Earthquake: ఎటుచూసినా శవాల గుట్టలే.. భూకంప మృతులు 11వేలకు పైనే!
తుర్కియే (Turkey), సిరియా (Syria)లో భూకంపం (Earthquake) సృష్టించిన ఘోర విపత్తులో మృతుల సంఖ్య 11వేలు దాటేసింది. ఏ భవనశిథిలాల కింద చూసినా సరే ప్రాణం లేని దేహాలే కన్పిస్తున్నటువంటి దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కలచివేస్తున్నాయి.
అంకారా: తుర్కియే (Turkey), సిరియా (Syria)ల్లో భారీ భూకంపం సృష్టించిన విలయంతో అక్కడ హృదయవిదారక దృశ్యాలు కొనసాగుతున్నాయి. వేలాదిగా భవనాలు కుప్పకూలి సమాధులను తలపిస్తుండటంతో ఆ శిథిలాల నుంచి మృతదేహాల్ని వెలికి తీసేందుకు సహాయక బృందాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఈ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 11వేల మందికి పైగా మృత్యువాతపడినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, గత దశాబ్ద కాలంలో సంభవించిన భూప్రళయాల్లో ఇంత భారీగా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఒక్క తుర్కియేలోనే 8,754మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటించగా.. సిరియాలో మొత్తంగా 2470 మంది ఈ ప్రకృతి ప్రకోపానికి బలైపోయారు. మొత్తంగా ఇప్పటివరకు 11,224 మంది మృతిచెందారు. మరోవైపు, గాయపడిన వారి సంఖ్య వేల సంఖ్యల్లోనే ఉంది. వేలాదిగా కుప్పకూలిపోయిన భవనాల శిథిలాలను తొలగిస్తుండటంతో ఏ రాయిని కదిపినా దాని కింద ప్రాణంలేని దేహాలే కనబడుతున్న దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కలిచివేస్తున్నాయి. మరోవైపు, శిథిలాల కింద ఊపిరాడక ప్రాణం కోసం పోరాడుతున్న పలువురు చిన్నారుల్ని గుర్తిస్తున్న సహాయక బృందాలు వారిని జాగ్రత్తగా బయటకు తీసి ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాల శిథిలాల కింద కుటుంబాలకు కుటుంబాలే విగత జీవులై పడి ఉన్న దృశ్యాలు హృదయాలను మెలిపెడుతున్నాయి.
ఈ ఘోర విపత్తుతో అల్లాడుతున్న ప్రాంతాలకు మరింత సహాయం అందించాలంటూ తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ అధికారులను ఆదేశించారు. భూకంపంతో భారీగా ప్రభావితమైన ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. ఇంకోవైపు, భూకంప ప్రభావిత జోన్లో ప్రస్తుతం దాదాపు 60,000 మందికి పైగా సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు. ఈ వినాశనం తీవ్రత అధికంగా ఉండటంతో ఇప్పటికీ అనేక మంది బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్న అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 20కి పైగా దేశాల నుంచి వెళ్లిన సహాయక బృందాలు తుర్కిష్ అత్యవసర బృందాలతో కలిసి సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నాయి. ఇంకోవైపు, ఈ భూవిలయంలో మృతుల సంఖ్య 20వేలు దాటే అవకాశం ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిన్న అంచనా వేసిన విషయం తెలిసిందే.
ఈ భూకంపం తీవ్రతకు తుర్కియేలోని మొత్తం 85 మిలియన్ల జనాభాలో 13 మిలియన్ల మంది ప్రభావితమయ్యారని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ వెల్లడించారు. ఈ భూ విలయం తీవ్రత అధికంగా ఉన్న 10 ప్రావిన్స్ల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు 8వేల మందికి పైగా పౌరుల్ని శిథిలాల నుంచి ప్రాణాలతో బయటకు తీసుకొచ్చినట్టు ప్రకటించారు. ఆయా ప్రాంతాల నుంచి 3.8లక్షల మందిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలు/వసతి గృహాలకు తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!