Elon Musk: నాడు మిత్రుడి భార్యతో ఎలాన్ మస్క్ అఫైర్ నిజమే.. అమెరికాలో సంచలన కథనం
Elon Musk: గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్యతో ఎలాన్ మస్క్ గతంలో అఫైర్ సాగించడం నిజమేనంటూ అమెరికాలో సంచనల కథనం వెలువడింది.
ఇంటర్నెట్ డెస్క్: అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ (Google co-founder Sergey Brin) భార్య నికోల్ షానన్తో ఆయన వివాహేతర బంధం (Affair) సాగించారని, అందువల్లే సెర్గీ దంపతులు విడిపోయారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.
2021లో నికోల్ (Nicole Shanahan) న్యూయార్క్లో తన పుట్టినరోజు వేడుకలు ఏర్పాటుచేశారు. ఆ పార్టీకి సెర్గీ స్నేహితుడైన ఎలాన్ మస్క్ (Elon Musk) కూడా హాజరయ్యారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ బంధం మొదలైనట్లు సదరు కథనం పేర్కొంది. అదే ఏడాది డిసెంబరులో మియామీలో మస్క్ సోదరుడు ఇచ్చిన విందులో నికోల్ పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరూ కెటమిన్ డ్రగ్స్ తీసుకున్నారని, కొన్ని గంటల పాటు కన్పించకుండా పోయారని ఆ పార్టీకి వచ్చిన నలుగురు ధ్రువీకరించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది.
మస్క్తో తాను శారీరక సంబంధం కొనసాగిస్తున్నట్లు నికోల్ తన భర్త సెర్గీ బ్రిన్, ఇతర కుటుంబసభ్యుల ముందు అంగీకరించారట. ఈ విషయాన్ని మరో ముగ్గురు విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. ఈ పార్టీ జరిగిన రెండు వారాల తర్వాత నుంచి విడివిడిగా ఉన్న సెర్గీ, నికోల్ 2022లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 18 నెలల తర్వాత గతేడాది వీరికి విడాకులు మంజూరయ్యాయి. ప్రస్తుతం నికోల్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్కు రన్నింగ్ మేట్గా పోటీ చేస్తున్నారు.
రెండేళ్ల కిందటే మస్క్, నికోల్ అఫైర్ వార్తలు బయటకు రాగా.. వీరిద్దరూ కొట్టిపారేశారు. ఆమెతో తనకు ఎలాంటి బంధం లేదని మస్క్ అప్పట్లో ట్వీట్ చేశారు. మరోవైపు, ఈ వ్యవహారం కారణంగా మస్క్, సెర్గీ స్నేహబంధం కూడా ముగిసినట్లు వార్తలు వచ్చాయి. మస్క్, సెర్గీ ఒకప్పుడు మంచి మిత్రులు. టెస్లా సంస్థ తయారుచేసిన తొలి కార్లను అందుకున్నవారిలో సెర్గీ కూడా ఒకరు. అంతేగాక, 2008లో మాంద్యం సమయంలో టెస్లా కార్యకలాపాలు కొనసాగించేందుకు సెర్గీ 5 లక్షల డాలర్లు సాయం చేశారు. మస్క్కు చెందిన కంపెనీల్లో ఆయనకు పెట్టుబడులు కూడా ఉండేవి. అయితే, ఈ వ్యవహారంతో వాటిని ఉప సంహరించుకుంటున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీని కెనడాలో జీ7కు ఆహ్వానిస్తారా..? ట్రూడో ఏమన్నారంటే..
వచ్చే ఏడాది జీ7 సదస్సు కెనడాలో జరగనుంది. దీనికి భారత్ను ఆహ్వానిస్తారా అన్న ప్రశ్న ట్రూడోకు ఎదురైంది. దీనికి ఆయన చాలా లౌక్యంగా సమాధానం ఇచ్చారు. -
2,100 అణ్వాయుధాలు ప్రయోగానికి సిద్ధం: సిప్రి నివేదిక
Nuclear Weapons: ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్రాల అభివృద్ధి పెరుగుతోందని సిప్రి నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అణ్వాయుధాలను పెంచుకుంటున్న దేశంగా చైనా నిలిచిందని పేర్కొంది. -
పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికాకు నిఖిల్ గుప్తా అప్పగింత!
Gurpatwant Singh Pannun: ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అధికారులు అమెరికాకు అప్పగించినట్లు సమాచారం. -
శ్రీలంక - భారత్ రోడ్డు నిర్మాణం.. ప్రతిపాదనల అధ్యయనం తుదిదశకు
భారత్, శ్రీలంక మధ్య భూ అనుసంధానం ప్రతిపాదనపై ద్వీపదేశం కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై చేస్తున్న అధ్యయనం తుదిదశకు చేరుకొన్నట్లు తెలిపింది. -
ఉక్రెయిన్ సమగ్రతను గౌరవించాలి
ఉక్రెయిన్లో శాంతిస్థాపన కోసం ప్రపంచ దేశాలు తాజాగా పిలుపునిచ్చాయి. ఆ దేశ ప్రాదేశిక సమగ్రతే.. రష్యా యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందానికి ప్రాతిపదికగా ఉండాలని పేర్కొన్నాయి. -
అమెరికాలో కాల్పుల మోత.. ఇద్దరి మృతి
అమెరికాలోని టెక్సాక్లో జరిగిన ఓ వేడుకలో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. మరికొంత మంది గాయపడ్డారు. -
రష్యా నిర్బంధ కేంద్రంలో సిబ్బందిని బందీలుగా చేసుకొని కలకలం
రష్యాలో రోస్తోవ్ ప్రాంతంలోని ఓ నిర్బంధ కేంద్రంలో ఆదివారం తీవ్ర కలకలం చెలరేగింది. అక్కడి కొంతమంది ఖైదీలు.. ఇద్దరు సిబ్బందితోపాటు కొందరు సహచర ఖైదీలను తమ బందీలుగా చేసుకొని భయభ్రాంతులకు గురిచేశారు. -
తుది అంకానికి హజ్ యాత్ర
సౌదీ అరేబియాలో తీవ్రమైన వేసవితాపం నడుమ ఆదివారం ముస్లిం యాత్రికుల హజ్ యాత్ర తుది అంకానికి చేరుకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈదుల్ అధా (బక్రీద్) వేడుకలు మొదలయ్యాయి. -
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
భారత్తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని కెనడా దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. జీ7 దేశాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
దక్షిణ గాజాలో పగటి పూట కాల్పుల విరామం
గాజాపై గత కొన్ని రోజులుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ గాజాలోని రఫాలో పగటిపూట యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించింది. -
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే.. దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సమయం వచ్చేసింది.. నా ప్రవేశం ప్రారంభమైంది.. శశికళ కీలక వ్యాఖ్యలు
-
రెండు గ్రూప్లుగా సూపర్-8.. ఆ టీమ్లు ఇవే
-
కమల్ హాసన్ బయోపిక్.. శ్రుతి హాసన్ రియాక్షనిదే
-
ప్రధాని మోదీని కెనడాలో జీ7కు ఆహ్వానిస్తారా..? ట్రూడో ఏమన్నారంటే..
-
ఘోర ప్రమాదం: రెండు రైళ్లు ఢీ.. గాల్లోకి లేచిన బోగీ
-
తుపాను ముందు నిశ్శబ్దం.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!