US Presidential Debate: వివేక్ ఆరోపణలు.. మౌనంగా ఉండిపోయిన నిక్కీ హేలీ
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లిన్ పార్టీ తరపున పోటీ పడుతున్న అభ్యర్థుల మధ్య నాలుగో విడత చర్చా కార్యక్రమం యూనివర్శిటీ ఆఫ్ అలబామాలో జరిగింది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం (Republican Presidential Debate) కోసం జరిగిన నాలుగో విడత చర్చా కార్యక్రమం వాడీవేడిగా జరిగింది. దీనిలో నలుగురు అభ్యర్థులూ ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ చర్చలో భారత సంతతి వ్యక్తులు నిక్కీ హేలీ ( Nikki Haley), వివేక్ రామస్వామి (Vivek Ramaswamy)తోపాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డి శాంటిస్ (Ron DeSantis), న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ (Chris Christie) పాల్గొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సారి కూడా చర్చకు డుమ్మా కొట్టి, నిధుల సమీకరణ కోసం ఫ్లోరిడాలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు.
యూనివర్శిటి ఆఫ్ అలబామాలోని మూడీ మ్యూజిక్ హాలులో జరిగిన చర్చలో నిక్కీ హేలీనే లక్ష్యంగా వివేక్ రామస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె అవినీతిపరురాలని, మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ సంస్థల నుంచి నిధులు తీసుకుని ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. డెమోక్రటిక్ పార్టీకి విరాళాలు ఇచ్చే రీడ్ హోఫ్మన్ (Reid Hoffman) అనే బిలియనీర్ నుంచి నిక్కీ, ఆమె కుటుంబం 2.5 లక్షల డాలర్లు లబ్ధి పొందారని వివేక్ ఆరోపించారు. గత మూడు చర్చా కార్యక్రమాల్లో వివేక్కు దీటుగా బదులిచ్చిన నిక్కీ .. ఈ విడత చర్చలో చాలాసేపు మౌనంగానే ఉండిపోయారు. ఒక దశలో ఆమెకు మద్దతుగా మరో అభ్యర్థి క్రిస్ క్రిస్టీ వివేక్పై విరుచుకుపడ్డారు.
అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురి మృతి
వివేక్ ఆడంబరం కోసం మాట్లాడే వ్యక్తని, ఉక్రెయిన్పై రెండు నాల్కల ధోరణి ప్రదర్శించారని క్రిస్ విమర్శించారు. ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించిన భూభాగాన్ని వదిలేయడమే యుద్ధానికి పరిష్కారమని వివేక్ గతంలో చెప్పినట్లు ఆరోపించారు. వీటిని అక్కడే ఉన్న వివేక్ ఖండించారు. తాను ఎక్కడా అలా చెప్పలేదని అన్నారు. గత మూడు డిబేట్లలో వివేక్-నిక్కీ మధ్య వాడీ వేడి చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దఫా చర్చలో నిక్కీ సహా క్రిస్, రాన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మరోవైపు ట్రంప్ చర్చలో పాల్గొనకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వారిలో మిగిలిన నలుగురు తనకు సమఉజ్జీలు కాదని ట్రంప్ భావిస్తున్నారని, అందుకే ఆయన చర్చలో పాల్గొనడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 60 శాతం రిపబ్లికన్ ఓటర్ల మద్దతుతో డొనాల్డ్ ట్రంప్ ఈ రేసులో అగ్రగామిగా నిలుస్తున్నారు. అధ్యక్షుడిగా పార్టీ నామినేషన్ తనకే లభిస్తుందంటూ ఆయన మొదటి నుంచీ అభ్యర్థుల చర్చల్లో పాల్గొనడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
Ukraine-Russia Conflict: ఉక్రెయిన్పై యుద్ధంలో పైచేయి సాధించడం కోసం రష్యా రసాయన ఆయుధాలు వాడుతోందని అమెరికా ఆరోపించింది. -
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
Biden: విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్కు భయమంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. -
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు