Mexico: డ్రగ్స్ డాన్ను పట్టుకుంటే ఇంత విధ్వంసమా.. అంత ధైర్యమెక్కడిది?
మెక్సికోలో డ్రగ్ మాఫియా డాన్ గుజ్మన్ను అరెస్టు చేసిన తర్వాత ముఠా సభ్యులు మారణహోమం సృష్టించారు. పటిష్ఠ భద్రత ఉన్న విమానాశ్రయంపైనే కాల్పులు జరిపారు. ఆ ముఠాకు అంతధైర్యం ఎక్కడిది? గుజ్మన్ చరిత్ర ఏంటి?
ఇంటర్నెట్డెస్క్: మెక్సికోలో పేరుమోసిన డ్రగ్ మాఫియా సూత్రధారి ఎల్ చాపో కుమారుడు ఒడివియో గుజ్మన్ లోపెజ్ను అరెస్టు చేసిన క్రమంలో భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. తమ నాయకుడిని అరెస్టు చేశారన్న కోపంతో ముఠా నాయకులు ఏకంగా విమానాశ్రయంపైనే దాడికి దిగారు.. ఎక్కడికక్కడ రహదారులు దిగ్బంధించి మారణకాండ సృష్టించారు. మిలటరీ సిబ్బంది, డ్రగ్ నిందితులుగా భావిస్తున్నవారంతా కలిసి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అరాచక పర్వానికి మెక్సికోలోని సినలోవా రాష్ట్రం వేదికగా నిలిచింది. అసలెవరీ గుజ్మన్ లోపెజ్.. డ్రగ్స్ సరఫరా ముఠాకు అంత ధైర్యమెలా వచ్చింది?
గుజ్మన్ లోపెజ్ గురించి తెలుసుకునే ముందు అతడి తండ్రి ఎల్ చాపో గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అగ్రరాజ్యం అమెరికాకు వేలాది టన్నుల డ్రగ్స్ను సరఫరా చేసి చివరికి పట్టుబడిన డ్రగ్ మాఫియా కింగే ఎల్ చాపో. కొకైన్, హెరాయిన్, మెతాంపటమైన లాంటి మాదక ద్రవ్యాలను ఎంతో చాకచక్యంగా అమెరికాకు తరలించి కోట్లకు పడగలెత్తాడు. 2009 ప్రపంచ కుబేరుల జాబితాలో 701 స్థానం సంపాదించాడంటే డ్రగ్స్తో ఎంతలా కూడబెట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. తిరుగులేని మాఫియా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన అతడిని పోలీసులు అరెస్టు చేసి మెక్సికన్ జైలులో బంధించారు. 2015లో అక్కడి నుంచి సొరంగం ద్వారా పారిపోయాడు. ఆ తర్వాత మెక్సికన్ పోలీసులు మళ్లీ అరెస్టు చేసి 2017లో అమెరికాకు అప్పగించారు. అతడిపై డ్రగ్ సరఫరాతోపాటు మనీలాండరింగ్ తదితర 10 కేసులు నమోదు చేసిన అమెరికా.. 2019లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అప్పటి నుంచి అతడు అమెరికా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు.
తండ్రి బాటలోనే ‘ది మౌస్’
తండ్రి జైలుకు వెళ్లిన తర్వాత ముఠా బాధ్యతలను అతడి కుమారుడు గుజ్మన్ లోపెజ్ తీసుకున్నాడు. డ్రగ్మాఫియా సామ్రాజ్యంలో తండ్రిని మించిన తనయుడిలా ఎదిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కేవలం డ్రగ్ సరఫరాతోపాటు తన ముఠా సభ్యులతో రౌడీయిజం, హత్యలకు కూడా వెనకాడేవాడు కాదు. తండ్రి జైలుకు వెళ్లినా కార్యక్రమాలు ఏమాత్రం ఆగలేదని, వాటన్నింటినీ గుజ్మన్ కొనసాగిస్తున్నాడని అక్కడి అధికారులకు స్పష్టమైన సమాచారం ఉంది. అయితే, ‘ది మౌస్’ అని పేరుబడ్డ అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించి పలుమార్లు పోలీసులు విఫలమయ్యారు. చివరికి భారీ మిలటరీ ఆపరేషన్ చేపట్టి క్యూలియకాన్లో అతడిని అరెస్టు చేశారు. గుజ్మన్ను అరెస్టు చేశారన్న విషయం తెలియగానే ముఠా సభ్యులు రెచ్చిపోయారు. ఎక్కడిక్కడ రోడ్లను దిగ్బంధించి విధ్వంసానికి పాల్పడ్డారు.డజన్ల కొద్దీ వాహనాలకు నిప్పు పెట్టారు. ఏకంగా విమానాశ్రయంపైకే దాడికి దిగారు.
