Panchen Lama: పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
పంచన్ లామా ఆచూకీని చైనా ప్రకటించాలని అమెరికా మరోసారి డిమాండ్ చేసింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని కోరింది.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా-చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. టిబెట్ ఆధ్యాత్మిక గురువు కావాల్సిన పంచన్ లామా (Panchen Lama) ఆచూకీని బీజింగ్ ప్రకటించాలని వాషింగ్టన్ డిమాండ్ చేసింది. సురక్షితంగా ఉన్నాడా?లేడా? అన్న విషయాన్ని వెల్లడించాలని కోరింది. హిమాలయాల్లో పంచన్ లామా అదృశ్యమై 29 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యు మిల్లర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘11వ పంచన్ లామాగా ఎంపికైన బాలుడు గెధున్ చౌకీ నీమాను చైనా అపహరించి నేటికి 29 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ చిన్నారి టిబెట్ బుద్ధిజానికి చాలా కీలక వ్యక్తి. కిడ్నాప్నకు గురయ్యే నాటికి ఆ బాలుడి వయసు ఆరేళ్లు. నేటి వరకు బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. పంచన్ లామా వద్దకు ఎవరినీ వెళ్లనీయడంలేదు. ఆ స్థానంలో మరో బాలుడిని తీసుకొచ్చింది. పీఆర్సీ అధికారులు తక్షణమే గెధున్ ఆచూకీ వెల్లడించాలి. అతడి మానవ హక్కులను కాపాడాలి. తక్షణమే బేషరతుగా పంచన్ లామాను విడుదల చేయాలి’’ అని అమెరికా విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది.
కిడ్నాప్.. కుట్ర కథ ఇదీ..
1950లో చైనా టిబెట్పై ఆక్రమణ ప్రారంభించింది. 1959లో టిబెట్ తిరుగుబాటు చేసింది.. అది విఫలం కావడంతో అక్కడి బౌద్ధ మత గురువు దలైలామా భారత్కు శరణార్థిగా వచ్చారు. ఆయన ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఆయన తర్వాతి స్థానంలో ఉన్న 10వ పంచన్ లామా లోబ్సాంగ్ గ్యాల్సెన్ మాత్రం టిబెట్లోనే ఉండిపోయారు. మరోపక్క చైనా ఆగడాలను దలైలామా ప్రపంచ వ్యాప్తంగా వెల్లడించడం మొదలుపెట్టారు. దీంతో భవిష్యత్తులో దలైలామా స్థానాన్ని కబ్జా చేయాలని చైనా భావించింది. ఈ దలైలామా ఎంపికలో పంచన్ లామా పాత్ర చాలా కీలకం. 1989లో టిబెట్లోనే ఉండిపోయిన పంచన్ లామా అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయనపై విష ప్రయోగం చేశారంటారు.
దలైలామా 1995 మే 14న ఆరేళ్ల బాలుడైన గెధున్ చోకీ నీమా పేరును 11వ పంచన్ లామాగా ప్రకటించారు. దీంతో చైనా ఆగ్రహం కట్టలు తెంచుకొంది. సరిగ్గా మూడు రోజుల తర్వాత చైనా సైన్యం ఆ బాలుడిని కిడ్నాప్ చేసింది. అప్పటి నుంచి అతడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
నెటిఫ్లిక్స్ (Netflix) నిరసన సెగను ఎదుర్కొంటోంది. దానిని బాయ్కాట్ చేయాలంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు