Flight Turbulence: బస్సుల వలే విమానాల్లో ఆ కుదుపులెందుకు..!
విమానాలకు కనిపించని ఓ శత్రువు గాల్లో పొంచి ఉంటుంది. ఒక్కసారి దాని సమీపంలోకి లోహవిహంగం చేరితే తీవ్రమైన కుదుపులతో అల్లకల్లోలం చేస్తుంది. ఇటీవల సింగపుర్ ఎయిర్లైన్స్ విమానం ఇలాంటి పరిస్థితిలోనే చిక్కుకొంది. అదేంటో చూద్దాం..
ఇంటర్నెట్డెస్క్: ఎలాంటి కుదుపులు లేకుండా ప్రయాణిస్తుంటే.. గాల్లో తేలినట్లుందని అంటుంటాం. కానీ, గతుకుల రోడ్లకు మించి కుదుపులు గాల్లోనే సంభవిస్తాయన్న విషయం తెలుసుకోవాలి. వీటి దెబ్బకు ఒక్కోసారి ప్రయాణికుల ప్రాణాలు కూడా పోతుంటాయి. తాజాగా సింగపుర్ ఎయిర్లైన్స్ విమానం ఇలానే కుదుపులకు లోనై ఓ ప్రయాణికుడు మరణించగా.. 30 మందికి పైగా గాయపడటం సంచలనం సృష్టిస్తోంది. బాధితుల్లో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అసలు విమానాలు గాల్లో ఉన్నవేళ ఎందుకు ఇలా జరుగుతుందనే చర్చ మొదలైంది.
అసలేమిటీ ఎయిర్ టర్బులెన్స్..
అస్థిరంగా ఉన్న గాలి దిశ, వేగంలో గణనీయమైన మార్పు చోటు చేసుకోవడాన్నే ఎయిర్ టర్బులెన్స్ అంటారు. ఇది విమానాన్ని నెట్టివేయడం లేదా కిందకు తోసేయడం చేయగలదు. చాలా వరకు ఈ పరిస్థితి మేఘాల పైన లేదా కింద ఉన్న గాలి కారణంగా చోటు చేసుకొంటుంది. వీటిల్లో చాలా వరకు స్వల్పంగానే ఉంటాయి. కానీ, క్యుములోనింబస్ తుపాను మేఘాల సమీపంలో విమానం ప్రయాణించే సమయంలో ఇవి తీవ్రంగా ఉంటాయి.
విమానాలకు ముఖ్యంగా ‘క్లియర్ ఎయిర్’ టర్బులెన్స్ అనే పరిస్థితి భయానక అనుభవాలను మిగులుస్తుంది. వాస్తవానికి వీటిని గుర్తించడం చాలా కష్టం. ఆ ప్రాంతంలో మేఘాలు కనిపించవు. ఆకాశంలో సన్నటి మార్గంలో వేగంగా గాలి ప్రయాణించే జెట్ స్ట్రీమ్ల వద్ద ఈ పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి ఉపరితలానికి 40 వేల నుంచి 60 వేల అడుగుల ఎత్తులో చోటు చేసుకొంటాయి. సాధారణ మార్గంలో కంటే ఈ జెట్ స్ట్రీమ్లు ఉన్న చోట్ల గాలి వేగం కనీసం 100 మైళ్లు అధికంగా ఉంటుంది. వీటి కారణంగా చుట్టుపక్కల గాలి అస్థిరమైపోతుంది. విమానాలు ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో తీవ్రమైన కుదుపులకు లోనవుతాయి. ఒక్కో సందర్భంలో ప్రయాణికులను క్యాబిన్లో విసిరికొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. సింగపుర్ ఎయిర్ లైన్స్ విమానం ఇటువంటి పరిస్థితిలోనే చిక్కుకొంది. 35వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఐరోపా నుంచి ఉత్తర అమెరికా వైపు ప్రయాణించే మార్గాల్లో ఇటువంటి పరిస్థితులు తరచూ కనిపిస్తుంటాయి. వీటిని తప్పించుకొని విమానాలు ప్రయాణించడం దాదాపు అసాధ్యం.
ఇవి ప్రమాదకరమేనా..
సాధారణంగా విమానాలను దారుణమైన టర్బులెన్స్లను తట్టుకొనేలా నిర్మిస్తారు. అత్యంత అరుదుగా మాత్రమే అవి విమానాలను ధ్వంసం చేయగలుగుతాయి. ఈ నేపథ్యంలో పైలట్లు సాధ్యమైనంత వరకు గాలి అస్థిర ప్రవాహాల్లోకి వెళ్లకుండా చూసుకొంటారు. అవసరమైతే విమానాన్ని నెమ్మదింపజేయడం వంటివి చేస్తుంటారు. వీటిల్లో చిక్కుకున్న వేళ ప్రయాణికులను సీటు బెల్టు పెట్టుకోవాలని అప్రమత్తం చేస్తుంటారు. వీటిని పాటించని వారు క్యాబిన్లో ఏదో మూలకు విసిరేసినట్లు పడిపోయే ప్రమాదం ఉంది. కాకపోతే ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా చోటుచేసుకొంటుంది. అమెరికాలోని విమానయాన సంస్థలు 2009-2022 మధ్యలో ఇలాంటి ఘటనలు కేవలం 163 మాత్రమే చూసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ వాతావరణ మార్పుల కారణంగా గత పదేళ్లలో ఈ పరిస్థితులు 55శాతం పెరిగినట్లు తెలుస్తోంది.
- అమెరికాలో ఎఫ్ఏఏ, వైమానిక రంగ వాతావరణ విభాగం టర్బులెన్స్ పరిస్థితులకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి ముందుగానే పైలట్లను హెచ్చరిస్తాయి. దీనిని బట్టి ప్రయాణ మార్గాలను ప్లాన్ చేసుకొంటారు.
- ఈ టర్బులెన్స్ల కారణంగా విమానాల్లో విడిభాగాల అరుగుదల, దెబ్బతినడం వంటివి అధికంగా చోటు చేసుకొంటాయి. ఒక్క అమెరికాలోని వైమానిక రంగం ఏటా 150-200 మిలియన్ డాలర్లను వీటి కారణంగా వెచ్చించాల్సి వస్తోంది.
- విమానాల్లో సీటు బెల్టులను ధరించని వారే ఈ టర్బులెన్స్ ప్రమాదాల్లో గాయపడుతున్నట్లు అమెరికాలోని నేషనల్ ట్రాన్స్పోర్టు సేఫ్టీ బోర్డ్ చెబుతోంది.
- టర్బలి అనే వెబ్సైట్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1,50,000 వైమానిక మార్గాలను అధ్యయనం చేసింది. శాంటియాగో, చిలీ, విరు(బొలివియా) మధ్య ప్రయాణించే మార్గంలో టర్బులెన్స్లు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించింది.
- ఇక కజకిస్థాన్లోని అల్మాటి నుంచి కిర్గిస్థాన్లోని బిష్కెక్ మధ్య గగనతల మార్గం రెండో స్థానంలో ఉంది. నాష్వెల్లి(టెన్నిసి) - దుర్హమ్ (ఉత్తర కరోలినా) మార్గం తృతీయ స్థానంలో నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
Kamala Harris: జూమ్ కాల్లో కమలాహారిస్ రికార్డు సృష్టించారు. ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ కోసం చేపట్టిన ఈ కాల్లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు. -
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇథియోపియాలో మట్టిచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. -
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
Barack And Michelle Obama: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలాహారిస్కు ఒబామా దంపతులు మద్దతు తెలిపారు. -
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. దేశ విదేశాంగ విధానం, జాతీయ భద్రతను అధ్యక్షుడు ముందుకుతీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. -
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్