Ebrahim Raisi: ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
ఇరాన్ అధ్యక్షుడు రైసీ చాలా వేగంగా స్థానిక రాజకీయ వర్గాల్లో ఎదిగారు. ప్రాసిక్యూటర్గా జీవితం మొదలుపెట్టిన ఆయన అధ్యక్ష స్థానానికి చేరుకొన్నారు.
ఇంటర్నెట్డెస్క్: ఇరాన్ (Iran) అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికే హమాస్ యుద్ధం, సిరియా సంక్షోభం, అణు ఒప్పందం, ఎర్ర సముద్రంలో దాడులు ఇలా పలు కీలక అంశాలు ఏకకాలంలో తెరపైకి వచ్చిన వేళ ఈ ప్రమాదం జరగడం టెహ్రాన్కు ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే.. ఆ దేశ వ్యూహాలను నడిపించాల్సిన అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి ఇద్దరూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఎదురు దెబ్బే.
సంప్రదాయ విద్యలో దిట్ట..
రైసీ ఇరాన్లోని బలమైన సంప్రదాయ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన 15వ ఏట క్వామ్లో మత విద్యను అభ్యసించారు. అక్కడే గతంలో ఇరాన్లోని ప్రముఖ ముస్లిం స్కాలర్లు కూడా చదువుకొన్నారు.
* ఆయన్ను 20ఏట ప్రాసిక్యూటర్గా ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత పలు నగరాల్లో విధులు నిర్వహించారు. డిప్యూటీ ప్రాసిక్యూటర్గా రాజధాని టెహ్రాన్కు బదిలీ చేశారు.
* 1983లో జమైలానుమను ఆయన వివాహం చేసుకొన్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
* 1988లో రైసీ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన బాధ్యతలను స్వీకరించారు. రాజకీయ ఖైదీలకు మరణశిక్షలను ఆయన పర్యవేక్షించారు. ఈ పదవితో ఆయన ప్రతిపక్షాల్లో అపఖ్యాతి పాలయ్యారు. అమెరికా కూడా ఆయనపై ఆంక్షలు విధించడానికి కారణమైంది.
* 1989లో ఖొమైనీ మరణం తర్వాత.. టెహ్రాన్ ప్రాసిక్యూటర్గా బాధ్యతలను అందుకొన్నారు. వారసులుగా వచ్చిన ఖమేనీ నీడలో క్రమంగా ఆయన దేశంలో కీలక పదవులను అందుకొన్నారు. 2016లో మషాద్లోని అస్టాన్ ఖుద్స్ రజావీ ఛైర్మన్గా నియమితులయ్యారు.
* 2015లో ఇరాన్ అణుఒప్పందం చేసుకోవడాన్ని రైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. 2017లో నాటి అధ్యక్షుడు హసన్ రౌహానీపై అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ, దేశంలోని అతివాద వర్గం నుంచి బలమైన మద్దతు ఆయనకు లభించింది. నాటి నుంచి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టారు. 2021లో ఆయన కల నెరవేరి.. ఆ ఎన్నికల్లో గెలిచారు. అప్పటికే ట్రంప్ అమెరికాను అణుఒప్పందం నుంచి బయటకు తెచ్చేశారు.
* దివంగత ఖొమైనీ, ప్రస్తుతం సుప్రీం లీడర్ ఖమేనీలతో రైసీకి మంచి సంబంధాలున్నాయి. ఆయన సైన్యం, న్యాయ, పాలన విభాగాలతో అద్భుతమైన సమన్వయంతో పనిచేస్తారనే పేరుంది.
* 2022లో మాషా అమిని అనే యువతిపై ఇరాన్ మోరల్ పోలీసులు దాడి చేసి చంపడంతో రైసీ సర్కారుపై దేశవ్యాప్తంగా తొలిసారి వ్యతిరేకత వచ్చింది. ఈ అల్లర్లలో దాదాపు 500 మంది చనిపోయి ఉంటారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి.
* ఇరాన్-ఇజ్రాయెల్, ఇజ్రాయెల్-హమాస్, హుతీల దుందుడుకు చర్యలు వంటి వివాదాల్లో ఇరాన్ వైఖరిని ఆయనే నిర్దేశించారు. దీనికి తోడు సిరియాలో ఇరాన్ దౌత్యకార్యాలయంపై దాడికి తీవ్రంగా స్పందించారు. నేరుగా ఇజ్రాయెల్పైకి వందల కొద్దీ డ్రోన్లను పంపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్ అవుతోన్న తరుణంలో కమలా హారిస్(Kamala Harris)కు భారీగా మద్దతు లభిస్తోంది. -
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
Kamala Harris: జూమ్ కాల్లో కమలాహారిస్ రికార్డు సృష్టించారు. ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ కోసం చేపట్టిన ఈ కాల్లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు. -
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇథియోపియాలో మట్టిచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. -
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
Barack And Michelle Obama: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలాహారిస్కు ఒబామా దంపతులు మద్దతు తెలిపారు. -
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. దేశ విదేశాంగ విధానం, జాతీయ భద్రతను అధ్యక్షుడు ముందుకుతీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. -
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు