Israel: ఇరాన్పై ప్రతిదాడికి సహకరించబోం.. ఇజ్రాయెల్కు తేల్చి చెప్పిన అమెరికా!
Israel: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను కొలిక్కి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇరాన్ దాడికి ప్రతీకారంగా తిరిగి దాడులు చేయొద్దని ఇజ్రాయెల్కు బైడెన్ చెప్పినట్లు సమాచారం.
వాషింగ్టన్: ఇరాన్-ఇజ్రాయెల్ (Iran - Israel) మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరుదేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో ఆ ప్రాంతం అట్టుడికింది. ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులను ఇజ్రాయెల్ (Israel) విజయవంతంగా తిప్పికొట్టగలిగింది. అయితే, ఇజ్రాయెల్ ఎక్కడ ప్రతిదాడికి పాల్పడుతోందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఐరాస, జీ7, భారత్ సహా ప్రపంచ దేశాలు ఇరుపక్షాలను సంయమనం పాటించాలని కోరాయి. ఈ తరుణంలో అమెరికా (USA) నుంచి కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరింత ఉద్రిక్తతను నివారించడంలో భాగంగా.. ప్రతిదాడులు చేయొద్దని ఇజ్రాయెల్కు (Israel) సూచించింది.
ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా తిప్పికొట్టిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో (Benjamin Netanyahu) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్లో మాట్లాడినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ‘‘ఎట్టిపరిస్థితుల్లోనూ ఇరాన్పై దాడికి దిగొద్దు. కాదని.. అలా చేస్తే అమెరికా నుంచి ఎలాంటి సహకారం ఉండబోదు. మెజారిటీ డ్రోన్లు, క్షిపణులను కూల్చడమే ఇజ్రాయెల్కు అతిపెద్ద విజయం. టెల్ అవీవ్కు పెద్దగా నష్టం జరగలేదు. ప్రతిదాడులకు దిగడం అనవసరం’’ అని బైడెన్ తన అభిప్రాయాన్ని నెతన్యాహుతో చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోసారి దాడి వల్ల పశ్చిమాసియాలో పరిస్థితులు చేదాటిపోయే ప్రమాదం ఉందని అమెరికా (USA) ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
80కి పైగా యూఏవీలను కూల్చాం..
ఇజ్రాయెల్పైకి ఇరాన్ (Iran) సంధించిన దాదాపు 80కి పైగా మానవ రహిత విమానాలు (UAVs), ఆరు బాలిస్టిక్ క్షిపణులను కూల్చినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఆదివారం వెల్లడించింది. ఒక క్షిపణిని లాంఛర్పై ఉండగానే ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఏడు యూఏవీలను (UAVs) ప్రయోగించడానికి ముందే హూతీల అధీనంలో ఉన్న యెమెన్ భూభాగంపై అడ్డుకున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారయ్యారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి