ఆమె బ్యాంకునే మింగేసిన ఆర్థిక అనకొండ..!
వడ్డించేవాడు మనవాడైతే అన్న సామెతను ఓ వియత్నాం మహిళ ఒంటబట్టించుకొంది. ఏకంగా బ్యాంక్నే గుప్పిట పెట్టుకొని ప్రజల సొమ్ముతో ఆగ్నేయాసియా చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడింది. ఇప్పుడు ఆమెకు కోర్టు మరణశిక్ష విధించింది.
ఇంటర్నెట్డెస్క్: ఆమె ఓ బిలియనీర్.. ఆ మహిళ తెలివితేటలు చూస్తే ఎంతటి ఆర్థిక నిపుణుడైనా కళ్లు తేలేయాల్సిందే.. ప్రజల సొమ్మును కొట్టేసేందుకు ఓ బ్యాంకుపై అక్రమ మార్గాల్లో నియంత్రణ సాధించింది. ఇంకేముంది.. తప్పుడు రుణపత్రాలను సమర్పించడం.. డబ్బు డ్రా చేసుకోవడం. ఈరకంగా ఆ దేశ జీడీపీలో ఏకంగా 3 శాతానికి సమానమైన మొత్తాన్ని స్కాం చేసి దాదాపు బ్యాంకు సొమ్ము మొత్తం మింగేసింది. కానీ, కాలం కలిసిరాక నేరం బయటపడటంతో ఇప్పుడు అక్కడి న్యాయస్థానం మరణశిక్షను విధించింది. ఆమె పేరు ట్రూంగ్ మై లాన్. వియత్నాంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు.
ట్రూంగ్ కుటుంబానికి వియత్నాంలోనే అతిపెద్ద రియల్ఎస్టేట్ సంస్థల్లో ఒకటైన వాన్ థిన్ ఫాట్ గ్రూప్ అనే సంస్థ ఉంది. వాస్తవానికి చైనా-వియత్నాం జాతీయురాలైన ట్రూంగ్ తొలుత తల్లితో కలిసి కాస్మొటిక్స్ వ్యాపారం చేసింది. కానీ అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం డోయ్మోయ్ పేరిట 1986లో సంస్కరణలు చేపట్టింది. దీంతో 1990 నుంచి ఆమె మెల్లగా భూములు, హోటళ్లు కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. అక్కడ భూములు పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. వాటిని కొనుగోలు చేయడానికి అధికారులతో మంచి సంబంధాలు కలిగిఉండాలి. ట్రూంగ్ ఈ మార్గంలో వేగంగా ఎదిగి.. 2011 నాటికి దేశంలోని సంపన్నుల్లో ఆమె ఒకరిగా నిలిచింది.
బినామీలతో బ్యాంక్ కబ్జా..
ఇక అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన ‘సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్’(ఎస్సీబీ)ను 2012 నుంచి 2022 వరకు నియంత్రించింది. వాస్తవానికి ట్రూంగ్ ఆధీనంలోని మూడు బ్యాంకులు దివాలా తీయగా.. వాటిని విలీనం చేసి ఎస్సీబీని ఏర్పాటుచేసింది. ఇక్కడే మతలబు ఉంది. ఆ దేశ చట్టాల ప్రకారం ఏ వ్యక్తికి బ్యాంక్లో 5 శాతానికి మించి వాటా ఉండకూడదు. దీంతో ట్రూంగ్ వందల కొద్దీ షెల్ కంపెనీలను ఏర్పాటుచేసుకొంది. డజన్ల కొద్దీ బినామీలను పెట్టుకొని బ్యాంక్లో 90శాతం వాటాలను వారి ద్వారా దక్కించుకొని అంతా తన గుప్పిట్లో ఉంచుకొంది.
తప్పుడు రుణ పత్రాలు సృష్టించి..
2012 నుంచి 2017 వరకు 368 రుణాలు ఎస్సీబీ నుంచి ట్రూంగ్ సూచనల మేరకు జారీ అయ్యాయి. ఆ తర్వాత 2018 నుంచి 2022 వరకు మరో 916 తప్పుడు పత్రాలతో దాదాపు 12.5 బిలియన్ డాలర్లను ఆమె దారి మళ్లించింది. బ్యాంకు ఇచ్చిన మొత్తం అప్పుల్లో ఇది 93 శాతానికి సమానం. 2019-22 మధ్యలో తన డ్రైవర్తోనే దాదాపు 4 బిలియన్ డాలర్లను విత్డ్రా చేయించింది. రెండు టన్నుల బరువున్న ఆ మొత్తం నగదును తన ఇంటి బేస్మెంట్లో భద్రపర్చింది. ఈ క్రమంలో అధికారులకు ఇష్టమొచ్చినట్లు లంచాలు ఇచ్చింది. స్టేట్బ్యాంక్ ఆఫ్ వియత్నాం చీఫ్ ఇన్స్పెక్టర్కు 5.3 మిలియన్ డాలర్లు ముట్టజెప్పింది. ఆమె అవినీతి సొమ్ము దేశ జీడీపీలో 3 శాతానికి సమానమని నిపుణులు చెబుతున్నారు.
2022లో జాతీయస్థాయిలో అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టడంతో ఈమె కుంభకోణం బయటపడింది. అదే ఏడాది అక్టోబర్లో ట్రూంగ్ సహా మరో 80 మందిని అరెస్టు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె మొత్తం 44 బిలియన్ డాలర్ల (రూ.3.6 లక్షల కోట్లు) స్కామ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. ఆగ్నేయాసియాలోనే ఇది అతిపెద్ద స్కాం. 2,700 మంది సాక్షులు, పది రాష్ట్రాల ప్రాసిక్యూటర్లు, 200 మంది లాయర్లు ఈ కేసు విచారణలో పాల్గొన్నారు. దాదాపు ఆరు టన్నుల బరువైన 104 బాక్సుల పత్రాలను న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు. 1,000 ఆస్తులను స్వాధీనం చేసుకొన్నారు. ట్రూంగ్కు ఇప్పుడు న్యాయస్థానం మరణదండన విధించింది. తీర్పు ప్రకారం ఆమె 27 బిలియన్ డాలర్లు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, అవి ఎప్పటికీ రాకపోవచ్చని ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
ఇరాన్లో కాంట్రాక్ట్పై పని చేసేందుకు వెళ్లిన మత్స్యకారులు తీవ్ర వేధింపులకు గురయ్యారు. దీంతో యజమాని పడవతో సహా వారు పారిపోయి భారత్ చేరుకొన్నారు. ప్రస్తుతం వారు కోస్టుగార్డ్ అదుపులో ఉన్నారు. -
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
ఇజ్రాయెల్-హమాస్ (Israel) మధ్య కాల్పుల విరమణ చర్చలు విఫలమైన నేపథ్యంలో రఫాపై ఐడీఎఫ్ దండయాత్ర మొదలు పెట్టినట్లు స్థానికులు వెల్లడించారు. -
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
అమెరికాలో ఏం చేసినా భారీగా ఉండాల్సిందేనేమో.. అది దుబారా వ్యయమైనా సరే. తాజాగా కొన్ని వందల అడుగుల వంతెనకు ఏకంగా రూ.91 వేల కోట్లు వెచ్చించి కాలిఫోర్నియా విమర్శల పాలవుతోంది. -
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
మూడోసారి అంతరిక్షయానానికి సిద్ధమయ్యారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams). ఈ సందర్భంగా ఆమె తన ఇష్టాలను వెల్లడించారు. -
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
Israel Hamas Conflict: ఇజ్రాయెల్పై వస్తున్న విమర్శలను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. తమని ఏ దేశమూ నిలువరించలేదని వ్యాఖ్యానించారు. -
టెక్సాస్ను ముంచెత్తుతున్న వరదలు
భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
బ్రెజిల్లో వరద బీభత్సం.. 60 మంది మృతి
బ్రెజిల్లోని రియో గ్రాండ్ డొ సుల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. -
శ్వేతసౌధం ప్రహరీ గేటును ఢీకొన్న కారు: డ్రైవర్ దుర్మరణం
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం ప్రహరీ గేటును కారు ఢీకొట్టిందని, ఈ ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
కీలక క్రాసింగ్పై హమాస్ దాడి
గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్పై ఆదివారం హమాస్ రాకెట్లతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. -
మాదక ద్రవ్యాలు ఇచ్చి నాపై లైంగిక దాడి చేశారు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఎంపీ బ్రిటానీ లాగా(37)కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ సరదాగా గడపడానికి వెళ్లిన ఆమెకు కొంతమంది దుండగులు మాదకద్రవ్యాలు అందించారు. -
చట్టబద్ధ పాలన ఉన్న దేశం మాది
కెనడా.. చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో శనివారం పేర్కొన్నారు. తమ దేశంలో బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని, పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. -
అల్-జజీరాపై నిషేధం
హమాస్కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్పై ఆదివారం ఇజ్రాయెల్ నిషేధం విధించింది. -
హమాస్తో తాజా చర్చలు విఫలం?
ఇజ్రాయెల్తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ఆదివారం ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!