Zelensky: రష్యా తీరు ISIS కంటే దారుణం : జెలెన్స్కీ ఆగ్రహం
ఉక్రెయిన్పై దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని బాధిత దేశం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఓ ఉక్రెయిన్ సైనికుడినిగా భావిస్తోన్న ఓ వ్యక్తిని చంపుతున్న తీరును చూస్తుంటే రష్యా ఐసిస్ కంటే దారుణంగా తయారయ్యిందని జెలెన్స్కీ తీవ్రంగా మండిపడ్డారు.
కీవ్: ఉక్రెయిన్పై దురాక్రమణ కొనసాగిస్తోన్న రష్యా (Ukraine Crisis).. అనేక యుద్ధ నేరాలకు పాల్పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్యా (Russia) సైన్యం చేతిలో బందీగా ఉన్న ఓ ఉక్రెయిన్ సైనికుడిని అత్యంత దారుణంగా చంపుతున్న (తల తీసివేస్తున్న) ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky).. రష్యాను ఐఎస్ఐఎస్తో పోల్చారు. రష్యా తీరు ఇస్లామిక్ స్టేట్ కంటే దారుణంగా ఉందని మండిపడ్డారు.
‘ఐఎస్ఐఎస్ కంటే అత్యంత దారుణంగా పుతిన్ సేనలు ప్రవర్తిస్తున్నాయి. అంత తేలికగా వారెలా చంపేస్తున్నారు. ఈ ఘటనను ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా విస్మరించలేరు. హంతకులు నైతిక బాధ్యత వహించాల్సిందే. ఇటువంటి భయంకర ఘటనలకు పాల్పడుతున్న వారిని ఓడించడం ఎంతో అవసరం. ఈ తరుణంలో ఐరాస భద్రతా మండలికి రష్యా అధ్యక్షత వహించడం అర్థరహితం. ఉక్రెయిన్ నుంచి రష్యా ఉగ్రమూకలను తరిమివేయాలి’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. యుద్ధ నేరంగా అనుమానిస్తోన్న ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అటు ఉక్రెయిన్ అంతర్గత భద్రతా వ్యవహారాల విభాగం కూడా వెల్లడించింది.
ఉక్రెయిన్ సైనికుడితో అత్యంత దారుణంగా వ్యవహరించినట్లు వచ్చిన వార్తలపై అటు రష్యా కూడా స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో భయంకరంగా ఉందని.. దాని ప్రామాణికతను ధ్రువీకరించాల్సి ఉందని తెలిపింది. ఉక్రెయిన్ సైనికులు భుజానికి ధరించే పసుపుపచ్చ బ్యాండు ఉన్న ఓ వ్యక్తిని చంపుతున్నట్లు వీడియోలో ఉంది. అయితే, ఈ పని రష్యా చేసిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. మరోవైపు దీనిని రష్యా తరఫున వాగ్నర్ గ్రూపు చేసి ఉండవచ్చనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్