USA: అమెరికా సైనిక పరికరాల్లో చైనా వైరస్ ‘టైంబాంబ్’..!
అత్యాధునిక అమెరికా సైనిక స్థావరాల్లో ఓ చిన్న కోడ్ రూపంలో చైనా మాల్వేర్ నక్కింది. ఇది ఏ క్షణమైన అమెరికా కీలక వ్యవస్థలను అది ఛిన్నాభిన్నం చేయవచ్చని ఆ దేశ సైనిక నాయకత్వం భయపడుతోంది.
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అమెరికా (USA) సొంతం. కానీ, అటువంటి పరికరాల్లో చైనా (China) టైంబాంబు పెట్టినంత పనిచేసింది. ఓ అజ్ఞాత మాల్వేర్ను అమెరికా పరికరాల్లోకి చొప్పించినట్లు సీనియర్ సైనికాధికారులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ కాంగ్రెస్ అధికారి కూడా న్యూయార్క్టైమ్స్ వద్ద ధ్రువీకరించారు.
చైనా హ్యాకర్లు ఒక చిన్న కంప్యూటర్ కోడ్ను అమెరికా రక్షణశాఖ పరికరాల్లోకి చొప్పించినట్లు అనుమానిస్తున్నారు. ఇది సైన్యానికి చెందిన నెట్వర్క్ కంట్రోలింగ్ పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, సైనిక స్థావరాలకు నీటి సరఫరా వ్యవస్థల్లో ఇది ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో హ్యాకర్లు సంక్షోభ సమయంలో అమెరికా సైన్యానికి సరఫరాల్లో అంతరాయం కల్పించే ప్రమాదముంది. ఇప్పటికే తైవాన్ విషయంలో అమెరికా-చైనా మధ్య వివాదం తారాస్థాయికి చేరిన సమయంలో ఈ విషయం బయటకు వచ్చింది. అమెరికా ఎయిర్ఫోర్స్ బేస్ ఉన్న గువాంలో తొలిసారి మైక్రోసాఫ్ట్ అనుమానాస్పద కోడింగ్ను గుర్తించింది. ఆ తర్వాత అమెరికాలోని మరో కీలక ప్రదేశంలోని కంప్యూటర్లలో కూడా ఇది ఉన్నట్లు గ్రహించింది. వోల్ట్ టైఫూన్ అనే చైనా హ్యాకింగ్ గ్రూప్పై అనుమానాలు ఉన్నాయి.
ఉక్రెయిన్తో కాల్పుల విరమణను వ్యతిరేకించలేదు : పుతిన్
దీనిపై అమెరికా కాంగ్రెస్లోని ఓ అధికారి అమెరికా పత్రికతో మాట్లాడుతూ సైనిక పరికరాల్లో చైనా మాల్వేర్ టైంబాంబులాంటిదన్నారు. అది కీలక సమయాల్లో మిలటరీ బేస్లకు విద్యుత్తు, నీరు, కమ్యూనికేషన్లను కట్ చేయగలదు. ఫలితంగా సైనిక పని వేగం గణనీయంగా మందగిస్తుందని వివరించారు. కేవలం అమెరికాలోనే కాక.. విదేశాల్లోని ఉన్న అగ్రరాజ్య సైనిక బేస్ల్లో కూడా ఈ మాల్వేర్ ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా చైనా హ్యాకర్లు అమెరికాపై చేస్తున్న దాడుల విధానం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
గత వారం చైనాలోని అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్ ఈమెయిల్ హ్యాక్ అయింది. ఈ నెల మొదట్లో చైనా హ్యాకర్లు దాదాపు పాతిక సంస్థల మెయిల్స్ను హ్యాక్ చేసినట్లు మైక్రోసాఫ్ట్, శ్వేతసౌధం వెల్లడించింది. కొన్ని నెలల క్రితం ఈ మాల్వేర్పైనే అమెరికా సైనికాధికారులు సిచ్యూవేషన్ రూమ్లో సమావేశమయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి ఆడమ్ హోడ్జ్ మాట్లాడుతూ ‘‘అమెరికా కీలక మౌలిక వసతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా బైడెన్ కార్యవర్గం పనిచేస్తోంది. నీటి పైపులైన్లు, రైలు, వైమానిక రంగానికి చెందిన కీలక వ్యవస్థలను కాపాడేందుకు అవసరమైన విధంగా సమన్వయం చేసుకొంటోంది’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
Afghanistan: ఆఫ్గాన్లో వరద కారణంగా 68 మంది మరణించినట్లు తాలిబన్ అధికారులు తెలిపారు. -
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
స్విట్జర్లాండ్లో జరగనున్న శాంతి సదస్సుకు చైనా, గ్లోబల్ సౌత్ దేశాలు తమ ప్రతినిధులను పంపాలని జెలెన్స్కీ(Zelensky) కోరారు. -
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
రీడర్స్ డైజెస్ట్ (Reader's Digest) యూకే ఎడిషన్ను మూసివేసినట్లు ఆ సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. -
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు
చైనా పర్యటన చేపట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆ దేశాధినేత జిన్పింగ్ను ఆలింగనం చేసుకోవడంపై వైట్హౌస్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. -
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
Taiwan: తైవాన్లో పార్లమెంట్ సభ్యులు విచక్షణ మరిచి పరస్పరం దాడికి దిగారు. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. -
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని కిర్గిస్థాన్ (Kyrgyzstan) రాజధానిలో మూక హింస చెలరేగడంతో.. భారత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. -
మరింత సంపన్నులైన రిషి, అక్షతా దంపతులు
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిలు మరింత సంపన్నులు అయ్యారు. -
అధ్యక్ష పదవికి భారతీయ అమెరికన్ పోటీ!
పాలక డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా (47) మున్ముందు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సహచరులు భావిస్తున్నారు. -
2050 నాటికి పెరగనున్న ఆయుర్దాయం
ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 2050 మధ్య ఆయుర్దాయం పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళల్లో 4 ఏళ్లు పెరుగుతుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం అంచనా వేసింది. -
ఉత్తర గాజాలో హోరాహోరీ
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు హోరాహోరీ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో జబాలియా కేంద్రంగా దాడులు, ప్రతిదాడులు భారీస్థాయిలో కొనసాగుతున్నాయి. -
ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితులు 29.4 కోట్ల మంది : డబ్ల్యూహెచ్వో
అధిక రక్తపోటు కారణంగా గుండె పోటు, పక్షవాతం, క్యాన్సర్ల లాంటి సాంక్రమికేతర వ్యాధులతో పాటు మరణం, వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ సైమా వాజెడ్ చెప్పారు. -
ఖర్కీవ్ను ఆక్రమించే ప్రణాళికల్లేవ్
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటే అక్కడ తమ తాజా దాడుల లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. -
నరమేధానికి పాల్పడలేదు
గాజాలో తాము నరమేధానికి పాల్పడుతున్నామన్న ఆరోపణలను ఇజ్రాయెల్ తిరస్కరించింది. పౌరుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) తెలిపింది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి
యువకుడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. ఎట్టకేలకు ఓ సోషల్ మీడియా పోస్టు ఆధారంగా బాధితుడిని రక్షించారు. -
ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
ఉత్తరకొరియా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా ధ్రువీకరించింది. -
పర్యావరణ హితులకు యూఏఈ ‘బ్లూ రెసిడెన్సీ వీసా’లు
పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
Elon Musk: మరో 30 ఏళ్లలో అంగారక గ్రహంపై ఏర్పాటయ్యే నగరంలో మనుషులు జీవిస్తారని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు