Hamas: వాళ్లని గాజా నుంచి తరలించడం ఉరిశిక్షతో సమానం: ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం చేసిన హెచ్చరికలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండించింది. రోగులను తరలించడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
జెనీవా: తమ దేశంపై దాడి చేసిన హమాస్ (Hamas) ఉగ్రవాదుల్ని అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ (Israel) సైన్యం గాజాలో అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే అక్కడ నివసిస్తున్న పాలస్తీనా ప్రజల్ని దక్షిణ గాజాకి తరలి వెళ్లాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. కాగా.. ఇజ్రాయెల్ హెచ్చరికలను పట్టించుకోవద్దని స్థానికులకి హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా సూచించారు. ఉన్న ప్రాంతాన్ని వదిలి ఎక్కడి వెళ్లొద్దని కోరారు. మరోవైపు గాజాలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతోన్న రోగుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆందోళన వ్యక్తం చెసింది. గాజాను ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్ హెచ్చరికల్ని తీవ్రంగా ఖండించింది.
‘‘రోగులు, వైద్య సిబ్బందిని బలవంతంగా తరలించడం అనేది మానవత్వాన్ని, ప్రజారోగ్య వ్యవస్థ మరింత దిగజార్చుతుంది. ఇప్పటికే దక్షిణా గాజా ఆస్పత్రులు రోగులతో నిండి ఉన్నాయి. ఇప్పుడు మరో 2 వేల మందిని అక్కడికి తరలిస్తే పరిస్థితులు దారుణంగా తయారవుతాయి. అది వాళ్లకి ఉరిశిక్షతో సమానం. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవాళ్లు, లైఫ్ సపోర్ట్, డయాలసిస్ అవసరమయ్యే వాళ్లు, ఆరోగ్య సమస్యలున్న గర్భిణీలకు చికిత్స ఆలస్యమై ప్రాణాల మీదకొస్తుంది’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఉత్తర గాజాలో ఉన్న రోగులను అక్కడే వదిలేసి వెళ్లలేక, తరలించి వారి ప్రాణాలను ప్రమాదంలో నెట్టలేక వైద్య సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారని డబ్ల్యూహెచ్వో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
భారత్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో లండన్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. -
కత్తితో విచక్షణారహిత దాడి..ఉలిక్కిపడిన లండన్
కత్తితో దూసుకొచ్చిన ఓ దుండగుడు ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. లండన్ (London)లో ఈ ఘటన జరిగింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.
తాజా వార్తలు (Latest News)
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..
-
చివరి అరగంటలో అమ్మేశారు.. సూచీలకు నష్టాలు