Lukashenko: ‘మేం సరిగా డీల్ చేయలేకపోయాం’: వాగ్నర్ తిరుగుబాటు నేపథ్యంలో లుకషెంకో వ్యాఖ్యలు
తిరుగుబాటు అనంతరం వాగ్నర్ అధిపతి ప్రిగోజిన్( Yevgeny Prigozhin) తాజాగా బెలారస్(Belarus)లో ల్యాండ్ అయ్యారని సమాచారం. మరోపక్క బెలారస్ అధ్యక్షుడు ఈ తిరుగుబాటు గురించి స్పందించారు.
మిన్స్క్: ఉక్రెయిన్(Ukraine)పై దండయాత్రలో రష్యా(Russia) సైన్యానికి అండగా నిలిచిన వాగ్నర్ కిరాయి సేనలు(Wagner Group) ఒక్కసారిగా తిరుగుబాటు చేయడం పుతిన్(Putin) ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టిన సంగతి తెలిసిందే. రష్యా పొరుగుదేశం బెలారస్(Belarus) మధ్యవర్తిత్వంతో ఆ తిరుగుబాటును వాగ్నర్ అధిపతి ప్రిగోజిన్( Yevgeny Prigozhin) మధ్యలోనే నిలిపివేశారు. శనివారం నుంచి ఆయన జాడపై స్పష్టత లేనప్పటికీ.. ప్రస్తుతం బెలారస్ రాజధాని మిన్స్క్ సమీపంలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ తిరుగుబాటుపై బెలారస్(Belarus) అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో స్పందించారు. రష్యా సైన్యం, వాగ్నర్ ముఠా మధ్య తలెత్తిన అసంతృప్తిని సరిగా డీల్ చేయలేకపోయామని వెల్లడించారు.
‘మేం ఈ పరిస్థితిని ఊహించలేకపోయాం. సైన్యం, వాగ్నర్ గ్రూప్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు వాటంతట అవే సమసిపోతాయని భావించాం. కానీ అలా జరగలేదు. అయితే మొత్తంగా ఇక్కడ హీరోలు ఎవరూ లేరు. అందరూ ఒకటే’ అని లుకషెంకో వెల్లడించినట్లుగా ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ప్రిగోజిన్ మంగళవారం బెలారస్(Belarus) చేరుకున్నట్లు సమాచారం. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఒకటి ఈ మేరకు అంచనా వేసింది. మరోపక్క రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్.. ప్రిగోజిన్పై నమోదైన కేసుని ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. ఇది కూడా లుకషెంకో(Alexander Lukashenko) మధ్యవర్తిత్వం ఫలితమే.
ఇదిలా ఉంటే.. వాగ్నర్ గ్రూప్ ప్రవేశించిన తర్వాత రష్యా సైన్యం కీలక విజయాలు సాధించింది. అయితే వాటి ఘనత ఎవరికి దక్కాలనే దానిపై ఈ రెండింటి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న తమ సైనికులకు ఆయుధాలు సరఫరా చేయడంలో జాప్యం జరుగుతోందని, అందుకు రక్షణ మంత్రి సెర్గీ షొయిగునే కారణమని ప్రిగోజిన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అలాగే దేశం కోసం పోరాడుతున్న తమను అంతమొందించాలని ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విభేదాలు ముదిరి.. తిరుగుబాటుకు దారితీశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
India-Maldives: భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. -
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా వేగానికి చెక్ రిపబ్లిక్ కోర్టు బ్రేకులు వేసింది. -
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. -
నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. -
అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. -
ట్రంప్నకు వెయ్యి డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. -
రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ
రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ఫ్ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..