అధికారులకు ముచ్చెమటలు
సినలోవా పేరు వినగానే అక్కడి అధికారులకు ముచ్చెమటలు పడతాయి. దాదాపు 58,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఆ రాష్ట్రంలో డ్రగ్ మాఫియాదే రాజ్యం. స్థానిక నేతలకు వారు ఏది చెప్తే అదే వేదం. పేరుకే నాయకులు గానీ పాలన అంతా దాదాపు వీరి కనుసన్నల్లోనే సాగుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ రాష్ట్రంలో పని చేయాల్సి వస్తే అధికారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మరీ నిర్ణయం తీసుకుంటారు. పటిష్ఠ భద్రత ఉండే విమానాశ్రయంపైనే దాడులకు దిగారంటే వారి సామర్థ్యాన్ని, స్థానికంగా వారికున్న పట్టును అంచనా వేయొచ్చు.
వారంతా నమ్మిన బంటులు
గుజ్మన్ లోపెజ్కు స్థానికుల నుంచి మద్దతు పుష్కలంగా ఉంటుంది.అందుకే ఆ డ్రగ్ కింగ్ను పట్టుకోవడం అధికారులకు కత్తిమీద సాములా తయారైంది. డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చిన సొమ్మును కేవలం తాను మాత్రమే అనుభవించకుండా.. అక్కడి ప్రజలకు గుజ్మన్ పంచిపెడుతుంటాడు. అందువల్ల వారంతా ఈ ముఠాకు మద్దతుగా నిలుస్తుంటారని స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు యువకులను ఆకర్షించేలా గుజ్మన్ లోపెజ్ వారికి ఆర్థిక సహకారం చేస్తుంటాడు. దీంతో వారంతా అతడికి నమ్మిన బంటులా పని చేస్తారు. డ్రగ్స్ సరఫరా కత్తిమీద సాములాంటిదని తెలిసినా ప్రాణాలకు తెగించి పోరాడుతుంటారు. ఆ నమ్మకమే గుజ్మన్ లోపెజ్కు కలిసొచ్చింది. ప్రభుత్వాన్నే శాసించే శక్తిగా ఎదిగేలా చేసింది. మరోవైపు ఉత్తర అమెరికా దేశాల నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మెక్సికోకు రావాల్సి ఉంది. అయితే, సోమవారం రావాల్సిన ఆయన ఒక రోజు ముందుగా ఇవాళే చేరుకుంటున్నట్లు మెక్సికో విదేశీ వ్యవహారాల మంత్రి మార్సిలో ఎబ్రాడ్ తెలిపారు. ఎల్ చాపో అమెరికాలో శిక్ష అనుభవిస్తుండటం, తాజాగా గుజ్మన్ కూడా అరెస్టయిన నేపథ్యంలో అధ్యక్షుడు జోబైడెన్ ఖరారైన షెడ్యూల్కు ముందే మెక్సికోకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
జపాన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే ఓ సంప్రదాయం గురించిన విషయాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. -
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
నెటిఫ్లిక్స్ (Netflix) నిరసన సెగను ఎదుర్కొంటోంది. దానిని బాయ్కాట్ చేయాలంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు