Maldives: ముయిజ్జు పాలనకు అగ్నిపరీక్ష: నేడు మాల్దీవుల్లో పార్లమెంటు ఎన్నికలు
మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తీసుకొన్న భారత వ్యతిరేక వైఖరికి అగ్ని పరీక్ష ఎదురయింది. నేడు ఆ దేశ పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
మాలే: ద్వీపదేశం మాల్దీవులో పార్లమెంట్ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఇవి అధ్యక్షుడు ముయిజ్జు పాలనపై ప్రజా తీర్పుగా భావిస్తున్నారు. సెప్టెంబర్లో ఆయన అధికారం చేపట్టాక భారత వ్యతిరేక వైఖరిని అనుసరించారు. ఈ క్రమంలో అక్కడున్న మన బలగాలను వెనక్కి పంపించారు. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలకు కీలక కాంట్రాక్టులను కట్టబెట్టారు. ప్రస్తుతం ఆ దేశ పార్లమెంటు సభ్యులు మాత్రం ముయిజ్జు తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. అతడి చర్యలును అడ్డుకోవడానికి మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ కలిసి పనిచేస్తున్నారు.
ముయిజ్జు సీనియర్ సహాయకుడు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘‘ఈ ఎన్నికల్లో భౌగోళిక రాజకీయాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత సైన్యాన్ని వెనక్కి పంపిస్తానని హామీ ఇచ్చి ముయిజ్జు అధికారంలోకి వచ్చారు. ఆ దిశగా ప్రయత్నించారు. కానీ, పార్లమెంటు ఆయనకు సహకరించడం లేదు. ఆయన ఎంపిక చేసిన మంత్రులకు వ్యతిరేకంగా ఓటేసి వారి పదవులు పోయేలా చేసింది’’ అని తెలిపారు. ఈ వ్యాఖ్యలను బట్టి ముయిజ్జు పార్టీ కూడా ఈ ఎన్నికలను తమ పాలనకు కఠిన పరీక్షగా భావిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాదాపు 2,85,000 మంది ఆదివారం నాడు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వీటి ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
మూడోసారి అంతరిక్షయానానికి సిద్ధమయ్యారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams). ఈ సందర్భంగా ఆమె తన ఇష్టాలను వెల్లడించారు. -
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
Israel Hamas Conflict: ఇజ్రాయెల్పై వస్తున్న విమర్శలను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. తమని ఏ దేశమూ నిలువరించలేదని వ్యాఖ్యానించారు. -
టెక్సాస్ను ముంచెత్తుతున్న వరదలు
భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
బ్రెజిల్లో వరద బీభత్సం.. 60 మంది మృతి
బ్రెజిల్లోని రియో గ్రాండ్ డొ సుల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. -
శ్వేతసౌధం ప్రహరీ గేటును ఢీకొన్న కారు: డ్రైవర్ దుర్మరణం
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం ప్రహరీ గేటును కారు ఢీకొట్టిందని, ఈ ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
కీలక క్రాసింగ్పై హమాస్ దాడి
గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్పై ఆదివారం హమాస్ రాకెట్లతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. -
మాదక ద్రవ్యాలు ఇచ్చి నాపై లైంగిక దాడి చేశారు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఎంపీ బ్రిటానీ లాగా(37)కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ సరదాగా గడపడానికి వెళ్లిన ఆమెకు కొంతమంది దుండగులు మాదకద్రవ్యాలు అందించారు. -
చట్టబద్ధ పాలన ఉన్న దేశం మాది
కెనడా.. చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో శనివారం పేర్కొన్నారు. తమ దేశంలో బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని, పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. -
అల్-జజీరాపై నిషేధం
హమాస్కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్పై ఆదివారం ఇజ్రాయెల్ నిషేధం విధించింది. -
హమాస్తో తాజా చర్చలు విఫలం?
ఇజ్రాయెల్తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ఆదివారం ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు