Russia: ఆరు యుద్ధ విమానాలు ధ్వంసం.. రష్యా ఎయిర్బేస్పై విరుచుకుపడిన ఉక్రెయిన్
ఉక్రెయిన్ దళాలు రష్యాపై విరుచుకుపడ్డాయి. ఓ వైమానిక స్థావరంపై చేసిన దాడిలో ఆరు యుద్ధ విమానాలు పూర్తిగా ధ్వంసం కాగా.. మరో ఎనిమిది తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలువురు సిబ్బంది కూడా మరణించినట్లు చెబుతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్ (Ukraine) ఇంటెలిజెన్స్ సంస్థ ఎస్బీయూ, సైన్యం సంయుక్తంగా భారీ స్థాయిలో రష్యాపై దాడి చేశాయి. దక్షిణ రోస్టవ్లోని మోరోజోవ్స్క్ వైమానిక స్థావరంపై నిన్న రాత్రి జరిగిన ఈ దాడిలో ఆరు విమానాలు పూర్తిగా ధ్వంసం కాగా.. మరో ఎనిమిది వరకు తీవ్రంగా దెబ్బతిన్నాయని బారెన్స్ వార్తా సంస్థ పేర్కొంది. డజన్ల సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. తాము 44 డ్రోన్లను కూల్చివేశామని రష్యా రక్షణశాఖ పేర్కొంది. ఓ పవర్ సబ్స్టేషన్ కూడా ఈ దాడిలో దెబ్బతిన్నట్లు సమాచారం.
ఈ వైమానిక స్థావరంలో మొత్తం సు-24, సు-34, ఇతర టాక్టికల్ బాంబర్ విమానాలను ఉంచుతారు. దీనిని రష్యా పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు వినియోగిస్తారు. భద్రతా దళాలకు చెందిన దాదాపు 20 మంది వరకు సిబ్బంది ఈ దాడిలో మరణించి ఉంటారని కీవ్ ఇండిపెండెంట్ అంచనా వేస్తోంది. రష్యా వాయుసేన శక్తిని ఈ దాడి గణనీయంగా తగ్గిస్తుందని ఉక్రెయిన్ చెబుతోంది. మొత్తం 53 డ్రోన్లను ఏకకాలంలో ప్రయోగించినట్లు సమాచారం. ఈ ఎయిర్బేస్ వద్ద భారీగా పేలుళ్లు జరుగుతున్న వీడియో వైరల్గా మారింది. మరోవైపు బెల్గరోడ్, కరుస్క్ వద్ద కూడా ఉక్రెయిన్ డ్రోన్లు దాడులకు యత్నించాయి.
దాదాపు ఏడాది నుంచి రష్యా భూభాగంపై కూడా ఉక్రెయిన్ విజయవంతంగా దాడులు చేస్తోంది. ఈ మంగళవారం సెంట్రల్ టాటర్స్టాన్లోని ఓ భారీ చమురు కేంద్రం, డ్రోన్ల అసెంబ్లింగ్ యూనిట్లపై కీవ్ విరుచుకుపడింది. మరోవైపు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ నాటోతో సంబంధాలు బాగా దిగజారాయన్నారు. ఇవి ప్రత్యక్ష పోరు స్థాయికి చేరినట్లు అభివర్ణించారు. కొన్నాళ్ల నుంచి అమెరికా నేతృత్వంలోని ఈ సైనిక కూటమి ఇప్పటికే ఉక్రెయిన్తో యుద్ధంలో చేరిందన్నారు. ఇది రష్యా సరిహద్దుల్లోకి వస్తోందని వ్యాఖ్యానించారు.
100 బిలియన్ యూరోలు ఉక్రెయిన్లో పెట్టుబడి పెట్టాలని నాటో సెక్రటరీ జనరల్ జేన్స్ స్టోల్టెన్బర్గ్ వ్యాఖ్యల నేపథ్యంలో పెస్కోవ్ ఈవిధంగా స్పందించారు. ఇప్పటికే నాటో సభ్య దేశమైన ఫ్రాన్స్ ప్రత్యక్షంగా బలగాలను ఉక్రెయిన్కు పంపేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
కెనడాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థులు ఇకపై వారానికి 24 గంటలు మాత్రమే పని చేసుకునే వీలుంటుంది. -
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
భారత్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో లండన్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. -
కత్తితో విచక్షణారహిత దాడి..ఉలిక్కిపడిన లండన్
కత్తితో దూసుకొచ్చిన ఓ దుండగుడు ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. లండన్ (London)లో ఈ ఘటన జరిగింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.
తాజా వార్తలు (Latest News)
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..