Turkey: నెతన్యాహుకి.. హిట్లర్కి తేడా లేదు: తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్
నెతన్యాహుకి, హిట్లర్కి మధ్య తేడా లేదని, నిజానికి హిట్లర్ కంటే నెతన్యాహునే గొప్పవాడని తుర్కియే (Turkey)అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అన్నారు.
అంకారా: ఇజ్రాయెల్ (Isreal) ప్రధాన మంత్రి నెతన్యాహు (Netanyahu)కి, జర్మనీ నియంత హిట్లర్ (Hitler)కి తేడా లేదని తుర్కియే (Turkey) అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అన్నారు. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. తుర్కియే రాజధాని అంకారాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నెతన్యాహు తీరుపై మండిపడ్డారు.
‘‘నెతన్యాహుకి, హిట్లర్కి మధ్య తేడా లేదు. నిజానికి హిట్లర్ కంటే నెతన్యాహునే గొప్పవాడు. ఎందుకంటే అతడికి అమెరికా, పాశ్చాత్య దేశాల మద్దతు ఉంది’’అని ఎర్డోగాన్ అన్నారు. ఇజ్రాయెల్ను ఉగ్రవాద దేశంగా అభివర్ణించిన ఆయన.. గాజా పట్ల నెతన్యాహు కసాయిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అంతేకాదు.. హమాస్ను స్వేచ్ఛ కోసం పోరాడుతున్న సంస్థ అని ప్రశంసించారు.
తుర్కియే అధ్యక్షుడి వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందించారు. ‘‘కుర్దులపై మారణహోమం సృష్టిస్తూ.. తనను విమర్శించే జర్నలిస్టులకు జైలు శిక్ష విధించడంలో ప్రపంచ రికార్డు కలిగిన ఎర్డోగానే మనకు నైతికతను బోధించే చివరి వ్యక్తి అవుతాడు’’అని ఎద్దేవా చేశారు. హమాస్పై ప్రశంసలు గుప్పిస్తోన్న ఎర్డోగాన్.. ఆ సంస్థ నాయకులకు ఆతిథ్యమిస్తున్నారని నెతన్యాహు ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం పోరాడుతోందని తెలిపారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ గ్రూప్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హమాస్ మిలిటెంట్లు 1,140 ఇజ్రాయెలీ ప్రజలను విచక్షణ రహితంగా కాల్చి చంపేశారు. 250 మందిని బందీలుగా చేసుకున్నారు. మరుసటి రోజు నుంచే ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకారంతో హమాస్ స్థావరాలున్న గాజాపై విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటి వరకు గాజాలో 21,110 మంది మృతి చెందారని, 55వేలకు పైగా ప్రజలు గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
-
సామాన్యుడిని వదిలేసి.. సారొస్తే కోట్లు తగలేసి