China: అగ్నికి ఆజ్యం.. తైవాన్కు చేరుకొన్న అమెరికా కాంగ్రెస్ బృందం
తైవాన్ విషయంలో చైనాకు హెచ్చరికలు పంపేలా అమెరికా చర్యలు చేపట్టింది. తమ దేశ కాంగ్రెస్ ప్రతినిధుల బృందాన్ని అక్కడకు పంపింది.
ఇంటర్నెట్డెస్క్: తైవాన్ (Taiwan) విషయంలో చైనా(China)ను హెచ్చరించేలా చర్యలను అమెరికా చేపట్టింది. కాంగ్రెస్ సభ్యులను తైపీకి పంపింది. ఆ బృందం ఇక్కడ రెండు రోజులపాటు పర్యటించనుంది. కొత్త అధ్యక్షుడు లాయ్ చింగ్తో అమెరికా సంబంధాలను బలోపేతం చేసుకొనే దిశగా చర్చలు కూడా జరపనుంది. అంతేకాదు.. వాణిజ్యం, ప్రాంతీయ భద్రత, పెట్టుబడులు, పరస్పర ప్రయోజనాలు వంటి అంశాల పై కూడా దృష్టి పెట్టనుంది. ఈ బృందంలో ది హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు మిషెల్ మెక్కౌల్ కూడా సభ్యుడు కావడం విశేషం. ఆయన వెంట రిపబ్లికన్, డెమొక్రాట్ సభ్యలు తైవాన్కు చేరుకొన్నారు. చైనా విషయంలో ఆయన చాలా కఠినంగా మాట్లాడతారన్న పేరుంది. గతేడాది ఆయన తైవాన్ సందర్శించిన వేళ చైనా అధినేత జిన్పింగ్ను హిట్లర్తో పోల్చడం సంచలనం సృష్టించింది.
తాజాగా మెక్కౌల్ మాట్లాడుతూ ‘‘తమ పర్యటనతో తైవాన్ ప్రజలకు అండగా అమెరికా ఉందన్న సంకేతాలు చైనా కమ్యూనిస్టు పార్టీకి వెళతాయి. తైవాన్ జలసంధిలో యథాతథ స్థితి కొనసాగేలా తాము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది’’ అని పేర్కొన్నారు.
తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా (China) వ్యతిరేకిగా పేరొందిన లాయ్ చింగ్-తె విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన బాధ్యతలు చేపట్టారు. అధ్యక్ష హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లాయ్ తమను బెదిరించడం ఆపాలంటూ డ్రాగన్కు గట్టిగా చెప్పారు. దీంతో ఆగ్రహించిన బీజింగ్.. తైవాన్ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. ‘పనిష్మెంట్’ (Punishment) పేరుతో వీటిని నిర్వహించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఈస్ట్రన్ థియేటర్ కమాండ్ మిలిటరీ డ్రిల్స్ (Military Drills) నిర్వహించినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ‘‘స్వాతంత్ర్యం కోసం తైవాన్ దళాల వేర్పాటువాద చర్యలకు శిక్షగానే మేం ఈ విన్యాసాలు చేపట్టాం. మా విషయంలో బయటి శక్తుల (అమెరికాను ఉద్దేశిస్తూ) జోక్యం, రెచ్చగొట్టే చర్యలకు ఇది మా హెచ్చరిక’’ అని ఈ కమాండ్ అధికార ప్రతినిధి లి షీ వెల్లడించారు. రెండ్రోజులపాటు ఇవి జరిగాయి. దీనిపై తైవాన్ అధ్యక్షుడు స్పందిస్తూ.. చైనాతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి ప్రాంతీయ స్థిరత్వానికి కీలకమని, అంతర్జాతీయ భద్రతకూ ముఖ్యమని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్