USA: అమెరికా దాడిలో ఇరాన్ మద్దతున్న కీలక కమాండర్ మృతి
USA: జోర్డాన్లో తమ సైనికుల మరణానికి అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. తాజాగా తమ దాడుల్లో ఇరాన్ మద్దతున్న ఓ కీలక కమాండర్ మృతి చెందినట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది.
వాషింగ్టన్: ఇరాక్లోని (Iraq) మిలిటెంట్ల స్థావరాలపై బుధవారం జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మద్దతున్న ఓ కీలక కమాండర్ హతమైనట్లు అమెరికా (USA) సైన్యం ప్రకటించింది. మధ్యప్రాచ్యంలోని అగ్రరాజ్య స్థావరాలపై జరుగుతున్న దాడుల్లో అతడి హస్తం ఉందని తెలిపింది. జోర్డాన్లో ఇటీవల ముగ్గురు అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగానే తాము ఈ దాడి చేశామని వివరించింది.
బాగ్దాద్లో కారులో వెళ్తున్న కమాండర్ను లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్లు యూఎస్ సైనికాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనలో సామాన్య పౌరులు మరణించిన ఆనవాళ్లు లేవని తెలిపారు. కేవలం కారు మాత్రమే దగ్ధమైనట్లు చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బహుశా ఆర్9ఎక్స్ అనే హెల్ఫైర్ రకం క్షిపణిని ఉపయోగించి ఉంటారని అమెరికా మాజీ సైనికాధికారి ఒకరు తెలిపారు. పేలుడు తీవ్రత ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. 2020లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక కమాండర్ ఖాసీమ్ సులేమానీని సైతం అమెరికా ఇదే తరహాలో హతమార్చింది.
ఇరాన్ మద్దతున్న కతైబ్ హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ మరికొన్ని సంస్థలతో కలిసి మధ్యప్రాచ్యంలోని తమ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందని అమెరికా తెలిపింది. అందులో భాగంగా ఇటీవల జోర్డాన్లో దాడి జరిగినట్లు గుర్తుచేసింది. వాటికి ప్రతీకారంగా ఇరాక్, సిరియాల్లో ఇరాన్ మద్దతుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిలిటెంట్ గ్రూప్లపై దాడులు చేస్తున్నట్లు వివరించింది. ఈ క్రమంలో బుధవారం కతైబ్ హెజ్బొల్లాకు చెందిన కీలక కమాండర్ అబూ బకర్ అల్-సాదిని మట్టుబెట్టామని తెలిపింది. దీన్ని ఆ సంస్థతో పాటు ఇరాక్ ఇంటీరియర్ మంత్రిత్వశాఖ అధికారి సైతం ధ్రువీకరించారు.
స్వయం ప్రకటిత పారామిలిటరీ గ్రూప్ల సంకీర్ణం హషెద్ అల్-షాబీ.. అమెరికా చర్యలను ఖండించింది. శుక్రవారం అగ్రరాజ్యం జరిపిన దాడిలో 16 మంది తమ ఫైటర్లు మరణించినట్లు వెల్లడించింది. మరో 36 మంది గాయపడ్డారని తెలిపింది. హషెద్ అల్-షాబీని లక్ష్యంగా చేసుకోవటం నిప్పుతో చెలగాటమేనని ఆ గ్రూప్ నాయకుడు ఫలేహ్ అల్-ఫయ్యద్ హెచ్చరించారు. మరోవైపు అమెరికా (USA) దళాలు సిరియాలో చేసిన దాడుల్లో ఇరాన్కు మద్దతుగా పోరాడుతున్న 29 మంది మరణించారని ఓ మానవహక్కుల సంస్థ తెలిపింది.
ఇరాక్లోని అమెరికా (USA) బలగాల ఉపసంహరణపై జనవరి నుంచి చర్చలు మొదలయ్యాయి. కచ్చితమైన గడువును తెలియజేయాలని ఇరాక్ ప్రధాని కోరుతున్నారు. ఉగ్రసంస్థ ఐసిస్పై పోరాటంలో భాగంగా ప్రస్తుతం ఇరాక్లో 2,500, సిరియాలో 900 మంది సైనికులను అమెరికా మోహరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. -
పైలట్ను కాపాడిన కంటైనర్!
నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలట్ మనీష్ శాక్య (37) ఒక్కరే వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. -
ఇమ్రాన్ ఎంపీలు 39 మందికి అధికారిక గుర్తింపు
పాక్ సుప్రీంకోర్టు జారీచేసిన మైలురాయి లాంటి మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన 39 మంది ఎంపీలను చట్టసభ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. -
విమాన ప్రయాణికులపై లండన్ పోలీసుల కర్కశత్వం
నలుగురు విమాన ప్రయాణికులపై లండన్లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వారిని నేలకేసి చితకబాదారు. -
జపాన్లో తగ్గిపోతున్న జనాభా
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్లో వరుసగా 15వ ఏడాదీ జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. జననాల కన్నా మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే వైదొలిగా
డెమోక్రటిక్ పార్టీతోపాటు దేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసమే తాను ఎన్నికల రేసు నుంచి వైదొలగినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. -
హమాస్.. ఇజ్రాయెల్ యుద్ధం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
హమాస్తో యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
-
డబ్బులు ఊరికే రావు.. మాటల మాయలో పడ్డారో.. ఇల్లు గుల్లే
-
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
-
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
-
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
-
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు