) ఓ షాపింగ్ మాల్కు వెళితే మూల్యం చెల్లించుకోక తప్పదు.
మాడ్రిడ్ : ఇప్పుడు ఎక్కడ చూసినా రీల్స్ (Reels) హవా నడుస్తోంది. ఇల్లు, ఆఫీసు ఇలా అన్నింటినీ వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో (Social media) పోస్టు చేస్తున్నారు. కొందరు కొనేది, తినేది లేకపోయినా ప్రఖ్యాత రెస్టారెంట్లు, మాల్స్లో అడుగుపెట్టి అనవసర రద్దీ పెంచుతున్నారు. అలాంటి వారిని నిరుత్సాహపరిచేందుకు స్పెయిన్లోని ఓ షాపింగ్ మాల్ 5 యూరోల ప్రవేశ రుసుం బోర్డు పెట్టింది. దాంతో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
కువియూస్ ముర్రియా.. స్పెయిన్ దేశం బార్సిలోనాలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్. 1898 నుంచే ఇక్కడ వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. శతాబ్దానికి పూర్వమే నిర్మించిన ఈ మాల్లో వింటేజ్ లుక్ ఉట్టిపడుతుంటుంది. ఇందులోని వస్తువులన్నీ స్పెయిన్ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. అందుకే పర్యాటకులతో ఎల్లవేళలా కిక్కిరిసిపోతుంటుంది. ఈ మాల్లో కొన్ని ప్రత్యేకమైన సాస్లు, మాంసం, చీజ్, నూనెలు దొరుకుతాయి. కానీ, వాటిని కొనకుండానే పర్యాటకులు వెళ్లిపోతుంటారు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేసే వారి సంఖ్య పెరిగింది. దాంతో వచ్చిన ప్రతి ఒక్కరూ వీడియోలు తీసుకొని బయటకు వెళ్లిపోతున్నారు. అలాంటి వారికి చెక్ పెట్టాలని భావించిన యాజమాన్యం ప్రవేశ రుసుం పేరుతో బోర్డు పెట్టేసింది. ఏ వస్తువు కొనకుండా వెనుదిరిగితే 5 యూరోలు చెల్లించాలని ప్రవేశ ద్వారం వద్దే హెచ్చరిక ఏర్పాటు చేసింది.
మా వద్ద కావాల్సినన్ని క్లస్టర్ బాంబులున్నాయి: పుతిన్
ప్రఖ్యాత మాల్ ఎదుట ఇలాంటి బోర్డు ఏర్పాటు చేశారని తెలియగానే సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం వైరల్గా మారింది. అంతేకాదు.. ఒకటికి రెండు సార్లు ఆలోచించి పర్యాటకులు ఈ మాల్లోకి అడుగుపెడుతున్నారు. కొందరైతే కిటికీల్లో నుంచే తమకు కావాల్సిన ఫుటేజీ తీసుకొని అక్కడ్నుంచి నిష్క్రమిస్తున్నారు. తాము తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ఫలిస్తోందని ఈ మాల్ మేనేజర్ టోనీ మెరినో తెలిపారు. అనవసర సందర్శకుల తాకిడి లేకపోవడంతో వినియోగదారులకు సౌకర్యంగా ఉందని చెప్పారు. మొత్తానికి ఈ ఆలోచనను కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ‘ఈ ప్లాన్ను అన్ని స్టోర్లలో అమలు చేస్తే పర్యాటకులందరి పర్సులు ఖాళీ అవుతాయని ’ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీగా నిలిచారు.