TikTok: మా పిల్లలు టిక్టాక్ వాడరు.. ఆ కంపెనీ సీఈవో ఆసక్తికర సమాధానం..!
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో టిక్టాక్(TikTok) ఎదుర్కొంటోన్న నిషేధం, దానిపై ఉన్న ఆందోళనల గురించి ఆ సంస్థ సీఈఓను యూఎస్ కాంగ్రెస్ ప్రశ్నించింది.
వాషింగ్టన్: ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్(TikTok) ఇప్పటికే చాలా దేశాల్లో నిషేధం ఎదుర్కొంటోంది. భద్రతా కారణాల దృష్ట్యా పలు దేశాలు దీనిపై చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆ సంస్థ సీఈఓ షో జి చ్యూ(Shou Zi Chew) యూఎస్ కాంగ్రెస్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనకు తీవ్రమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘మీ పిల్లలు టిక్టాక్ వాడుతున్నారా..?’ అని కాంగ్రెస్ సభ్యులు ఆయన్ని ప్రశ్నించారు.
‘టిక్టాక్ కార్యకలాపాలు మొత్తం దాని మాతృసంస్థ బైట్డాన్స్ నుంచే సాగుతాయి. చైనా(China) కేంద్రంగా బైట్డ్యాన్స్ పనిచేస్తోంది. టిక్టాక్ యాప్ వినియోగదారుల డేటాను చైనా ప్రభుత్వంతో పంచుకోదు. అలాగే 150 మిలియన్ల అమెరికన్ యూజర్ల డేటాకు ఇది ఎలాంటి ప్రమాదం కలిగించదు’ అంటూ తన సంస్థ విధానాలను చ్యూ(Shou Zi Chew) పునరుద్ఘాటించారు.
ఇదిలా ఉంటే భారత్ సహా ఇతర దేశాల్లో టిక్టాక్(TikTok)పై ఉన్న నిషేధం గురించి చట్టసభ్యుల్లో ఒకరు ప్రశ్నించారు. ‘ఈ యాప్ చైనా ప్రభుత్వం పరిధిలో పనిచేస్తోంది. ఈ క్రమంలో భద్రతాపరమైన ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఇవి తప్పని మీరు ఎలా చెప్పగలరు..?’ అని ఆ సభ్యుడు అడిగారు. ‘ఈ ఆరోపణలన్నీ ఊహాజనితమైనవి. వీటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు మాకు కనిపించలేదు’ అని సీఈఓ సమాధానం ఇచ్చారు.
అయితే భారతదేశం విధించిన నిషేధం పై కాంగ్రెస్ సభ్యుడు మరోసారి ప్రస్తావించారు. ‘టిక్టాక్(TikTok)ను భారత్ 2020లో నిషేధించింది. మార్చి 21న వెలువడిన ఫోర్బ్స్(Forbes) కథనం.. భారత యూజర్ల డేటా ఉద్యోగులకు, సంస్థకు ఏ విధంగా అందుబాటులో ఉందో వెల్లడించింది’ అంటూ ఆ కథనం గురించి ప్రశ్నించారు. అందుకు సీఈఓ సమాధానం ఇస్తూ.. ‘ఇది తాజా కథనం. దీని గురించి పరిశీలించమని మా సిబ్బందికి సూచించాను. మా వద్ద కఠినమైన డేటా యాక్సెస్ విధానాలు ఉన్నాయి. ఇలాంటి కథనాలతో మేం ఏకీభవించం’ అని వివరించారు.
మీ పిల్లలు టిక్టాక్ వాడతారా..?
తన పిల్లలు టిక్టాక్(TikTok) ఉపయోగించరంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా చ్యూ(Shou Zi Chew) వెల్లడించారు. ‘వారు సింగపూర్లో ఉంటారు. ఆ దేశంలో 13 ఏళ్లలోపు పిల్లలకు.. టిక్టాక్ చైల్డ్ వెర్షన్ అందుబాటులో లేదు. ఈ వెర్షన్ అమెరికాలో అందుబాటులో ఉంది. నా పిల్లలు అమెరికాలో ఉంటే వారు ఆ యాప్ను వాడేందుకు అంగీకరిస్తాను’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
పాకిస్థాన్ క్షిపణి కార్యక్రమాలకు పరికరాలు సరఫరా చేస్తున్నాయనే ఆరోపణలపై మూడు చైనా సంస్థలతోపాటు బెలారస్కు చెందిన ఓ కంపెనీపై అమెరికా ఆంక్షలు విధించింది. -
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
ప్రమాదకర టాస్క్లతో యువతను ఆత్మహత్యకు ప్రేరేపిస్తుందనే విమర్శలున్న బ్లూవేల్ ఛాలెంజ్ (Blue Whale Challenge) మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తోన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. -
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
Iran-Israel: తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే ప్రతిస్పందన చాలా కఠినంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఈ సందర్భంగా టెల్ అవీవ్పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. -
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?