Israel-Hamas war: గాజాలో ఆస్తి నష్టం 18.5 బిలియన్ డాలర్లు.. నివేదిక విడుదల చేసిన ప్రపంచ బ్యాంకు
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యద్ధం నేపథ్యంలో జరిగిన ఆస్తి నష్టంపై ప్రపంచబ్యాంకు ఒక నివేదిక విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) కారణంగా గాజాలో సుమారు 18.5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ప్రపంచ బ్యాంకు (World Bank) పేర్కొంది. 2022లో వెస్ట్బ్యాంక్ (West bank), గాజా (Gaza) ఉమ్మడి ఆర్థిక ఉత్పత్తిలో ఇది 97 శాతానికి సమానమని వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 7 నుంచి ఈ ఏడాది జనవరి చివరి నాటికి గాజాలో ఆస్తినష్టంపై ఒక మధ్యంతర అంచనా నివేదికను ప్రపంచబ్యాంకు విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితి (UN), యూరోపియన్ యూనియన్ల సహకారంతో తయారు చేసిన ఈ రిపోర్టులో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఆర్థిక రంగంలోని ప్రతి వ్యవస్థకు భారీ నష్టం చేకూరినట్లు తెలిపింది. పెద్ద ఎత్తున ఇళ్లు ధ్వంసం కావడం ద్వారానే 70 శాతం నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొంది.
ఇంత భారీ నష్టంతో ఇజ్రాయెల్ దళాల దాడులకు గాజా స్ట్రిప్లో ఉన్న ప్రజలు చెల్లాచెదురయ్యారు. జనాభాలో సగానికి మించి తీవ్ర కరవు అంచున ఉన్నట్లు, ఆహార అభద్రత, పోషకాహార లోపాన్ని అక్కడి ప్రజలంతా ఎదుర్కొంటున్నట్లు తేలింది. దాడులు, పోరాటం ఫలితంగా మూడోంతుల ప్రజలు తమ ప్రాంతాలను వీడారు. 10 లక్షలకు పైగా జనాభా ఇళ్లు లేకుండా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. నీటి, పారిశుద్ధ్య వ్యవస్థలు దాదాపు కుప్పకూలాయి. 100 శాతం మంది చిన్నారులు విద్యకు దూరమయ్యారు. 92 శాతం రోడ్లు ధ్వంసమైనట్లు నివేదికలో పేర్కొంది.
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు మారణకాండ సృష్టించడంతో సుమారు 1200 మంది మృతి చెందారు. 250 మందిని హమాస్ బందీలుగా చేసుకుంది. దీంతో ప్రతిచర్యగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. హమాస్ అగ్రనేతలే లక్ష్యంగా సొరంగాల ధ్వంసంతో పాటు వైమానిక, భూతల దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో హమాస్ అగ్రశ్రేణి కమాండర్లు పలువురు హతమయ్యారు. గాజాను పరిపాలిస్తున్న హమాస్ ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 32,916 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. వీరిలో మహిళలు, చిన్నారులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆసుపత్రులు, పాఠశాలల కింద మిలిటెంట్లు సొరంగాలను నిర్మించుకోవడంతో ఐడీఎఫ్ బలగాలు భారీ ఎత్తున వాటిని ధ్వంసం చేశాయి. గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల ఫలితంగా ఇప్పటి 26 మిలియన్ టన్నుల వ్యర్థాలు పోగైనట్లు అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారయ్యారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?