ఆమె బ్యాంకునే మింగేసిన ఆర్థిక అనకొండ..!
వడ్డించేవాడు మనవాడైతే అన్న సామెతను ఓ వియత్నాం మహిళ ఒంటబట్టించుకొంది. ఏకంగా బ్యాంక్నే గుప్పిట పెట్టుకొని ప్రజల సొమ్ముతో ఆగ్నేయాసియా చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడింది. ఇప్పుడు ఆమెకు కోర్టు మరణశిక్ష విధించింది.
ఇంటర్నెట్డెస్క్: ఆమె ఓ బిలియనీర్.. ఆ మహిళ తెలివితేటలు చూస్తే ఎంతటి ఆర్థిక నిపుణుడైనా కళ్లు తేలేయాల్సిందే.. ప్రజల సొమ్మును కొట్టేసేందుకు ఓ బ్యాంకుపై అక్రమ మార్గాల్లో నియంత్రణ సాధించింది. ఇంకేముంది.. తప్పుడు రుణపత్రాలను సమర్పించడం.. డబ్బు డ్రా చేసుకోవడం. ఈరకంగా ఆ దేశ జీడీపీలో ఏకంగా 3 శాతానికి సమానమైన మొత్తాన్ని స్కాం చేసి దాదాపు బ్యాంకు సొమ్ము మొత్తం మింగేసింది. కానీ, కాలం కలిసిరాక నేరం బయటపడటంతో ఇప్పుడు అక్కడి న్యాయస్థానం మరణశిక్షను విధించింది. ఆమె పేరు ట్రూంగ్ మై లాన్. వియత్నాంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు.
ట్రూంగ్ కుటుంబానికి వియత్నాంలోనే అతిపెద్ద రియల్ఎస్టేట్ సంస్థల్లో ఒకటైన వాన్ థిన్ ఫాట్ గ్రూప్ అనే సంస్థ ఉంది. వాస్తవానికి చైనా-వియత్నాం జాతీయురాలైన ట్రూంగ్ తొలుత తల్లితో కలిసి కాస్మొటిక్స్ వ్యాపారం చేసింది. కానీ అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం డోయ్మోయ్ పేరిట 1986లో సంస్కరణలు చేపట్టింది. దీంతో 1990 నుంచి ఆమె మెల్లగా భూములు, హోటళ్లు కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. అక్కడ భూములు పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. వాటిని కొనుగోలు చేయడానికి అధికారులతో మంచి సంబంధాలు కలిగిఉండాలి. ట్రూంగ్ ఈ మార్గంలో వేగంగా ఎదిగి.. 2011 నాటికి దేశంలోని సంపన్నుల్లో ఆమె ఒకరిగా నిలిచింది.
బినామీలతో బ్యాంక్ కబ్జా..
ఇక అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన ‘సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్’(ఎస్సీబీ)ను 2012 నుంచి 2022 వరకు నియంత్రించింది. వాస్తవానికి ట్రూంగ్ ఆధీనంలోని మూడు బ్యాంకులు దివాలా తీయగా.. వాటిని విలీనం చేసి ఎస్సీబీని ఏర్పాటుచేసింది. ఇక్కడే మతలబు ఉంది. ఆ దేశ చట్టాల ప్రకారం ఏ వ్యక్తికి బ్యాంక్లో 5 శాతానికి మించి వాటా ఉండకూడదు. దీంతో ట్రూంగ్ వందల కొద్దీ షెల్ కంపెనీలను ఏర్పాటుచేసుకొంది. డజన్ల కొద్దీ బినామీలను పెట్టుకొని బ్యాంక్లో 90శాతం వాటాలను వారి ద్వారా దక్కించుకొని అంతా తన గుప్పిట్లో ఉంచుకొంది.
తప్పుడు రుణ పత్రాలు సృష్టించి..
2012 నుంచి 2017 వరకు 368 రుణాలు ఎస్సీబీ నుంచి ట్రూంగ్ సూచనల మేరకు జారీ అయ్యాయి. ఆ తర్వాత 2018 నుంచి 2022 వరకు మరో 916 తప్పుడు పత్రాలతో దాదాపు 12.5 బిలియన్ డాలర్లను ఆమె దారి మళ్లించింది. బ్యాంకు ఇచ్చిన మొత్తం అప్పుల్లో ఇది 93 శాతానికి సమానం. 2019-22 మధ్యలో తన డ్రైవర్తోనే దాదాపు 4 బిలియన్ డాలర్లను విత్డ్రా చేయించింది. రెండు టన్నుల బరువున్న ఆ మొత్తం నగదును తన ఇంటి బేస్మెంట్లో భద్రపర్చింది. ఈ క్రమంలో అధికారులకు ఇష్టమొచ్చినట్లు లంచాలు ఇచ్చింది. స్టేట్బ్యాంక్ ఆఫ్ వియత్నాం చీఫ్ ఇన్స్పెక్టర్కు 5.3 మిలియన్ డాలర్లు ముట్టజెప్పింది. ఆమె అవినీతి సొమ్ము దేశ జీడీపీలో 3 శాతానికి సమానమని నిపుణులు చెబుతున్నారు.
2022లో జాతీయస్థాయిలో అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టడంతో ఈమె కుంభకోణం బయటపడింది. అదే ఏడాది అక్టోబర్లో ట్రూంగ్ సహా మరో 80 మందిని అరెస్టు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె మొత్తం 44 బిలియన్ డాలర్ల (రూ.3.6 లక్షల కోట్లు) స్కామ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. ఆగ్నేయాసియాలోనే ఇది అతిపెద్ద స్కాం. 2,700 మంది సాక్షులు, పది రాష్ట్రాల ప్రాసిక్యూటర్లు, 200 మంది లాయర్లు ఈ కేసు విచారణలో పాల్గొన్నారు. దాదాపు ఆరు టన్నుల బరువైన 104 బాక్సుల పత్రాలను న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు. 1,000 ఆస్తులను స్వాధీనం చేసుకొన్నారు. ట్రూంగ్కు ఇప్పుడు న్యాయస్థానం మరణదండన విధించింది. తీర్పు ప్రకారం ఆమె 27 బిలియన్ డాలర్లు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, అవి ఎప్పటికీ రాకపోవచ్చని ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
జపాన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే ఓ సంప్రదాయం గురించిన విషయాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. -
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
నెటిఫ్లిక్స్ (Netflix) నిరసన సెగను ఎదుర్కొంటోంది. దానిని బాయ్కాట్ చేయాలంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు