Gaza: గాజా నరకప్రాయంగా మారింది.. WHO చీఫ్ భావోద్వేగం!
Gaza: గాజాలో ప్రస్తుత పరిస్థితులను గుర్తుచేసుకుంటూ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ భావోద్వేగానికి గురయ్యారు.
జెనీవా: ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అన్నారు. గాజాలో ప్రస్తుత పరిస్థితులు నరకప్రాయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ పాలక మండలి సమావేశంలో గురువారం ఆయన అన్నారు.
ఇథియోపియాకు చెందిన టెడ్రోస్ (Tedros Adhanom Ghebreyesus) చిన్నతనంలో స్వయంగా యుద్ధ పరిణామాలను చవిచూశారు. 1998-2000 మధ్య ఎరిత్రియాతో సరిహద్దు యుద్ధ సమయంలో ఆయన పిల్లలూ బంకర్లలో తలదాచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గాజాలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఘర్షణలు, ద్వేషం, ఆవేదన, విధ్వంసం తప్ప.. యుద్ధం ఎలాంటి పరిష్కారం ఇవ్వదని నా సొంత అనుభవంతో చెబుతున్నా. అందుకే శాంతియుతంగా, రాజకీయంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకుందాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే గాజాలో ఆకలి, వ్యాధులతో మరింత మంది చనిపోతారు’’ అని టెడ్రోస్ అన్నారు.
టెడ్రోస్ వ్యాఖ్యలు నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని ఐరాసలోని ఇజ్రాయెల్ (Israel) రాయబారి మీరవ్ ఐలాన్ షహర్ దుయ్యబట్టారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి చేసినప్పటి నుంచి డబ్ల్యూహెచ్ఓ వైఖరి భిన్నంగా ఉందని విమర్శించారు. ఇజ్రాయెల్లో సామాన్యులపై దాడి, మహిళలపై అత్యాచారాలు, బందీలు, ఆస్పత్రులను మిలిటరీ కేంద్రాలుగా మార్చుకోవటం వంటి వాటిని అసలు ప్రస్తావించడం లేదని అన్నారు. హమాస్తో ‘‘కుమ్మక్కవ్వడం’’ వల్లే WHOకు ఇవేవీ కనిపించడం లేదని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.