China: అమెరికా నౌకను దక్షిణ చైనా సముద్రం నుంచి తరిమేశాం..!
దక్షిణ చైనా సముద్రంపై వాషింగ్టన్-బీజింగ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అమెరికా నౌకను తరిమేశాం అని చైనా ప్రకటించింది.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా(USA)కు చెందిన గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ యూఎస్ఎస్ మిలియూస్ను దక్షిణ చైనా సముద్రం నుంచి తరిమేసినట్లు గురువారం బీజింగ్ ప్రకటించింది. తమ ప్రాదేశిక జలాల్లోకి ఇది అక్రమంగా ప్రవేశించిందని చైనా ఆరోపించింది. ప్రశాంతంగా ఉన్న వాణిజ్య మార్గంలో శాంతి, స్థిరత్వానికి భంగం వాటిల్లేలా అమెరికా యుద్ధనౌకలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది. దీంతో అమెరికా నౌకను తమ జలాలకు దూరంగా పంపించామని పేర్కొంది. ‘‘ఇక్కడ ఉన్న మా దళాలు ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. దక్షిణ చైనా సముద్రంలో జాతీయ సార్వభౌమత్వం, శాంతి, సుస్థిరతను కాపాడటానికి అవసరమైన చర్యలు మొత్తం తీసుకొంటుంది’’ అని చైనా(China) దక్షిణ థియేటర్ కమాండ్కు చెందిన ప్రతినిధి తియాన్ జునిల్ పేర్కొన్నారు.
మరోవైపు చైనా ప్రకటన పూర్తిగా తప్పు అని అమెరికా పేర్కొంది. యూఎస్ఎస్ మిలియూస్ దక్షిణ చైనా సముద్రంలో సాధారణ గస్తీ కార్యకలాపాలను నిర్వహిస్తోందని అమెరికా పేర్కొంది. తమ నౌకను ఎవరూ అక్కడి నుంచి పంపించలేదని వాషింగ్టన్ వెల్లడించింది. భవిష్యత్తులో కూడా అమెరికా ఆ ప్రదేశంలోని అంతర్జాతీయ గగనతలం, సముద్ర జలాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తుందని ఆ దేశ నౌకాదళం పేర్కొంది.
దక్షిణ చైనా సముద్రంలో దాదాపు 7 కిలోమీటర్లు విస్తరించిన పరాసల్ ద్వీప సమూహంపై చైనాకు ఇతర దేశాలకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ ద్వీపాలపై చైనా అనధికారికంగా నియంత్రణ సాధించింది. వీటిపై పలు సైనిక స్థావరాలు, ఔట్పోస్టులను నిర్మించింది. ఇప్పటికే ఈ ద్వీప సమూహంపై తైవాన్, వియత్నాం కూడా యాజమాన్య హక్కులు ఉన్నట్లు చెబుతున్నాయి. గతేడాది జులైలో కూడా ఇదే ప్రదేశంలో అమెరికా డెస్ట్రాయర్ను తాము తరిమికొట్టామని చైనా ప్రకటించుకొంది. అప్పట్లో కూడా అమెరికా దళాలు చైనా ప్రకటన తప్పు అని కొట్టిపారేశాయి. తాము ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్ నిర్వహించామని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM