Ukraine: కుమారుడికి బర్త్డే గిఫ్ట్గా గ్రనేడ్.. అది కాస్తా పేలి మిలటరీ అడ్వైజర్ మృతి..!
ఉక్రెయిన్కు చెందిన ఓ సైనిక సలహాదారుడికి గ్రనేడ్ల పెట్టె బహుమతిగా వచ్చింది. దీనిని అతడి కుమారుడికి చూపే క్రమంలో ఒకటి పేలింది.
ఇంటర్నెట్డెస్క్: తన కుమారుడికి గ్రనేడ్ను చూపించే క్రమంలో ఉక్రెయిన్ (Ukraine) అత్యున్నత సైనిక అడ్వైజర్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అతడు ఆ దేశ మిలటరీ కమాండర్ ఇన్ చీఫ్కు సలహాదారుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకొంది. ‘‘నా స్నేహితుడు, సహాయకుడు మేజర్ హెన్నాడి చెస్ట్యకోవ్ విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు. అతడికి వచ్చిన బహుమతుల్లో గుర్తు తెలియని పరికరం పేలి మృతి చెందాడు’’ అని జనరల్ వాలేరి జలుజ్నీ ప్రకటించారు.
మరో వైపు ఈ ఘటనపై ఆ దేశ ఇంటరీయర్ మినిస్టర్ ఇగోర్ క్లైమెంకో వివరాలను వెల్లడించారు. ‘‘హెన్నాడి కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా బహుమతుల రూపంలో ఒక గ్రనేడ్ల పెట్టె వచ్చింది. దీనిని అతడు తన కుమారుడికి చూపించాడు. ఆ సమయంలో ఆ బాలుడు గ్రనేడ్ను చేతిలోకి తీసుకొని రింగ్ను పట్టుకొని తిప్పడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన అతడు కుమారుడి వద్ద నుంచి గ్రనేడును తీసుకొని దూరంగా వెళ్లాడు. ఈ క్రమంలో అది పేలింది. హెన్నాడికి దానిని ఎవరు గిఫ్ట్గా ఇచ్చారో గుర్తించాం. మరి కొన్ని గ్రనేడ్లు కూడా ఆ బహుమతుల్లో ఉన్నట్లు కనుగొన్నాం. దర్యాప్తు కొనసాగుతోంది’’ అని వెల్లడించారు. ఈ ఘటనలో 13 ఏళ్ల హెన్నాడి కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
తొలుత పోలీసులు దీనిని గిఫ్ట్బాంబు ఘటనగా అనుమానించారు. కానీ, ఆ తర్వాత అది సహచరుడి నుంచి అందిన బహుమతిగా గుర్తించారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. రష్యాతో యుద్ధం మొదలైన నాటి నుంచి అతడు చురుగ్గా ఉక్రెయిన్ సైనిక వ్యూహాలను నడుపుతున్నాడు. గతేడాది ఇలానే ఓ బొమ్మలో పేలుడు పదార్థాలను ఉంచి క్రెమ్లిన్ సన్నిహితుడిగా పేరున్న ఓ మిలటరీ బ్లాగర్కు పంపారు. అది పేలి అతడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
Ukraine-Russia Conflict: ఉక్రెయిన్పై యుద్ధంలో పైచేయి సాధించడం కోసం రష్యా రసాయన ఆయుధాలు వాడుతోందని అమెరికా ఆరోపించింది. -
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
Biden: విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్కు భయమంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. -
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాఫ్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..