Israel-Hamas war: గాజాలో ఆస్తి నష్టం 18.5 బిలియన్ డాలర్లు.. నివేదిక విడుదల చేసిన ప్రపంచ బ్యాంకు
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యద్ధం నేపథ్యంలో జరిగిన ఆస్తి నష్టంపై ప్రపంచబ్యాంకు ఒక నివేదిక విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) కారణంగా గాజాలో సుమారు 18.5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ప్రపంచ బ్యాంకు (World Bank) పేర్కొంది. 2022లో వెస్ట్బ్యాంక్ (West bank), గాజా (Gaza) ఉమ్మడి ఆర్థిక ఉత్పత్తిలో ఇది 97 శాతానికి సమానమని వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 7 నుంచి ఈ ఏడాది జనవరి చివరి నాటికి గాజాలో ఆస్తినష్టంపై ఒక మధ్యంతర అంచనా నివేదికను ప్రపంచబ్యాంకు విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితి (UN), యూరోపియన్ యూనియన్ల సహకారంతో తయారు చేసిన ఈ రిపోర్టులో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఆర్థిక రంగంలోని ప్రతి వ్యవస్థకు భారీ నష్టం చేకూరినట్లు తెలిపింది. పెద్ద ఎత్తున ఇళ్లు ధ్వంసం కావడం ద్వారానే 70 శాతం నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొంది.
ఇంత భారీ నష్టంతో ఇజ్రాయెల్ దళాల దాడులకు గాజా స్ట్రిప్లో ఉన్న ప్రజలు చెల్లాచెదురయ్యారు. జనాభాలో సగానికి మించి తీవ్ర కరవు అంచున ఉన్నట్లు, ఆహార అభద్రత, పోషకాహార లోపాన్ని అక్కడి ప్రజలంతా ఎదుర్కొంటున్నట్లు తేలింది. దాడులు, పోరాటం ఫలితంగా మూడోంతుల ప్రజలు తమ ప్రాంతాలను వీడారు. 10 లక్షలకు పైగా జనాభా ఇళ్లు లేకుండా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. నీటి, పారిశుద్ధ్య వ్యవస్థలు దాదాపు కుప్పకూలాయి. 100 శాతం మంది చిన్నారులు విద్యకు దూరమయ్యారు. 92 శాతం రోడ్లు ధ్వంసమైనట్లు నివేదికలో పేర్కొంది.
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు మారణకాండ సృష్టించడంతో సుమారు 1200 మంది మృతి చెందారు. 250 మందిని హమాస్ బందీలుగా చేసుకుంది. దీంతో ప్రతిచర్యగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. హమాస్ అగ్రనేతలే లక్ష్యంగా సొరంగాల ధ్వంసంతో పాటు వైమానిక, భూతల దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో హమాస్ అగ్రశ్రేణి కమాండర్లు పలువురు హతమయ్యారు. గాజాను పరిపాలిస్తున్న హమాస్ ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 32,916 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. వీరిలో మహిళలు, చిన్నారులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆసుపత్రులు, పాఠశాలల కింద మిలిటెంట్లు సొరంగాలను నిర్మించుకోవడంతో ఐడీఎఫ్ బలగాలు భారీ ఎత్తున వాటిని ధ్వంసం చేశాయి. గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల ఫలితంగా ఇప్పటి 26 మిలియన్ టన్నుల వ్యర్థాలు పోగైనట్లు అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు
క్యాన్సర్తో బాధపడుతున్న ఓ వ్యక్తి జాక్పాట్ కొట్టేశాడు. లాటరీలో ఏకంగా రూ. 10 వేల కోట్లకు పైగా గెలుచుకున్నాడు. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
Pakistan: పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని అధికారులు నిర్ణయించారు. మరి ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటంటే..? -
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
బీజింగ్: దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో బుధవారం ఓ హైవే రోడ్డులో కొంత భాగం కుప్పకూలిపోవడంతో19 మంది మృతి చెందారు. -
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర కేసుపై వచ్చిన మీడియా కథనంపై వ్యాఖ్యానించేందుకు అమెరికా విదేశాంగశాఖ అధికారి నిరాకరించారు. ఈ అంశంతో తాము న్యూదిల్లీతో టచ్లోనే ఉన్నామన్నారు. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
ఉక్రెయిన్ తీరప్రాంత నగరమైన ఒడెస్సాలోని హ్యారిపోటర్ కోట(Harry Potter Castle)గా పేరున్న భవనాన్ని రష్యా క్షిపణి ధ్వంసం చేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు
Columbia University: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా విద్యార్థులు చేస్తున్న నిరసనలను పోలీసులు క్రమంగా అదుపులోకి తీసుకొస్తున్నారు. తాజాగా కొలంబియా వర్సిటీలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మాటలకందని విషాదమే.. రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ఐరాస ఆందోళన
Israel: రఫాపై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ దాని పరిణామాలపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాగైనా దీన్ని ఆపేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
-
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
-
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!