Flight Turbulence: బస్సుల వలే విమానాల్లో ఆ కుదుపులెందుకు..!
విమానాలకు కనిపించని ఓ శత్రువు గాల్లో పొంచి ఉంటుంది. ఒక్కసారి దాని సమీపంలోకి లోహవిహంగం చేరితే తీవ్రమైన కుదుపులతో అల్లకల్లోలం చేస్తుంది. ఇటీవల సింగపుర్ ఎయిర్లైన్స్ విమానం ఇలాంటి పరిస్థితిలోనే చిక్కుకొంది. అదేంటో చూద్దాం..
ఇంటర్నెట్డెస్క్: ఎలాంటి కుదుపులు లేకుండా ప్రయాణిస్తుంటే.. గాల్లో తేలినట్లుందని అంటుంటాం. కానీ, గతుకుల రోడ్లకు మించి కుదుపులు గాల్లోనే సంభవిస్తాయన్న విషయం తెలుసుకోవాలి. వీటి దెబ్బకు ఒక్కోసారి ప్రయాణికుల ప్రాణాలు కూడా పోతుంటాయి. తాజాగా సింగపుర్ ఎయిర్లైన్స్ విమానం ఇలానే కుదుపులకు లోనై ఓ ప్రయాణికుడు మరణించగా.. 30 మందికి పైగా గాయపడటం సంచలనం సృష్టిస్తోంది. బాధితుల్లో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అసలు విమానాలు గాల్లో ఉన్నవేళ ఎందుకు ఇలా జరుగుతుందనే చర్చ మొదలైంది.
అసలేమిటీ ఎయిర్ టర్బులెన్స్..
అస్థిరంగా ఉన్న గాలి దిశ, వేగంలో గణనీయమైన మార్పు చోటు చేసుకోవడాన్నే ఎయిర్ టర్బులెన్స్ అంటారు. ఇది విమానాన్ని నెట్టివేయడం లేదా కిందకు తోసేయడం చేయగలదు. చాలా వరకు ఈ పరిస్థితి మేఘాల పైన లేదా కింద ఉన్న గాలి కారణంగా చోటు చేసుకొంటుంది. వీటిల్లో చాలా వరకు స్వల్పంగానే ఉంటాయి. కానీ, క్యుములోనింబస్ తుపాను మేఘాల సమీపంలో విమానం ప్రయాణించే సమయంలో ఇవి తీవ్రంగా ఉంటాయి.
విమానాలకు ముఖ్యంగా ‘క్లియర్ ఎయిర్’ టర్బులెన్స్ అనే పరిస్థితి భయానక అనుభవాలను మిగులుస్తుంది. వాస్తవానికి వీటిని గుర్తించడం చాలా కష్టం. ఆ ప్రాంతంలో మేఘాలు కనిపించవు. ఆకాశంలో సన్నటి మార్గంలో వేగంగా గాలి ప్రయాణించే జెట్ స్ట్రీమ్ల వద్ద ఈ పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి ఉపరితలానికి 40 వేల నుంచి 60 వేల అడుగుల ఎత్తులో చోటు చేసుకొంటాయి. సాధారణ మార్గంలో కంటే ఈ జెట్ స్ట్రీమ్లు ఉన్న చోట్ల గాలి వేగం కనీసం 100 మైళ్లు అధికంగా ఉంటుంది. వీటి కారణంగా చుట్టుపక్కల గాలి అస్థిరమైపోతుంది. విమానాలు ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో తీవ్రమైన కుదుపులకు లోనవుతాయి. ఒక్కో సందర్భంలో ప్రయాణికులను క్యాబిన్లో విసిరికొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. సింగపుర్ ఎయిర్ లైన్స్ విమానం ఇటువంటి పరిస్థితిలోనే చిక్కుకొంది. 35వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఐరోపా నుంచి ఉత్తర అమెరికా వైపు ప్రయాణించే మార్గాల్లో ఇటువంటి పరిస్థితులు తరచూ కనిపిస్తుంటాయి. వీటిని తప్పించుకొని విమానాలు ప్రయాణించడం దాదాపు అసాధ్యం.
ఇవి ప్రమాదకరమేనా..
సాధారణంగా విమానాలను దారుణమైన టర్బులెన్స్లను తట్టుకొనేలా నిర్మిస్తారు. అత్యంత అరుదుగా మాత్రమే అవి విమానాలను ధ్వంసం చేయగలుగుతాయి. ఈ నేపథ్యంలో పైలట్లు సాధ్యమైనంత వరకు గాలి అస్థిర ప్రవాహాల్లోకి వెళ్లకుండా చూసుకొంటారు. అవసరమైతే విమానాన్ని నెమ్మదింపజేయడం వంటివి చేస్తుంటారు. వీటిల్లో చిక్కుకున్న వేళ ప్రయాణికులను సీటు బెల్టు పెట్టుకోవాలని అప్రమత్తం చేస్తుంటారు. వీటిని పాటించని వారు క్యాబిన్లో ఏదో మూలకు విసిరేసినట్లు పడిపోయే ప్రమాదం ఉంది. కాకపోతే ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా చోటుచేసుకొంటుంది. అమెరికాలోని విమానయాన సంస్థలు 2009-2022 మధ్యలో ఇలాంటి ఘటనలు కేవలం 163 మాత్రమే చూసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ వాతావరణ మార్పుల కారణంగా గత పదేళ్లలో ఈ పరిస్థితులు 55శాతం పెరిగినట్లు తెలుస్తోంది.
- అమెరికాలో ఎఫ్ఏఏ, వైమానిక రంగ వాతావరణ విభాగం టర్బులెన్స్ పరిస్థితులకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి ముందుగానే పైలట్లను హెచ్చరిస్తాయి. దీనిని బట్టి ప్రయాణ మార్గాలను ప్లాన్ చేసుకొంటారు.
- ఈ టర్బులెన్స్ల కారణంగా విమానాల్లో విడిభాగాల అరుగుదల, దెబ్బతినడం వంటివి అధికంగా చోటు చేసుకొంటాయి. ఒక్క అమెరికాలోని వైమానిక రంగం ఏటా 150-200 మిలియన్ డాలర్లను వీటి కారణంగా వెచ్చించాల్సి వస్తోంది.
- విమానాల్లో సీటు బెల్టులను ధరించని వారే ఈ టర్బులెన్స్ ప్రమాదాల్లో గాయపడుతున్నట్లు అమెరికాలోని నేషనల్ ట్రాన్స్పోర్టు సేఫ్టీ బోర్డ్ చెబుతోంది.
- టర్బలి అనే వెబ్సైట్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1,50,000 వైమానిక మార్గాలను అధ్యయనం చేసింది. శాంటియాగో, చిలీ, విరు(బొలివియా) మధ్య ప్రయాణించే మార్గంలో టర్బులెన్స్లు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించింది.
- ఇక కజకిస్థాన్లోని అల్మాటి నుంచి కిర్గిస్థాన్లోని బిష్కెక్ మధ్య గగనతల మార్గం రెండో స్థానంలో ఉంది. నాష్వెల్లి(టెన్నిసి) - దుర్హమ్ (ఉత్తర కరోలినా) మార్గం తృతీయ స్థానంలో నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ ‘మెలోడీ’ మూమెంట్.. మోదీ, మెలోనీ మరో సెల్ఫీ వైరల్
Modi-Meloni Selfie: జీ7 సదస్సులో మరోసారి ‘మెలోడీ’ మూమెంట్ కన్పించింది. భారత్, ఇటలీ ప్రధానులు మోదీ, మెలోనీ మరోసారి సెల్ఫీ దిగారు. -
పుతిన్ నోట సంధి మాట
ఉక్రెయిన్తో సంధికి సిద్ధమేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మాస్కో సేనలు ఆక్రమించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దళాలు వెళ్లిపోవాలని, నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలంటూ కొన్ని షరతులు విధించారు. -
సాంకేతికతలపై గుత్తాధిపత్యం వద్దు
సాంకేతిక రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించాలంటూ అంతర్జాతీయ సమాజానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
ద్వైపాక్షిక భేటీలతో మోదీ బిజీబిజీ
జీ7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వరుస ద్వైపాక్షిక భేటీలతో తీరిక లేకుండా గడిపారు. -
నేతలంతా ఒకవైపు.. బైడెన్ మరోవైపు!
జీ7 సదస్సు వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహారశైలి చర్చనీయాంశమైంది. సదస్సుకు వచ్చిన నేతలు బృందచిత్రం కోసం నిలబడి ఉండగా.. వారంతా ఉన్నవైపు కాకుండా బైడెన్ మరోవైపు తిరిగి, ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా ముందుకు వెళ్లారు. -
ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కసరత్తు
భారత్లో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలను ప్రపంచంలో మరే దేశంతో పోల్చినా అతిపెద్ద ఎన్నికలుగా అమెరికా ప్రశంసించింది. ‘‘భారత్లో జరిగిన ఎన్నికలను మేము ఆస్వాదించాం. -
జాబిల్లి పరిశోధన కేంద్రం నిర్మాణంలో చైనాతో రష్యా భాగస్వామ్యం
అంతర్జాతీయ జాబిల్లి పరిశోధన కేంద్రాన్ని చైనా, రష్యా సంయుక్తంగా నిర్మించేందుకు తలపెట్టిన ప్రణాళికకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆమోదం తెలిపారు. -
ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధం చెల్లదు
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తుపాకీ ఉపకరణాల్లో ఒకటైన బంప్స్టాక్స్పై విధించిన నిషేధాన్ని శుక్రవారం అమెరికా సుప్రీంకోర్టు ఎత్తివేసింది. -
హజ్ యాత్ర ప్రారంభం
ఎడారి ఉష్ణోగ్రతల ఉక్కపోత నడుమ శుక్రవారం ముస్లింల వార్షిక హజ్ యాత్ర కార్యక్రమం ప్రారంభమైంది. ఇస్లాం మతస్థులు అతి పవిత్రమైనదిగా భావించే దివ్య మసీదులోని కాబా చుట్టూ ప్రదక్షిణలతో ఈ యాత్ర మొదలైంది. -
ఐరోపాపై వలసల ఒత్తిడి తగ్గించాలి
ఐరోపా దేశాలపై వలసల ఒత్తిడి తగ్గించేందుకు మెరుగైన మార్గాలు అన్వేషించాలని జీ7 దేశాలు తీర్మానించాయి. -
పెరుగుతున్న రోజు నిడివి
భూగోళ కేంద్ర భాగ (కోర్) భ్రమణ వేగం తగ్గుతోందని అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు స్పష్టం చేశారు. -
దీర్ఘకాల నొప్పికి కొత్త చికిత్సా విధానం
పెద్దలను దీర్ఘకాలంగా పీడించే నొప్పిని తగ్గించడానికి సరికొత్త మానసిక చికిత్సా విధానం రూపొందింది. 2000 సంవత్సరం నుంచి ప్రయోగ దశలో ఉన్న ఈ విధానాన్ని భావోద్వేగ స్పృహ, అభివ్యక్తి చికిత్స (ఈఏఇటి)గా వ్యవహరిస్తున్నారు. -
జీ7 వేదికగా.. కృత్రిమ మేధపై పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు
కృత్రిమ మేధ వంటి శక్తిమంతమైన సాంకేతికత.. మానవ సంబంధాలను యాంత్రికంగా మార్చేసే ప్రమాదం ఉందని పోప్ ఫ్రాన్సిస్ హెచ్చరించారు. -
ఇటుక బట్టీలో పెట్టి.. రూ.584 కోట్ల విలువైన డ్రగ్స్ కాల్చేసి!
కంబోడియా దేశం రూ.584 కోట్ల విలువైన అక్రమ డ్రగ్స్, సంబంధిత పదార్థాలను దహనం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పుంగనూరులో మాజీమంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ
-
అనుచిత వ్యాఖ్యలు చేసి.. యూటర్న్ తీసుకున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త
-
వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది: హోంమంత్రి అనిత
-
మళ్లీ ‘మెలోడీ’ మూమెంట్.. మోదీ, మెలోనీ మరో సెల్ఫీ వైరల్
-
అనంతలో దుండగుల దుశ్చర్య.. ఓటమి అక్కసుతో తాగునీటి ట్యాంకులో పురుగుల మందు
-
తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ సేవలు అభినందనీయం: డిప్యూటీ సీఎం పవన్