Ukraine: బేకరీపై భీకర దాడి.. 28 మంది మృతి!

రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌ ప్రాంతంలోని ఓ బేకరీపై జరిగిన దాడిలో 28 మంది మృతి చెందారు.

Published : 04 Feb 2024 16:46 IST

కీవ్‌: ఉక్రెయిన్‌ (Ukraine)లోని రష్యా ఆక్రమిత లుహాన్స్క్‌ ప్రాంతంపై భీకర దాడి జరిగింది. ఈ ఘటనలో లిసిచాన్స్క్‌ నగరంలోని ఓ బేకరీ ధ్వంసం కాగా.. దాదాపు 28 మంది మృతి చెందారు. మరణించిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు రష్యా (Russia) అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మరో 10 మందిని కాపాడినట్లు తెలిపారు. ఇది కీవ్‌ బలగాల పనేనని ఆరోపించారు. ఈ ఘటనపై ఉక్రెయిన్‌ ఇంకా స్పందించలేదు.

పశ్చిమాసియాలో అమెరికా ప్రతీకార దాడులు

మరోవైపు.. మాస్కో దళాలు సుమీ ప్రాంతంలో 16 చోట్ల దాడులు చేశాయని కీవ్‌ సైన్యాధికారులు ఆదివారం వెల్లడించారు. గత నెలలోనూ డొనెట్స్క్‌లోని ఓ మార్కెట్‌పై జరిగిన క్షిపణి దాడిలో 27 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లవుతున్నా.. పరిస్థితులు సద్దుమణగడం లేదు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల వ్యాఖ్యానించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని