USA: అమెరికా సైనిక పరికరాల్లో చైనా వైరస్ ‘టైంబాంబ్’..!
అత్యాధునిక అమెరికా సైనిక స్థావరాల్లో ఓ చిన్న కోడ్ రూపంలో చైనా మాల్వేర్ నక్కింది. ఇది ఏ క్షణమైన అమెరికా కీలక వ్యవస్థలను అది ఛిన్నాభిన్నం చేయవచ్చని ఆ దేశ సైనిక నాయకత్వం భయపడుతోంది.
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అమెరికా (USA) సొంతం. కానీ, అటువంటి పరికరాల్లో చైనా (China) టైంబాంబు పెట్టినంత పనిచేసింది. ఓ అజ్ఞాత మాల్వేర్ను అమెరికా పరికరాల్లోకి చొప్పించినట్లు సీనియర్ సైనికాధికారులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ కాంగ్రెస్ అధికారి కూడా న్యూయార్క్టైమ్స్ వద్ద ధ్రువీకరించారు.
చైనా హ్యాకర్లు ఒక చిన్న కంప్యూటర్ కోడ్ను అమెరికా రక్షణశాఖ పరికరాల్లోకి చొప్పించినట్లు అనుమానిస్తున్నారు. ఇది సైన్యానికి చెందిన నెట్వర్క్ కంట్రోలింగ్ పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, సైనిక స్థావరాలకు నీటి సరఫరా వ్యవస్థల్లో ఇది ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో హ్యాకర్లు సంక్షోభ సమయంలో అమెరికా సైన్యానికి సరఫరాల్లో అంతరాయం కల్పించే ప్రమాదముంది. ఇప్పటికే తైవాన్ విషయంలో అమెరికా-చైనా మధ్య వివాదం తారాస్థాయికి చేరిన సమయంలో ఈ విషయం బయటకు వచ్చింది. అమెరికా ఎయిర్ఫోర్స్ బేస్ ఉన్న గువాంలో తొలిసారి మైక్రోసాఫ్ట్ అనుమానాస్పద కోడింగ్ను గుర్తించింది. ఆ తర్వాత అమెరికాలోని మరో కీలక ప్రదేశంలోని కంప్యూటర్లలో కూడా ఇది ఉన్నట్లు గ్రహించింది. వోల్ట్ టైఫూన్ అనే చైనా హ్యాకింగ్ గ్రూప్పై అనుమానాలు ఉన్నాయి.
ఉక్రెయిన్తో కాల్పుల విరమణను వ్యతిరేకించలేదు : పుతిన్
దీనిపై అమెరికా కాంగ్రెస్లోని ఓ అధికారి అమెరికా పత్రికతో మాట్లాడుతూ సైనిక పరికరాల్లో చైనా మాల్వేర్ టైంబాంబులాంటిదన్నారు. అది కీలక సమయాల్లో మిలటరీ బేస్లకు విద్యుత్తు, నీరు, కమ్యూనికేషన్లను కట్ చేయగలదు. ఫలితంగా సైనిక పని వేగం గణనీయంగా మందగిస్తుందని వివరించారు. కేవలం అమెరికాలోనే కాక.. విదేశాల్లోని ఉన్న అగ్రరాజ్య సైనిక బేస్ల్లో కూడా ఈ మాల్వేర్ ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా చైనా హ్యాకర్లు అమెరికాపై చేస్తున్న దాడుల విధానం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
గత వారం చైనాలోని అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్ ఈమెయిల్ హ్యాక్ అయింది. ఈ నెల మొదట్లో చైనా హ్యాకర్లు దాదాపు పాతిక సంస్థల మెయిల్స్ను హ్యాక్ చేసినట్లు మైక్రోసాఫ్ట్, శ్వేతసౌధం వెల్లడించింది. కొన్ని నెలల క్రితం ఈ మాల్వేర్పైనే అమెరికా సైనికాధికారులు సిచ్యూవేషన్ రూమ్లో సమావేశమయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి ఆడమ్ హోడ్జ్ మాట్లాడుతూ ‘‘అమెరికా కీలక మౌలిక వసతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా బైడెన్ కార్యవర్గం పనిచేస్తోంది. నీటి పైపులైన్లు, రైలు, వైమానిక రంగానికి చెందిన కీలక వ్యవస్థలను కాపాడేందుకు అవసరమైన విధంగా సమన్వయం చేసుకొంటోంది’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్